సోషల్ మీడియా అంటే ఎవరిని ఏమైనా అనేయొచ్చు.. ఎంత పెద్ద కామెంట్ అయినా చేయొచ్చు.. ఫేక్ ఐడెంటిటీతో చంపేస్తా, రేప్ చేస్తా అని బెదిరింపులు కూడా చేయొచ్చు.. ఇదీ కొందరు నెటిజన్ల తీరు. సెలబ్రెటీలనుద్దేశించి ఇలాంటి కామెంట్లు చేయడం చాలా మామూలు విషయం అయిపోయింది.
సెలబ్రెటీలు కూడా ఇలాంటి వాటిని పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. పట్టించుకున్నా ఎంత మందినని డీల్ చేస్తారు. కానీ వదిలేస్తే మరి శ్రుతి మించిపోయి కామెంట్లు, హెచ్చరికలు చేస్తున్నారు నెటిజన్లు. గత నెల బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు పాల్పడినప్పటి నుంచి అతడి ప్రేయసి రియా చక్రవర్తి ఇలాగే టార్గెట్ అయింది నెటిజన్లకు.
సుశాంత్ ఆత్మహత్యకు ఆమే బాధ్యురాలు అంటూ తనపై విరుచుకుపడుతున్నారు. ఈ దాడి ఎంతకీ ఆగకపోవడంతో తాజాగా రియా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ నెటిజన్ నుంచి ఆమెకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ అయ్యాయి. నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపో.. లేదంటే రేప్ చేసి చంపేస్తా అంటూ ఆ నెటిజన్ నుంచి రియాకు బెదిరింపులు వచ్చాయి.
దీని తాలూకు స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేసిన రియా.. తాను ఎంత ఓపిక పడుతున్నప్పటికీ ఇలాంటివి బెదిరింపులు ఆగట్లేదని.. ఇలా బెదిరించే వాళ్లకు ఆ వ్యాఖ్యల తాలూకు తీవ్రత తెలుసా అని ప్రశ్నించింది. వీరిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు సోషల్ మీడియా ద్వారానే ఫిర్యాదు చేసింది. ఇకనైనా ఆమెకు ఈ వేధింపులు ఆగుతాయేమో చూడాలి.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…