టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పేరు ఇప్పుడు ఇటు టాలీవుడ్లో, అటు కోలీవుడ్లో చర్చనీయాంశం అవుతోంది. వారసుడు సినిమాకు థియేటర్ల కేటాయింపు విషయమై ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు తమిళనాట దుమారం రేపాయి. తమిళంలో విజయ్ నంబర్ వన్ హీరో అని, కాబట్టి సంక్రాంతికి రిలీజవుతున్న అజిత్ మూవీ కంటే వారిసుకి ఎక్కువ థియేటర్లు ఇవ్వాలని ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై కోలీవుడ్లో పెద్ద చర్చ నడుస్తోంది.
ఈ ఇంటర్వ్యూ బయటికి వచ్చిన ఒక్క రోజులోపే తన ప్రొడక్షన్లో కమెడియన్ వేణు రూపొందించిన బలగం సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లో రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా వాళ్లు రాజు తాజా వ్యాఖ్యలపై తలెత్తిన వివాదం గురించి ఆయన్ని అడిగారు.
దీనికి ఆయన బదులిస్తూ.. మీరు మీడియా వాళ్ళు ఎదో ఒకటి గెలుకుతుంటారు..ఇప్పుడు గెలక్కండి. ఆల్రెడీగెలికింది చాలు.. ఇప్పుడు బలగం సినిమా గురించి మాత్రమే మాట్లాడుదాం అంటూ సమాధానం దాటవేశారు దిల్ రాజు.
కాగా ఈవెంట్ చివర్లో రాజు స్వయంగా ఈ టాపిక్ మీద మాట్లాడుతూ.. తన ఇంటర్వ్యూకు సంబంధించి 20 సెకన్ల వీడియోను మాత్రమే సర్క్యులేట్ చేసి దాని మీద కాంట్రవర్శీ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆ 20 సెకన్లకు ముందు, వెనుక తాను ఏం మాట్లాడానో చూడాలని.. అప్పుడు అసలు విషయం అర్థమవుతుందని.. తాను ఎప్పుడూ కావాలని వివాదాలు క్రియేట్ చేసే వ్యక్తిని కాదని.. ఎవరినీ తక్కువ చేసి మాట్లాడనని.. ఇండస్ట్రీ బాగుండాలని, అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటానని దిల్ రాజు వివరించారు. తన వ్యాఖ్యలపై తమిళనాట తలెత్తిన వివాదం గురించి మాట్లాడుతూ.. తాను అక్కడి వారితో టచ్లో ఉన్నట్లు చెప్పారు.
This post was last modified on December 17, 2022 12:36 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…