కొన్ని ఫ్లాష్ బ్యాక్ ముచ్చట్లు ఆసక్తికరంగా ఉంటాయి. తృటిలో మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్లు, కోరి చేసుకున్న సూపర్ ఫ్లాపులు, కథలు మారి అద్భుతాలు జరిగిన సందర్భాలు ఎన్నో. అలాంటి వాటిలో ఇదొకటి. 2001లో విడుదలైన నరసింహనాయుడు బాలకృష్ణ అభిమానులకు ఎప్పటికి మర్చిపోలేని ఇండస్ట్రీ హిట్. పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాలో పాటలు ఫైట్లు అన్నీ దేనికవే పోటీ పడుతూ గొప్ప విజయాన్ని అందించాయి. దీని వెనుక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. సమరసింహారెడ్డి తర్వాత బాలయ్య బి గోపాల్ లు మరో సినిమా చేయాలని నిర్మాత మేడికొండ వెంకటరమణకు కమిటయ్యారు.
రచయిత పోసాని కృష్ణమురళి చెప్పిన కథ నచ్చింది. పలు దఫాల చర్చల తర్వాత దాన్ని తీయాలని నిర్ణయించుకున్నారు. తమ కాంబోలోనే వచ్చిన రౌడీ ఇన్స్ పెక్టర్ తరహాలో ఇదీ సెన్సేషన్ అవుతుందన్న నమ్మకం కలిగింది. 2000 ఫిబ్రవరి 10న అక్కినేని నాగేశ్వరరావు గారి క్లాప్ తో బాలకృష్ణ ఖాఖీ డ్రెస్సులో ఉండగా తీసిన షాట్ తో ప్రారంభోత్సవం చేశారు. సౌందర్య సిమ్రాన్ హీరోయిన్లుగా ఎంపికయ్యారు. అంతా బాగానే ఉందనుకుంటున్న టైంలో ఇదెందుకో తన ఇమేజ్ కి వర్కౌట్ కాదనే అనుమానం బాలయ్యతో పాటు బి గోపాల్ కూ వచ్చేసింది. అక్కడితో ఆపేసి వేరే సబ్జెక్టు కోసం వెతుకుంటుండగా చిన్నికృష్ణ వచ్చాడు.
కుటుంబానికొకడు బయటికి వచ్చి ఒక సైన్యంలా మారి శత్రువుల నుంచి ఊరిని కాపాడే బలిదేవుడి లాంటి క్యారెక్టర్ తో వినిపించిన లైన్ బ్రహ్మాండంగా నచ్చేసింది. వెంటనే పరుచూరి బ్రదర్స్ కు కబురు పెట్టడం వాళ్ళు పవర్ ఫుల్ సంభాషణలతో స్క్రిప్ట్ సిద్ధం చేయడం జరిగిపోయాయి. కట్ చేస్తే జరిగిన చరిత్ర తెలిసిందే. పోసాని ఇచ్చిన కథలోనూ హీరో పేరు నరసింహనాయుడే. దాన్ని మాత్రం మార్చకుండా టైటిల్ కు వాడుకున్నారు. బాలకృష్ణ డ్రాప్ అయిన దాన్ని పోసాని శ్రీహరి దగ్గరకు తీసుకెళ్తే అదే అయోధ్య రామయ్యగా రూపాంతరం చెందింది. ఇది జరగకపోయి ఉంటే ఒక క్లాసిక్ మాస్ బొమ్మ మిస్సయేదిగా.
This post was last modified on December 20, 2022 3:27 pm
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…