ఈ నెల ఆరంభంలో ‘హిట్-2’ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ కాస్త ఊపందుకున్నట్లే కనిపించింది. కానీ ఆ సినిమా తర్వాత థియేటర్లలో కళ తెచ్చే తెలుగు సినిమాలేవీ కనిపించలేదు. రెండో వారంలో వచ్చిన సినిమాలన్నీ దారుణంగా బోల్తా కొట్టాయి. గత వారం వచ్చిన హాలీవుడ్ మూవీ ‘అవతార్-2’ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే రాబడుతూ సాగుతోంది. కాగా క్రిస్మస్ వీకెండ్ను ఉపయోగించుకోవడానికి రెండు పేరున్న తెలుగు చిత్రాలతో పాటు రెండు అనువాదాలు కూడా బరిలోకి దిగుతున్నాయి.
ఇందులో ఎక్కువ అంచనాలున్నది రవితేజ సినిమా ‘ధమాకా’ మీదే. మాస్ రాజా ఈ ఏడాది ఇప్పటికే రెండు డిజాస్టర్లు ఎదుర్కొన్నప్పటికీ.. ‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్’, ‘హలో గురూ ప్రేమ కోసమే’ లాంటి హిట్లు కొట్టిన డైరెక్టర్-రైటర్ ద్వయం త్రినాథరావు-ప్రసన్నకుమార్ చేసిన సినిమా కావడం.. ట్రైలర్ కూడా ఎంటర్టైనింగ్గా అనిపించడంతో సినిమా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. ‘పెళ్ళి సంద-డి’తో ఆకట్టుకున్న శ్రీలీల నటించిన రెండో చిత్రం ఇదే. శుక్రవారం రిలీజవుతున్న ఈ చిత్రానికి పోటీగా నిఖిల్ మూవీ ‘18 పేజెస్’ కూడా దిగుతోంది.
‘కార్తికేయ-2’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దానికి పూర్తి భిన్నంగా లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నిఖిల్. ‘కార్తికేయ-2’ హీరోయిన్ అనుపమ పరమేశ్వరనే ఇందులోనూ కథానాయిక. సుకుమార్ స్క్రిప్టునందించడం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. దీని ట్రైలర్ కూడా ఆకట్టుకుంది.
ఈ రెండు చిత్రాల కంటే ముందు గురువారం థియేటర్లలోకి దిగుతున్నాయి తమిళ అనువాదాలైన లాఠి, కనెక్ట్. ఇందులో విశాల్ నటించిన ‘లాఠి’ రొటీన్ మాస్ మూవీలాగే కనిపిస్తోంది. దానికి పెద్దగా బజ్ లేదు. నయనతార హార్రర్ థ్రిల్లర్ ‘కనెక్ట్’ మాత్రం ఆ జానర్ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి ఈ నాలుగు చిత్రాల్లో దేనికి మంచి టాక్ వస్తుంది..ఏది క్రిస్మస్ విజేతగా నిలుస్తుంది అన్నది చూడాలి.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…