ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యధిక అంచనాలతో, అత్యంత భారీ స్థాయిలో విడుదలైన సినిమా ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’. 13 ఏళ్ల కిందట అసాధారణ విజయాన్నందుకుని, ప్రపంచ సినీ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసిన ‘అవతార్’కు కొనసాగింపుగా ఎన్నో ఏల్లు కష్టపడి ఈ సినిమా తీశాడు జేమ్స్ కామెరూన్.
దాదాపు మూడు వేల కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రానికి కనీ వినీ ఎరుగని స్థాయిలో బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కు 2 బిలియన్ డాలర్లు.. అంటే రూపాయల్లో రూ.16 వేల కోట్లు కావడం గమనార్హం. స్వయంగా కామెరూనే ఈ విషయాన్ని వెల్లడించాడు.
ఈ సినిమా ఆ మార్కును అందుకుని హిట్ అనిపించుకుంటేనే తాను అవతార్-4, 5 పార్ట్స్ తీస్తానని.. లేదంటే ఇప్పటికే మేకింగ్ దశలో ఉన్న ‘అవతార్-3’తో ఆపేస్తానని కామెరూన్ ప్రకటించాడు. ఐతే సినిమాకున్న హైప్ ప్రకారం బ్రేక్ ఈవెన్ కష్టమేమీ కాదనుకున్నారు ట్రేడ్ పండిట్లు.
కానీ మిక్స్డ్ రివ్యూస్తో మొదలైన ‘అవతార్-2’ బ్రేక్ ఈవెన్ మార్కును అందుకోవడం కష్టమే అనిపిస్తోంది. తొలి రోజు ఈ చిత్రం 160 మిలియన్ డాలర్ల దాకా కలెక్ట్ చేసింది. వీకెండ్ అయ్యేసరికి వరల్డ్ వైడ్ సినిమా 400 మిలియన్ డాలర్ల మార్కును దాటేలా కనిపిస్తోంది.
వసూళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 500 మిలియన్ డాలర్ల మార్కును దాటేలా లేవు. ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల ఇప్పుడు కొత్త సినిమాల సందడి రెండు మూడు వారాలకు పరిమితం అవుతోంది. తొలి వీకెండ్లో 50 శాతానికి పైగా రికవరీ ఉంటేనే సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఛాన్సుంటుంది.
కానీ ‘అవతార్-2’ తొలి వీకెండ్లో టార్గెట్లో నాలుగో వంతు మాత్రమే కలెక్ట్ చేసేలా కనిపిస్తోంది. ఈ చిత్రం కనీసం నెల రోజుల పాటు నిలకడగా వసూళ్లు రాబడితే తప్ప 2 బిలియన్ మార్కును అందుకోవడం అసాధ్యం. కానీ తొలి వీకెండ్ తర్వాత వసూళ్లు డ్రాప్ అయ్యేలాగే కనిపిస్తున్నాయి. ఫుల్ రన్లో 1.5 బిలియన్ డాలర్ల మార్కును అందుకోవడం కూడా కష్టమే అనిపిస్తోంది.
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…