ప్రతి వ్యక్తి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటున్న ఈ రోజుల్లో సినిమాల చిత్రీకరణను ఔట్ డోర్లలో చేయడం చాలా చాలా కష్టమైపోతోంది. షూటింగ్ తాలూకు ఫొటోలు, వీడియోలు తీసి వెంటనే సోషల్ మీడియాలో పెట్టేసి వైరల్ చేసేస్తున్నారు. దీంతో చాలా వరకు సినిమాల చిత్రీకరణలు సెట్లలో, కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య చేస్తున్నారు. యూనిట్లో ముఖ్య వ్యక్తులు తప్ప ఎవ్వరూ సెల్ ఫోన్లు తేకుండా నిషేధం విధిస్తున్నారు. ఇంత చేస్తున్నా ఎలాగోలా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అవుతూనే ఉంటాయి.
ఇప్పుడు రామ్ చరణ్ కొత్త చిత్రం విషయంలోనూ ఈ లీకుల బెడద తప్పట్లేదు. ఇంతకుముందే ఈ సినిమాకు సంబంధించి అంతగా స్పష్టత లేని ఫొటోలు కొన్ని లీకయ్యాయి. తాజాగా #RC15 కొన్ని ఫొటోలతో పాటు వీడియోలు కూడా లీక్ కావడం చిత్ర బృందాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. దీనిపై చిత్ర బృందం కొంచెం తీవ్రంగానే స్పందించినట్లు కనిపిస్తోంది.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎక్కువగా రాజమండ్రి ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇంతకుముందే అక్కడ కొన్ని రోజులు చిత్రీకరణ జరిపారు. తాజాగా కొత్త షెడ్యూల్ మొదలుపెట్టగా.. అందుకోసం ఓపెన్ ఏరియాలో వేసిన సెట్ తాలూకు వీడియోతో పాటు చరణ్ కొత్త లుక్ తాలూకు ఫొటోలు కూడా కొన్ని సోషల్ మీడియాలోకి వచ్చినట్లు తెలుస్తోంది. మెగా అభిమానులే కొందరు అత్యుత్సాహంతో ఫొటోలు, వీడియోలు లీక్ చేసి వైరల్ చేస్తున్నారు. దీంతో చిత్ర బృందం వెంటనే స్పందించింది. ఈ ఫొటోలు, వీడియోలు ఎవరైనా షేర్ చేస్తే ట్విట్టర్ అకౌంట్లు లేచిపోతాయని, కఠిన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.
చరణ్ పీఆర్ వర్గాలు కూడా ఈ ఫొటోలు, వీడియోలను ఎవ్వరూ షేర్ చేయొద్దంటూ హెచ్చరికలు జారీ చేయడంతో పాటు అభిమానులకు విన్నపాలు కూడా చేశారు. #RC15 చిత్రీకరణ 60 శాతానికి పైగానే పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.
This post was last modified on December 23, 2022 10:40 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…