Movie News

ఫాన్స్ కు పూనకాలు తెప్పించే ఆ డైలాగ్ ఉంటాదా పవన్?

కొన్ని డైలాగులు రిలీజ్ తర్వాత బాగా పాపులర్ అవుతాయి ఎట్రాక్ట్ చేస్తాయి. అలాగే కొన్ని డైలాగులు రిలీజ్ కి ముందే టీజర్, ట్రైలర్ లో నుండి పాపులర్ అవుతాయి. కానీ ఇటివల సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే ఓ డైలాగ్ పాపులర్ అయింది. పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ చేస్తున్న సినిమాలోనిదే ఆ డైలాగ్. ఆచార్య రిలీజ్ టైంలో అనిల్ రావిపూడి రూట్లో కెళ్ళి చిరు , చరణ్ , కొరటాల శివ ను ఓ ఫన్నీ ఇంటర్వ్యూ చేశాడు హరీష్ శంకర్. 

ఆ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సినిమాలో రాబోయే డైలాగ్ లీక్ చేస్తా అంటూ చిరు ఓ డైలాగ్ చెప్పేశాడు. “మొన్న వీడు మన ఇంటికొచ్చి పెద్దగా అరిచినప్పుడు ఏంటి వీడి ధైర్యం అనుకున్నాను. ఇప్పుడర్థమైంది నడిస్తే వీడి వెనుక లక్ష మంది నడుస్తారు… బహుశా ఇదే వీడి ధైర్యమేమో… కదండీ ఆ లక్ష మందికి వాడు ముందు నడుస్తున్నాడనే దైర్యం” ఇదీ ఆ పవర్ ఫుల్ డైలాగ్. ఈ డైలాగ్ చిరు చెప్పడంతో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందరూ ఈ డైలాగ్ పట్టుకొని కథ అల్లేశారు కూడా. 

ఇప్పుడు భవదీయుడు భగత్ సింగ్ కథ మారింది. తమిళ సినిమా తేరి తీసుకొని అటు ఇటు గా కొన్ని కీలక మార్పులతో సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ కొన్నేళ్ళ క్రితం ఆ సినిమా రీమేక్ రైట్స్ తీసుకొని కొందరు దర్శకులతో తీయాలని ప్రయత్నించిన తర్వాత ఫైనల్ గా ఇప్పుడు పవన్ ని ఒప్పించి హరీష్ శంకర్ చేతిలో పెట్టారని టాక్. మేకర్స్ ఇంకా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా సినిమా టైటిల్ కూడా మార్చారు.

భగత్ సింగ్ కి ముందు ఉన్న భవదీయుడు తీసేసి దానికి ఉస్తాద్ అనే పదం చేర్చారు. మరి ఈ సినిమాలో చిరు లీక్ చేసి చెప్పిన హరీష్ శంకర్ పవర్ ఫుల్ డైలాగ్ ఉంటుందా ? లేదా అని పవన్ అభిమానులు సందేహ పడుతున్నారు. ఇప్పుడు కచ్చితంగా హరీష్ ఈ డైలాగ్ సినిమాలో ఎక్కడో ఓ చోట పెట్టాల్సిందే లేదంటే ఫ్యాన్స్ నిరాశ పడటం ఖాయం.

This post was last modified on December 14, 2022 8:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

29 minutes ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

2 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

6 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

7 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

7 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

7 hours ago