మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న ధమాకా మీద ఫ్యాన్స్ లో మంచి అంచనాలున్నాయి. దాని తగ్గట్టే మ్యూజిక్ ఆల్రెడీ జనంలోకి బాగా వెళ్లిపోయింది. ముఖ్యంగా జింతాక్ జిజ్జిన సాంగ్ ఓ రేంజ్ లో ఛార్ట్ బస్టర్ అయ్యింది. క్రాక్ లాంటి పెద్దసక్సెస్ తర్వాత ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ రెండూ తీవ్రంగా నిరాశ పరచడంతో అభిమానులు ఆశలన్నీ దీని మీదే పెట్టుకున్నారు. పెళ్లి సందడితో పరిచయమై సూపర్ డిమాండ్ లో ఉన్న శ్రీలీల హీరోయిన్ కావడం మరో ఆకర్షణ. ఇవాళ ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
స్టోరీని చెప్పీ చెప్పనట్టు మొత్తం గుట్టు విప్పేశారు. ఇందులో ఇద్దరు రవితేజలు. ఒకరేమో జాబు లేక గాలికి ఖాళీగా తిరిగే బాపతు. రెండో వాడేమో తండ్రి సృష్టించిన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుతూ యువతకు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో కష్టపడేవాడు. అమ్మడేమో పగలు ఒకణ్ణి సాయంత్రం మరొకణ్ణి ప్రేమించేస్తుంది. మధ్యలో శత్రువులు వాళ్ళు విసిరే సవాళ్లు వగైరా వగైరా అన్నీ మాస్ యాక్షన్ ప్యాకేజీలో ఏమేం ఉండాలో అన్నీ దిట్టంగా సర్దేశారు. అయితే నిజంగా ఇది డబుల్ ఫోటో బొమ్మనా లేక ఒక రవితేజ ఇద్దరిలా ప్రవర్తిస్తూ ఆడియన్స్ కి షాక్ ఇస్తాడా అనేది సస్పెన్స్.
ఎప్పటిలాగే రవితేజ ఎనర్జీ ధమాకాలోనూ బాగా ఎక్స్ ప్లోర్ అయ్యింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మరోసారి ఫ్యాన్స్ కి ఏం కావాలో దాన్ని అందించే ప్రయత్నం చేశారు. త్రినాధరావు రెగ్యులర్ టెంప్లేట్ లో వెళ్లినట్టు అనిపించినా సీన్స్ లో ఇంటెన్సిటి, సందర్భానుసారంగా పేల్చిన కామెడీ, యాక్షన్ బ్లాక్స్ తతిమ్మా అన్నీ మాస్ జనాలు కోరుకున్నట్టే ఉన్నాయి. ఇప్పుడీ వీడియో చూపించిన రేంజ్ లోనే బొమ్మ ఉంటే మాత్రం హిట్టు ఖాయమే. రెగ్యులర్ బీట్స్ కి భిన్నంగా భీమ్స్ ఇచ్చిన సంగీతం ప్లస్ అయ్యేలా ఉంది. ఈ 23న రాబోతున్న ధమాకా ఎలాంటి పటాకాలు పేలుస్తుందో చూడాలి మరి.
This post was last modified on December 15, 2022 7:23 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…