ఈ నెల ఆరంభంలో ‘హిట్-2’ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ కాస్త ఊపందుకున్నట్లే కనిపించింది. కానీ ఆ సినిమా తర్వాత థియేటర్లలో కళ తెచ్చే తెలుగు సినిమాలేవీ కనిపించలేదు. రెండో వారంలో వచ్చిన సినిమాలన్నీ దారుణంగా బోల్తా కొట్టాయి. గత వారం వచ్చిన హాలీవుడ్ మూవీ ‘అవతార్-2’ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే రాబడుతూ సాగుతోంది. కాగా క్రిస్మస్ వీకెండ్ను ఉపయోగించుకోవడానికి రెండు పేరున్న తెలుగు చిత్రాలతో పాటు రెండు అనువాదాలు కూడా బరిలోకి దిగుతున్నాయి.
ఇందులో ఎక్కువ అంచనాలున్నది రవితేజ సినిమా ‘ధమాకా’ మీదే. మాస్ రాజా ఈ ఏడాది ఇప్పటికే రెండు డిజాస్టర్లు ఎదుర్కొన్నప్పటికీ.. ‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్’, ‘హలో గురూ ప్రేమ కోసమే’ లాంటి హిట్లు కొట్టిన డైరెక్టర్-రైటర్ ద్వయం త్రినాథరావు-ప్రసన్నకుమార్ చేసిన సినిమా కావడం.. ట్రైలర్ కూడా ఎంటర్టైనింగ్గా అనిపించడంతో సినిమా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. ‘పెళ్ళి సంద-డి’తో ఆకట్టుకున్న శ్రీలీల నటించిన రెండో చిత్రం ఇదే. శుక్రవారం రిలీజవుతున్న ఈ చిత్రానికి పోటీగా నిఖిల్ మూవీ ‘18 పేజెస్’ కూడా దిగుతోంది.
‘కార్తికేయ-2’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దానికి పూర్తి భిన్నంగా లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నిఖిల్. ‘కార్తికేయ-2’ హీరోయిన్ అనుపమ పరమేశ్వరనే ఇందులోనూ కథానాయిక. సుకుమార్ స్క్రిప్టునందించడం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. దీని ట్రైలర్ కూడా ఆకట్టుకుంది.
ఈ రెండు చిత్రాల కంటే ముందు గురువారం థియేటర్లలోకి దిగుతున్నాయి తమిళ అనువాదాలైన లాఠి, కనెక్ట్. ఇందులో విశాల్ నటించిన ‘లాఠి’ రొటీన్ మాస్ మూవీలాగే కనిపిస్తోంది. దానికి పెద్దగా బజ్ లేదు. నయనతార హార్రర్ థ్రిల్లర్ ‘కనెక్ట్’ మాత్రం ఆ జానర్ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి ఈ నాలుగు చిత్రాల్లో దేనికి మంచి టాక్ వస్తుంది..ఏది క్రిస్మస్ విజేతగా నిలుస్తుంది అన్నది చూడాలి.
This post was last modified on December 22, 2022 8:58 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…