సోషల్ మీడియా అంటే ఎవరిని ఏమైనా అనేయొచ్చు.. ఎంత పెద్ద కామెంట్ అయినా చేయొచ్చు.. ఫేక్ ఐడెంటిటీతో చంపేస్తా, రేప్ చేస్తా అని బెదిరింపులు కూడా చేయొచ్చు.. ఇదీ కొందరు నెటిజన్ల తీరు. సెలబ్రెటీలనుద్దేశించి ఇలాంటి కామెంట్లు చేయడం చాలా మామూలు విషయం అయిపోయింది.
సెలబ్రెటీలు కూడా ఇలాంటి వాటిని పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. పట్టించుకున్నా ఎంత మందినని డీల్ చేస్తారు. కానీ వదిలేస్తే మరి శ్రుతి మించిపోయి కామెంట్లు, హెచ్చరికలు చేస్తున్నారు నెటిజన్లు. గత నెల బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు పాల్పడినప్పటి నుంచి అతడి ప్రేయసి రియా చక్రవర్తి ఇలాగే టార్గెట్ అయింది నెటిజన్లకు.
సుశాంత్ ఆత్మహత్యకు ఆమే బాధ్యురాలు అంటూ తనపై విరుచుకుపడుతున్నారు. ఈ దాడి ఎంతకీ ఆగకపోవడంతో తాజాగా రియా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ నెటిజన్ నుంచి ఆమెకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ అయ్యాయి. నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపో.. లేదంటే రేప్ చేసి చంపేస్తా అంటూ ఆ నెటిజన్ నుంచి రియాకు బెదిరింపులు వచ్చాయి.
దీని తాలూకు స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేసిన రియా.. తాను ఎంత ఓపిక పడుతున్నప్పటికీ ఇలాంటివి బెదిరింపులు ఆగట్లేదని.. ఇలా బెదిరించే వాళ్లకు ఆ వ్యాఖ్యల తాలూకు తీవ్రత తెలుసా అని ప్రశ్నించింది. వీరిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు సోషల్ మీడియా ద్వారానే ఫిర్యాదు చేసింది. ఇకనైనా ఆమెకు ఈ వేధింపులు ఆగుతాయేమో చూడాలి.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…