ఈ ఏడాది సెన్సేషనల్ హిట్టయిన ‘డీజే టిల్లు’కు కొనసాగింపుగా సిద్ధు జొన్నలగడ్డ అండ్ టీం చేస్తున్న ‘టిల్లు స్క్వేర్’ కొంత కాలంగా నెగెటివ్ విషయాలతోనే వార్తల్లో నిలుస్తోంది. ముందుగా దర్శకుడి మార్పు చర్చనీయాంశం అయింది. ఆ తర్వాత హీరోయిన్ విషయంలో తర్జన భర్జనలు నడిచాయి.
చివరికి అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రానికి కథానాయికగా ఎంపికై కొన్ని రోజులు షూట్లోనూ పాల్గొంది. కానీ ఏమైందో ఏమో ఉన్నట్లుండి ఆమె తప్పుకున్నట్లు సమాచారం బయటికి వచ్చింది. సిద్ధుతో అనుపమకు గొడవ జరిగిందని కొందరు.. లిప్ లాక్స్ సీన్లు నచ్చక ఆమె బయటికి వెళ్లిపోయిందని మరికొందరు మాట్లాడుకున్నారు. కానీ ఈ సినిమా నుంచి అనుపమ తప్పుకోవడం మాత్రం వాస్తవమే అని తేలింది. ఆమె స్థానంలోకి మరో మలయాళ హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ రానున్నట్లు వార్తలొచ్చాయి. కానీ చివరికి ఈ కథలో ఇప్పుడు ఇంకో ట్విస్ట్ వచ్చినట్లు తెలుస్తోంది.
‘టిల్లు స్క్వేర్’లో మడోన్నా కూడా ఖరారు కాలేదట. ఆమెకు లుక్ టెస్ట్ చేశాక సిద్ధు పక్కన, కథానాయిక పాత్రకు సెట్ కాదని తేల్చేశారట. చివరికి అనుపమ అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలదని భావించి ఆమెను మళ్లీ సంప్రదించిందట చిత్ర బృందం. ఇంతకుముందు సమస్య ఎక్కడ వచ్చిందన్నది కచ్చితంగా తెలియదు కానీ.. ఆ సమస్యను పరిష్కరించుకుని తిరిగి ఆమెను ఈ సినిమాలో నటింపజేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇలా ఇగోలు పక్కన పెట్టి చర్చించుకుంటే ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అయిపోతుంది. కాబట్టి ఈ ప్రాజెక్టులోకి అనుపమ తిరిగి రావడం పక్కా అని అంటున్నారు. అంగీకారం కుదిరితే వచ్చే వారం నుంచి మళ్లీ అనుపమ ‘టిల్లు స్క్వేర్’ షూట్లో పాల్గొనే అవకాశముంది. నటిగానే కాక వ్యక్తిత్వం విషయంలోనూ అందరితో మంచి మార్కులు వేసుకున్న అనుపమను వదులుకోవడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు?
This post was last modified on December 20, 2022 12:52 pm
దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…
దేశంలో అత్యంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి రాజకీయాల వరకు ఎంతో గొప్ప పాత్ర…
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…