ఈ నెల ఆరంభంలో ‘హిట్-2’ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ కాస్త ఊపందుకున్నట్లే కనిపించింది. కానీ ఆ సినిమా తర్వాత థియేటర్లలో కళ తెచ్చే తెలుగు సినిమాలేవీ కనిపించలేదు. రెండో వారంలో వచ్చిన సినిమాలన్నీ దారుణంగా బోల్తా కొట్టాయి. గత వారం వచ్చిన హాలీవుడ్ మూవీ ‘అవతార్-2’ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే రాబడుతూ సాగుతోంది. కాగా క్రిస్మస్ వీకెండ్ను ఉపయోగించుకోవడానికి రెండు పేరున్న తెలుగు చిత్రాలతో పాటు రెండు అనువాదాలు కూడా బరిలోకి దిగుతున్నాయి.
ఇందులో ఎక్కువ అంచనాలున్నది రవితేజ సినిమా ‘ధమాకా’ మీదే. మాస్ రాజా ఈ ఏడాది ఇప్పటికే రెండు డిజాస్టర్లు ఎదుర్కొన్నప్పటికీ.. ‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్’, ‘హలో గురూ ప్రేమ కోసమే’ లాంటి హిట్లు కొట్టిన డైరెక్టర్-రైటర్ ద్వయం త్రినాథరావు-ప్రసన్నకుమార్ చేసిన సినిమా కావడం.. ట్రైలర్ కూడా ఎంటర్టైనింగ్గా అనిపించడంతో సినిమా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. ‘పెళ్ళి సంద-డి’తో ఆకట్టుకున్న శ్రీలీల నటించిన రెండో చిత్రం ఇదే. శుక్రవారం రిలీజవుతున్న ఈ చిత్రానికి పోటీగా నిఖిల్ మూవీ ‘18 పేజెస్’ కూడా దిగుతోంది.
‘కార్తికేయ-2’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దానికి పూర్తి భిన్నంగా లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నిఖిల్. ‘కార్తికేయ-2’ హీరోయిన్ అనుపమ పరమేశ్వరనే ఇందులోనూ కథానాయిక. సుకుమార్ స్క్రిప్టునందించడం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. దీని ట్రైలర్ కూడా ఆకట్టుకుంది.
ఈ రెండు చిత్రాల కంటే ముందు గురువారం థియేటర్లలోకి దిగుతున్నాయి తమిళ అనువాదాలైన లాఠి, కనెక్ట్. ఇందులో విశాల్ నటించిన ‘లాఠి’ రొటీన్ మాస్ మూవీలాగే కనిపిస్తోంది. దానికి పెద్దగా బజ్ లేదు. నయనతార హార్రర్ థ్రిల్లర్ ‘కనెక్ట్’ మాత్రం ఆ జానర్ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి ఈ నాలుగు చిత్రాల్లో దేనికి మంచి టాక్ వస్తుంది..ఏది క్రిస్మస్ విజేతగా నిలుస్తుంది అన్నది చూడాలి.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…