ఈ ఏడాది సెన్సేషనల్ హిట్టయిన ‘డీజే టిల్లు’కు కొనసాగింపుగా సిద్ధు జొన్నలగడ్డ అండ్ టీం చేస్తున్న ‘టిల్లు స్క్వేర్’ కొంత కాలంగా నెగెటివ్ విషయాలతోనే వార్తల్లో నిలుస్తోంది. ముందుగా దర్శకుడి మార్పు చర్చనీయాంశం అయింది. ఆ తర్వాత హీరోయిన్ విషయంలో తర్జన భర్జనలు నడిచాయి.
చివరికి అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రానికి కథానాయికగా ఎంపికై కొన్ని రోజులు షూట్లోనూ పాల్గొంది. కానీ ఏమైందో ఏమో ఉన్నట్లుండి ఆమె తప్పుకున్నట్లు సమాచారం బయటికి వచ్చింది. సిద్ధుతో అనుపమకు గొడవ జరిగిందని కొందరు.. లిప్ లాక్స్ సీన్లు నచ్చక ఆమె బయటికి వెళ్లిపోయిందని మరికొందరు మాట్లాడుకున్నారు. కానీ ఈ సినిమా నుంచి అనుపమ తప్పుకోవడం మాత్రం వాస్తవమే అని తేలింది. ఆమె స్థానంలోకి మరో మలయాళ హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ రానున్నట్లు వార్తలొచ్చాయి. కానీ చివరికి ఈ కథలో ఇప్పుడు ఇంకో ట్విస్ట్ వచ్చినట్లు తెలుస్తోంది.
‘టిల్లు స్క్వేర్’లో మడోన్నా కూడా ఖరారు కాలేదట. ఆమెకు లుక్ టెస్ట్ చేశాక సిద్ధు పక్కన, కథానాయిక పాత్రకు సెట్ కాదని తేల్చేశారట. చివరికి అనుపమ అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలదని భావించి ఆమెను మళ్లీ సంప్రదించిందట చిత్ర బృందం. ఇంతకుముందు సమస్య ఎక్కడ వచ్చిందన్నది కచ్చితంగా తెలియదు కానీ.. ఆ సమస్యను పరిష్కరించుకుని తిరిగి ఆమెను ఈ సినిమాలో నటింపజేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇలా ఇగోలు పక్కన పెట్టి చర్చించుకుంటే ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అయిపోతుంది. కాబట్టి ఈ ప్రాజెక్టులోకి అనుపమ తిరిగి రావడం పక్కా అని అంటున్నారు. అంగీకారం కుదిరితే వచ్చే వారం నుంచి మళ్లీ అనుపమ ‘టిల్లు స్క్వేర్’ షూట్లో పాల్గొనే అవకాశముంది. నటిగానే కాక వ్యక్తిత్వం విషయంలోనూ అందరితో మంచి మార్కులు వేసుకున్న అనుపమను వదులుకోవడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు?
This post was last modified on December 20, 2022 12:52 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…