సోషల్ మీడియా అంటే ఎవరిని ఏమైనా అనేయొచ్చు.. ఎంత పెద్ద కామెంట్ అయినా చేయొచ్చు.. ఫేక్ ఐడెంటిటీతో చంపేస్తా, రేప్ చేస్తా అని బెదిరింపులు కూడా చేయొచ్చు.. ఇదీ కొందరు నెటిజన్ల తీరు. సెలబ్రెటీలనుద్దేశించి ఇలాంటి కామెంట్లు చేయడం చాలా మామూలు విషయం అయిపోయింది.
సెలబ్రెటీలు కూడా ఇలాంటి వాటిని పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. పట్టించుకున్నా ఎంత మందినని డీల్ చేస్తారు. కానీ వదిలేస్తే మరి శ్రుతి మించిపోయి కామెంట్లు, హెచ్చరికలు చేస్తున్నారు నెటిజన్లు. గత నెల బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు పాల్పడినప్పటి నుంచి అతడి ప్రేయసి రియా చక్రవర్తి ఇలాగే టార్గెట్ అయింది నెటిజన్లకు.
సుశాంత్ ఆత్మహత్యకు ఆమే బాధ్యురాలు అంటూ తనపై విరుచుకుపడుతున్నారు. ఈ దాడి ఎంతకీ ఆగకపోవడంతో తాజాగా రియా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ నెటిజన్ నుంచి ఆమెకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ అయ్యాయి. నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపో.. లేదంటే రేప్ చేసి చంపేస్తా అంటూ ఆ నెటిజన్ నుంచి రియాకు బెదిరింపులు వచ్చాయి.
దీని తాలూకు స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేసిన రియా.. తాను ఎంత ఓపిక పడుతున్నప్పటికీ ఇలాంటివి బెదిరింపులు ఆగట్లేదని.. ఇలా బెదిరించే వాళ్లకు ఆ వ్యాఖ్యల తాలూకు తీవ్రత తెలుసా అని ప్రశ్నించింది. వీరిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు సోషల్ మీడియా ద్వారానే ఫిర్యాదు చేసింది. ఇకనైనా ఆమెకు ఈ వేధింపులు ఆగుతాయేమో చూడాలి.
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…