కన్నడలో ‘కిరిక్ పార్టీ’ అనే చిన్న సినిమాతో కథానాయికగా పరిచయం అయింది రష్మిక మందన్నా. ఆ సినిమా చేయడానికి ముందు ఆమె ఒక మామూలు కాలేజీ అమ్మాయి. ఏదో ఒక యాడ్లో నటిస్తే దాన్ని ‘కిరిక్ పార్టీ’ దర్శకుడు రిషబ్ శెట్టి చూసి ఇంప్రెస్ అయి కథానాయికగా ఛాన్స్ ఇవ్వడం.. ఆ చిత్రం భారీ విజయన్నందుకుని కన్నడలో రష్మిక మంచి పేరు తెచ్చిపెట్టడం.. ఆ తర్వాత తెలుగులో ‘ఛలో’ సినిమాతో ఎంట్రీ ఇస్తే అదీ సూపర్ హిట్ కావడం.. ఆపై ‘గీత గోవిందం’ బ్లాక్బస్టర్ అయి ఆమెను స్టార్ హీరోయిన్ని చేయడం.. చకచకా జరిగిపోయాయి.
తెలుగులో ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి టాప్ స్టార్లలో నటించేసింది రష్మిక. తమిళంలో ఆమెకు కార్తి, విజయ్లతో జోడీ కట్టేసింది. సంక్రాంతికి విడుదల కాబోతున్న ‘వారిసు’తో తమిళంలో పెద్ద రేంజికి వెళ్లిపోతుందని రష్మిక మీద అంచనాలున్నాయి.
ఐతే సౌత్లో ఎంత ఆధిపత్యం చలాయించినా.. ఇక్కడి హీరోయిన్లు బాలీవుడ్లో జెండా ఎగురవేయడం కష్టమే. ఐతే ‘పుష్ప’ సినిమాతో రష్మికకు ఉత్తరాదిన మంచి క్రేజ్ రావడంతో బాలీవుడ్లోనూ క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కాయి. తొలి సినిమాతోనే అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండరీ యాక్టర్తో నటించే అవకాశం దక్కించుకుంది రష్మిక. కానీ వీరి కలయికలో వచ్చిన ‘గుడ్ బై’ తుస్సుమనిపించింది. రష్మికకు ఈ సినిమా వల్ల ఎలాంటి ప్రయోజనం దక్కలేదు.
ఇక రెండో చిత్రం ‘మిషన్ మజ్ను’తో అయినా రష్మికకు బ్రేక్ వస్తుందేమో అనుకుంటే.. ఆ చిత్రానికి థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేశారు. సిద్దార్థ్ మల్హోత్రా లాంటి ఫాంలో ఉన్న హీరో సినిమా కావడంతో ఇది థియేటర్లలో రిలీజై హిట్టయితే రష్మిక బాలీవుడ్ కెరీర్కు ఊపు వస్తుందని అనుకున్నారు. కానీ ఆ చిత్రం నెట్ఫ్లిక్స్లో నేరుగా రిలీజ్ కాబోతోంది. ఓటీటీల్లో విడుదలైన సినిమాల సక్సెస్ను లెక్కగట్టడం కష్టం. వాటి ఆధారంగా హీరోయిన్లకు అవకాశాలు దక్కడం కష్టం. ఈ సినిమా మిరాకిల్స్ సృష్టిస్తే తప్ప రష్మిక కెరీర్కు ఉపయోపడడం కష్టం. ఇక రష్మిక ఆశలన్నీ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న ‘యానిమల్’ మీదే.
This post was last modified on December 14, 2022 2:23 pm
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…