కేవలం ఏడాదిన్నర వ్యవధిలో ఎన్నికలు వస్తున్నాయి. జనసేనను నడిపించేందుకు అవసరమైన నిధుల కోసం సినిమాలు చేయక తప్పని పరిస్థితి. పోనీ వచ్చిన కథలల్లా ఒప్పుకుందామా అంటే వాటిలో ఏదైనా తేడా వస్తే అభిమానులు నిరాశ చెందడంతో పాటు అవే ప్రత్యర్థులకు విమర్శకులు చేసే అవకాశాన్ని కలిగించవచ్చు.
అందుకే పవన్ కళ్యాణ్ రిస్క్ లేకుండా రీమేక్ గేమ్ ఆడేందుకే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. తేరి రీమేక్ కు సంబంధించి అందరూ దర్శకుడు హరీష్ శంకర్ ని వేలెత్తి చూపిస్తున్నారు కానీ నిజానికి తను నిమిత్తమాత్రుడు. భవదీయుడు భగత్ సింగ్ లాంటి పవర్ ఫుల్ స్క్రిప్ట్ ఎప్పుడో సిద్ధంగా ఉంచుకున్న పవర్ స్టార్ ఫ్యాన్.
కానీ ఎక్కువ టైం డిమాండ్ చేసే ఏ ప్రాజెక్టూ ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కు వర్కౌట్ కాదు. అందుకే వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చాలా తక్కువ సమయంలో పూర్తి చేయగలిగారు. ఒరిజినల్ వెర్షన్ కి కొన్ని మార్పులు చేయడం వల్ల బడ్జెట్ తో పాటు ఏ అంశంలోనూ ఇబ్బంది లేకుండా అవి సేఫ్ గా బయట పడ్డాయి.
వినోదయ సితం రీమేక్ గురించి ఆలోచించినా, తేరి చేయాలనే నిర్ణయానికి రావాల్సి వచ్చినా ఇదంతా తప్పకే చేస్తున్నాడు. అభిమానులు ఇన్నేసి రీమేక్స్ లో నటించడం ఇష్టం లేదు. నిజమే. అలా అని చూడటం మానేయరుగా. సినిమా నిజంగా బాగుంటే ఇదే సోషల్ మీడియాలో వాళ్లే భుజాన ఎత్తుతారు.
తీసుకునే నిర్ణయాలు వచ్చే ఫలితాలు అన్నింటికి మొదటి బాద్యుడు పవన్ కళ్యాణ్ తప్ప వేరొకరు కాదు. ఏ కథ చేసినా కనీసం వంద కోట్లకు పైగా మార్కెట్ జరుగుతున్న నేపథ్యంలో వేగంగా ఏవి పూర్తవుతాయో వాటికే ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది.
ఒకవేళ థియేటర్లో పెద్దగా వర్కౌట్ కాకపోయినా డిజిటల్ శాటిలైట్ తో లాభాలు గ్యారెంటీగా వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఒకరకంగా ఇలా చేయడమూ కరెక్టే అనిపిస్తుంది. హరిహర విరమల్లు లాంటి విజువల్ గ్రాండియర్, సుజిత్ తో ఫిక్స్ చేసిన గ్యాంగ్ స్టర్ డ్రామా ఎలాగూ ఉన్నాయి కాబట్టి తేరి అయినా మరొకటైనా తప్పుకాదనేది పవన్ ఆలోచన కాబోలు
This post was last modified on December 9, 2022 12:51 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…