ప్రేక్షకులు చాలు బాబోయ్ కొంచెం బ్రేక్ ఇవ్వండి అంటున్నా రీ రిలీజుల ప్రవాహం ఆగడం లేదు. నెలకు అయిదారు రానిదే నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు వదిలిపెట్టేలా లేరు. ఈ నెల 31న ఇయర్ ఎండింగ్ సందర్భంగా కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ పవన్ కళ్యాణ్ బద్రి విడుదలను ప్లాన్ చేసుకున్నారు.
ఇంతలో ఏమైందో దాన్ని పక్కకు తప్పించేసి వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఫిక్స్ చేసుకున్న ఖుషిని ప్రీ పోన్ చేసి ఈ డిసెంబర్ 31కి తీసుకొస్తున్నారు. కారణాలు బయటికి చెప్పడం లేదు కానీ రీ మాస్టరింగ్ వ్యవహారాలతో పాటు హక్కులకు సంబంధించిన ఏవో లావాదేవీలు ఈ మార్పుకు దారితీసినట్టు టాక్
ఖుషితో పవన్ ఫ్యాన్స్ కి మంచి ఎమోషనల్ కనెక్షన్ ఉంది. 2001లో ఏఏం రత్నం నిర్మాతగా రూపొందిన ఈ సూపర్ కూల్ లవ్ ఎంటర్ టైనర్ అదే టైటిల్ తో తమిళంలో రూపొందిన విజయ్ బ్లాక్ బస్టర్ కి రీమేక్.
ఫ్యాక్షనిజం ఫార్ములా రాజ్యమేలుతున్న టైంలో హీరో హీరోయిన్ల ఈగోలతో కథను అల్లుకుని దర్శకుడు ఎస్జె సూర్య ఇచ్చిన స్వీట్ అండ్ క్యూట్ స్టోరీ ఇండస్ట్రీ రికార్డులను అందించింది. నిర్మాణ సంస్థ సూర్య మూవీస్ మీద కనక వర్షం కురిసింది. ఆ తర్వాత ఆయన మళ్ళీ పవన్ తో బంగారం తీసి నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఆ బంధమే ఇప్పుడు హరిహర వీరమల్లు లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకి దారి తీసింది
వినడానికి బాగానే ఉంది కానీ ఖుషి మళ్ళీ జల్సా తరహాలో కలెక్షన్ల ట్రెండ్ సృష్టిస్తుందా అంటే అనుమానమే. ఎందుకంటే పోకిరి టైంలో కనిపించిన ఈ రీ రిలీజుల హంగామా చెన్నకేశవరెడ్డి దాకా బాగానే సాగింది కానీ ఆ తర్వాతే మెల్లగా రివర్స్ కొడుతోంది.
ఇటీవలే ప్రేమదేశం, మాయాబజార్ లకు దక్కిన పరాభవం గుర్తే. మరి ఖుషి లాంటి ఐకానిక్ మూవీని మళ్ళీ అనుభూతి చెందడానికి ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ఏ మేరకు ఆసక్తి చూపిస్తారో వసూళ్లను చూశాక అర్థం చేసుకోవచ్చు. అన్నట్టు అదే డేట్ కి సింగల్ షోతో చిరంజీవి గ్యాంగ్ లీడర్ ని ప్లాన్ చేశారు. ఇంకెన్ని చూడాల్సి వస్తుందో.
This post was last modified on December 19, 2022 3:36 pm
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…
అదేంటో సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ పదే పదే నోరు జారే తప్పులు చేస్తూనే ఉన్నారు. రాబిన్ హుడ్ టైంలో ఆస్ట్రేలియా…