Movie News

‘డీజే టిల్లు-2’లోకి మళ్లీ అనుపమ?

ఈ ఏడాది సెన్సేషనల్ హిట్టయిన ‘డీజే టిల్లు’కు కొనసాగింపుగా సిద్ధు జొన్నలగడ్డ అండ్ టీం చేస్తున్న ‘టిల్లు స్క్వేర్’ కొంత కాలంగా నెగెటివ్ విషయాలతోనే వార్తల్లో నిలుస్తోంది. ముందుగా దర్శకుడి మార్పు చర్చనీయాంశం అయింది. ఆ తర్వాత హీరోయిన్ విషయంలో తర్జన భర్జనలు నడిచాయి.

చివరికి అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రానికి కథానాయికగా ఎంపికై కొన్ని రోజులు షూట్‌లోనూ పాల్గొంది. కానీ ఏమైందో ఏమో ఉన్నట్లుండి ఆమె తప్పుకున్నట్లు సమాచారం బయటికి వచ్చింది. సిద్ధుతో అనుపమకు గొడవ జరిగిందని కొందరు.. లిప్ లాక్స్ సీన్లు నచ్చక ఆమె బయటికి వెళ్లిపోయిందని మరికొందరు మాట్లాడుకున్నారు. కానీ ఈ సినిమా నుంచి అనుపమ తప్పుకోవడం మాత్రం వాస్తవమే అని తేలింది. ఆమె స్థానంలోకి మరో మలయాళ హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ రానున్నట్లు వార్తలొచ్చాయి. కానీ చివరికి ఈ కథలో ఇప్పుడు ఇంకో ట్విస్ట్ వచ్చినట్లు తెలుస్తోంది.

‘టిల్లు స్క్వేర్’లో మడోన్నా కూడా ఖరారు కాలేదట. ఆమెకు లుక్ టెస్ట్ చేశాక సిద్ధు పక్కన, కథానాయిక పాత్రకు సెట్ కాదని తేల్చేశారట. చివరికి అనుపమ అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలదని భావించి ఆమెను మళ్లీ సంప్రదించిందట చిత్ర బృందం. ఇంతకుముందు సమస్య ఎక్కడ వచ్చిందన్నది కచ్చితంగా తెలియదు కానీ.. ఆ సమస్యను పరిష్కరించుకుని తిరిగి ఆమెను ఈ సినిమాలో నటింపజేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇలా ఇగోలు పక్కన పెట్టి చర్చించుకుంటే ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అయిపోతుంది. కాబట్టి ఈ ప్రాజెక్టులోకి అనుపమ తిరిగి రావడం పక్కా అని అంటున్నారు. అంగీకారం కుదిరితే వచ్చే వారం నుంచి మళ్లీ అనుపమ ‘టిల్లు స్క్వేర్’ షూట్‌లో పాల్గొనే అవకాశముంది. నటిగానే కాక వ్యక్తిత్వం విషయంలోనూ అందరితో మంచి మార్కులు వేసుకున్న అనుపమను వదులుకోవడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు?

This post was last modified on December 20, 2022 12:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago