ఈ మధ్య స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఓ వివాదంలో చిక్కుకోవడం తెలిసిందే. కన్నడ సినిమాలను గౌరవించట్లేదన్న ఆరోపణలతో ఆమెను శాండిల్ వుడ్ నిర్మాతలు కన్నడ చిత్రాల నుంచి నిషేధిస్తున్నట్లుగా జో్రుగా ప్రచారం జరిగింది. కన్నడ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన కాంతార సినిమాను చూశారా అని మీడియా వాళ్లు అడిగితే లేదని సమాధానం చెప్పడమే ఇందుకు కారణంగా చూపించారు.
అలాగే కాంతార దర్శకుడు రిషబ్ శెట్టిని అగౌరవపరిచేలా ఆమె మాట్లాడిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో రష్మిక గురించి రిషబ్ కొంచెం వ్యంగ్యంగా స్పందించడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై తాజాగా రష్మిక స్పందించింది. తన మీద కన్నడ పరిశ్రమ నిషేధం విధిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆమె స్పష్టం చేసింది.
అంతే కాక తాను కాంతార సినిమా చూశానని.. చిత్ర బృందాన్ని అభినందించడం కూడా జరిగిందని రష్మిక వెల్లడించడం గమనార్హం. ఈ మొత్తం వివాదంపై రష్మిక స్పందిస్తూ.. కాంతార సినిమా విషయంలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. నేను ఆ చిత్రం చూశాను. తర్వాత ఆ టీంను అభినందిస్తూ మెసేజ్ కూడా పెట్టా.
నా వ్యక్తిగత విషయాలను కెమెరా పెట్టి ప్రపంచానికి చూపించలేను. నా మెసేజ్లను బయటకు రిలీజ్ చేయలేను. నా వ్యక్తిగత జీవితం, విషయాల గురించి అందరికీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వృత్తిపరంగా ఏం చేస్తున్నానో అది మాత్రం చెప్పడం నా బాధ్యత. నా మీద కన్నడ ఇండస్ట్రీలో ఎలాంటి నిషేధం విధించలేదు అని రష్మిక స్పష్టం చేసింది. త్వరలోనే విజయ్ వారసుడు మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న రష్మిక.. పుష్ప-2 సహా కొన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది.
This post was last modified on December 9, 2022 8:28 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…