ప్రేక్షకులు చాలు బాబోయ్ కొంచెం బ్రేక్ ఇవ్వండి అంటున్నా రీ రిలీజుల ప్రవాహం ఆగడం లేదు. నెలకు అయిదారు రానిదే నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు వదిలిపెట్టేలా లేరు. ఈ నెల 31న ఇయర్ ఎండింగ్ సందర్భంగా కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ పవన్ కళ్యాణ్ బద్రి విడుదలను ప్లాన్ చేసుకున్నారు.
ఇంతలో ఏమైందో దాన్ని పక్కకు తప్పించేసి వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఫిక్స్ చేసుకున్న ఖుషిని ప్రీ పోన్ చేసి ఈ డిసెంబర్ 31కి తీసుకొస్తున్నారు. కారణాలు బయటికి చెప్పడం లేదు కానీ రీ మాస్టరింగ్ వ్యవహారాలతో పాటు హక్కులకు సంబంధించిన ఏవో లావాదేవీలు ఈ మార్పుకు దారితీసినట్టు టాక్
ఖుషితో పవన్ ఫ్యాన్స్ కి మంచి ఎమోషనల్ కనెక్షన్ ఉంది. 2001లో ఏఏం రత్నం నిర్మాతగా రూపొందిన ఈ సూపర్ కూల్ లవ్ ఎంటర్ టైనర్ అదే టైటిల్ తో తమిళంలో రూపొందిన విజయ్ బ్లాక్ బస్టర్ కి రీమేక్.
ఫ్యాక్షనిజం ఫార్ములా రాజ్యమేలుతున్న టైంలో హీరో హీరోయిన్ల ఈగోలతో కథను అల్లుకుని దర్శకుడు ఎస్జె సూర్య ఇచ్చిన స్వీట్ అండ్ క్యూట్ స్టోరీ ఇండస్ట్రీ రికార్డులను అందించింది. నిర్మాణ సంస్థ సూర్య మూవీస్ మీద కనక వర్షం కురిసింది. ఆ తర్వాత ఆయన మళ్ళీ పవన్ తో బంగారం తీసి నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఆ బంధమే ఇప్పుడు హరిహర వీరమల్లు లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకి దారి తీసింది
వినడానికి బాగానే ఉంది కానీ ఖుషి మళ్ళీ జల్సా తరహాలో కలెక్షన్ల ట్రెండ్ సృష్టిస్తుందా అంటే అనుమానమే. ఎందుకంటే పోకిరి టైంలో కనిపించిన ఈ రీ రిలీజుల హంగామా చెన్నకేశవరెడ్డి దాకా బాగానే సాగింది కానీ ఆ తర్వాతే మెల్లగా రివర్స్ కొడుతోంది.
ఇటీవలే ప్రేమదేశం, మాయాబజార్ లకు దక్కిన పరాభవం గుర్తే. మరి ఖుషి లాంటి ఐకానిక్ మూవీని మళ్ళీ అనుభూతి చెందడానికి ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ఏ మేరకు ఆసక్తి చూపిస్తారో వసూళ్లను చూశాక అర్థం చేసుకోవచ్చు. అన్నట్టు అదే డేట్ కి సింగల్ షోతో చిరంజీవి గ్యాంగ్ లీడర్ ని ప్లాన్ చేశారు. ఇంకెన్ని చూడాల్సి వస్తుందో.
This post was last modified on December 19, 2022 3:36 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…