సినిమాల్లో పొలిటికల్ డైలాగులు పెట్టడం.. ప్రభుత్వం లేదా పార్టీల మీద పంచులు వేయడం కామనే. ఏదైనా పార్టీతో సంబంధం ఉన్న వాళ్లు సినిమా తీస్తే.. అవతలి పార్టీకి పంచులు విసురుతుంటారు. టాలీవుడ్లో నందమూరి బాలకృష్ణ సినిమాల్లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి. తెలుగుదేశం పార్టీతో ఆయన అనుబంధం తెలిసిందే కాబట్టి.. ప్రత్యర్థి పార్టీల మీద ఆయన పంచులు వేస్తుంటారు. ఐతే ఇలా రాజకీయాలకు సంబంధం లేని హీరోల సినిమాల్లో కూడా అనుకోకుండా కొన్నిసార్లు పొలిటికల్ పంచులు చూస్తుంటాం.
ఇప్పుడు ‘ధమాకా’ సినిమాలో ఏపీ సర్కారుకు బలంగా తాకేలా ఒక పంచ్ పడింది. కాకపోతే ఆ పంచ్ వేసింది హీరో రవితేజ కాదు. కమెడియన్ హైపర్ ఆది. ఇందులో రావు రమేష్ దగ్గర డ్రైవర్గా పని చేసే పాత్ర చేశాడు ఆది. పేరుకు డ్రైవరే కానీ.. తన ఓనర్ మీద పంచ్ల వర్షం కురిపిస్తుంటాడు ఆది. ఆ డ్రైవర్ వచ్చాక తనకు కలిసొచ్చిందనే కారణంతో అతనేమన్నా పడుతుంటాడు రావు రమేష్.
ఒక సీన్లో రావు రమేష్.. రవితేజను చంపించడానికి రౌడీలను పెడతాడు. వాళ్లకు ఫోన్ చేసి వాడ్ని వేశారా లేదా అని అడుగుతుంటాడు. దానికి ఆది స్పందిస్తూ… “బాబోయ్ అప్పట్నుంచి వేశారా లేదా వేశారా లేదా అంటున్నారు. ఒకటో తారీఖు వచ్చింది నా శాలరీ వేశారా లేదా” అంటూ పంచ్ విసురుతాడు. ఉద్దేశపూర్వకంగా ఈ డైలాగ్ రాశారా లేదా యాదృచ్ఛికమా అన్నది తెలియదు కానీ.. ఈ పంచ్ జగన్ సర్కారుకు తగిలేలా ఉంది.
ఏపీలో ఉద్యోగులకు జీతాలు బాగా ఆలస్యం అవుతుండడం.. నెల మధ్యలోకి వచ్చినా శాలరీ పడక తీవ్ర ఇబ్బందులు పడుతుండడం.. రోజు రోజుకూ పరిస్థితి దిగజారిపోతుండడం.. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పంచ్ జగన్ ప్రభుత్వానికే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా టాలీవుడ్లో వారసత్వంతో వచ్చిన హీరోలకు రవితేజ పంచ్ వేసినట్లుగా ఒక డైలాగ్ ఉంది. నా వెనుక ఎవరున్నారో తెలుసా అని విలన్ అంటే.. “నేను వెనుక ఎవరో ఉంటే పైకి వచ్చిన వాడిని కాదు. వెనుక ఎవరూ లేకపోయినా పైకి రావచ్చని నిరూపించిన వాడిని” అంటూ డైలాగ్ పేల్చడం విశేషం.
తెలుగు సినిమాలకు ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తీసుకురావడం మామూలే. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ల విషయంలో ఎక్కువగా వేరే ఇండస్ట్రీల మీద…
అవసరమున్నా లేకపోయినా.. సీక్వెల్స్కు లీడ్ ఇవ్వడం అన్నది ఈ రోజుల్లో మామూలైపోయింది. అలా హింట్ ఇచ్చిన సినిమాల్లో సెకండ్ పార్ట్…
పెద్ది థియేటర్ రన్ ముగింపు దిశగా వెళ్తోంది. ఈ వీకెండ్ కాస్త పికపయ్యే అవకాశాలున్నాయి. పాత రీ రిలీజులు తప్ప…
ఇటీవలే సింగర్ సునీత మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్త్రీలు 'నా శరీరం నా ఇష్టం' అన్నప్పుడు అవతలి…
గత ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్లో ఆరుగురు సైనికులు వీరమరణం చెందినట్టు కేంద్రం తాజాగా వెల్లడించింది. దాదాపు 13…
రాజమౌళి సినిమాలకు ఎప్పుడూ వచ్చే సమస్య ఒకటుంది. అదే చెప్పిన రిలీజ్ డేట్ కి కట్టుబడకపోవడం. బాహుబలి రెండు భాగాలు,…