Movie News

ఫ్లాష్ బ్యాక్ – కథ మారిన పోలీస్ నరసింహనాయుడు

కొన్ని ఫ్లాష్ బ్యాక్ ముచ్చట్లు ఆసక్తికరంగా ఉంటాయి. తృటిలో మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్లు, కోరి చేసుకున్న సూపర్ ఫ్లాపులు, కథలు మారి అద్భుతాలు జరిగిన సందర్భాలు ఎన్నో. అలాంటి వాటిలో ఇదొకటి. 2001లో విడుదలైన నరసింహనాయుడు బాలకృష్ణ అభిమానులకు ఎప్పటికి మర్చిపోలేని ఇండస్ట్రీ హిట్. పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాలో పాటలు ఫైట్లు అన్నీ దేనికవే పోటీ పడుతూ గొప్ప విజయాన్ని అందించాయి. దీని వెనుక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. సమరసింహారెడ్డి తర్వాత బాలయ్య బి గోపాల్ లు మరో సినిమా చేయాలని నిర్మాత మేడికొండ వెంకటరమణకు కమిటయ్యారు.

రచయిత పోసాని కృష్ణమురళి చెప్పిన కథ నచ్చింది. పలు దఫాల చర్చల తర్వాత దాన్ని తీయాలని నిర్ణయించుకున్నారు. తమ కాంబోలోనే వచ్చిన రౌడీ ఇన్స్ పెక్టర్ తరహాలో ఇదీ సెన్సేషన్ అవుతుందన్న నమ్మకం కలిగింది. 2000 ఫిబ్రవరి 10న అక్కినేని నాగేశ్వరరావు గారి క్లాప్ తో బాలకృష్ణ ఖాఖీ డ్రెస్సులో ఉండగా తీసిన షాట్ తో ప్రారంభోత్సవం చేశారు. సౌందర్య సిమ్రాన్ హీరోయిన్లుగా ఎంపికయ్యారు. అంతా బాగానే ఉందనుకుంటున్న టైంలో ఇదెందుకో తన ఇమేజ్ కి వర్కౌట్ కాదనే అనుమానం బాలయ్యతో పాటు బి గోపాల్ కూ వచ్చేసింది. అక్కడితో ఆపేసి వేరే సబ్జెక్టు కోసం వెతుకుంటుండగా చిన్నికృష్ణ వచ్చాడు.

కుటుంబానికొకడు బయటికి వచ్చి ఒక సైన్యంలా మారి శత్రువుల నుంచి ఊరిని కాపాడే బలిదేవుడి లాంటి క్యారెక్టర్ తో వినిపించిన లైన్ బ్రహ్మాండంగా నచ్చేసింది. వెంటనే పరుచూరి బ్రదర్స్ కు కబురు పెట్టడం వాళ్ళు పవర్ ఫుల్ సంభాషణలతో స్క్రిప్ట్ సిద్ధం చేయడం జరిగిపోయాయి. కట్ చేస్తే జరిగిన చరిత్ర తెలిసిందే. పోసాని ఇచ్చిన కథలోనూ హీరో పేరు నరసింహనాయుడే. దాన్ని మాత్రం మార్చకుండా టైటిల్ కు వాడుకున్నారు. బాలకృష్ణ డ్రాప్ అయిన దాన్ని పోసాని శ్రీహరి దగ్గరకు తీసుకెళ్తే అదే అయోధ్య రామయ్యగా రూపాంతరం చెందింది. ఇది జరగకపోయి ఉంటే ఒక క్లాసిక్ మాస్ బొమ్మ మిస్సయేదిగా.

This post was last modified on December 20, 2022 3:27 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

బన్నీ.. పవన్ కోసమేనా అలా?

మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…

20 mins ago

తారక్ బంధం గురించి రాజమౌళి మాట

దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…

1 hour ago

తులం బంగారం రూ.2 లక్షలు!

సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…

1 hour ago

టీడీపీ – జనసేన కూటమి మేనిఫెస్టోపై వైసీపీ భయాలివే.!

టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…

2 hours ago

OG అభిమానుల్లో అయోమయం

ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…

3 hours ago

జగన్ పై షర్మిల మోస్ట్ డామేజింగ్ కామెంట్

క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను క‌డ‌ప…

4 hours ago