చాలా తక్కువ సినిమాలతోనే తమిళ సినీ చరిత్రలోనే అత్యుత్తమ దర్శకుల్లో ఒకడిగా గుర్తింపు సంపాదించాడు బాలా. విక్రమ్ కెరీర్ను మలుపు తిప్పిన ‘సేతు’తో పాటు నందా, పితామగన్, నాన్ కడవుల్, అవన్ ఇవన్, పరదేశి లాంటి చిత్రాలతో కోలీవుడ్లో కల్ట్ డైరెక్టర్ అనిపించుకున్నాడు బాలా. ఇందులో కమర్షియల్ సక్సెస్ అయిన సినిమాలు తక్కువే అయినా.. బాలాకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. కోలీవుడ్లో అందరూ ఆయన్ని అమితంగా గౌరవిస్తారు.
ఐతే గత కొన్నేళ్లలో బాలా బ్రాండు బాగా దెబ్బ తినేసింది. వరుస పరాజయాలకు తోడు ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘వర్మ’ ఆయనకు చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ఆ సినిమా ఫైనల్ కట్ చూసి బెంబేలెత్తిపోయిన నిర్మాత మొత్తం తీసి డస్ట్ బిన్లో పడేసి ‘అర్జున్ రెడ్డి’ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన గిరీశయ్యను పెట్టి కొత్తగా ఆ సినిమాను పునర్నిర్మించడం బాలాకు పెద్ద అవమానమే.
ఆ దెబ్బ నుంచి కోలుకుని ‘వానమగన్’ అనే ప్రెస్టీజియస్ ప్రాజెక్టును ప్రకటించాడు బాలా. సూర్య హీరోగా ఈ సినిమా తెరకెక్కాల్సింది. ఐతే సినిమా ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇది ముందుకు కదల్లేదు. మధ్యలో సూర్య ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ ప్రచారాన్ని ఖండిస్తూ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో ఈ ప్రాజెక్టు పక్కా అనుకున్నారు.
కానీ తీరా చూస్తే ఈ చిత్రం నుంచి ఇప్పుడు సూర్య తప్పుకున్న విషయాన్ని బాలానే అధికారికంగా ప్రకటించాడు. స్క్రిప్టులో మార్పుల వల్ల సూర్యకు ఈ సినిమా సూట్ కావట్లేదని, అందుకే అతను తప్పుకుంటున్నాడని, మరో హీరోతో ఈ సినిమా రూపొందిస్తానని బాలా ప్రకటించాడు. ఐతే తనకు నందా, పితామగన్ లాంటి క్లాసిక్స్ ఇచ్చిన కృతజ్ఞతతో కష్ట కాలంలో ఉన్న బాలాను సూర్య అయినా ఆదుకుంటాడనుకుంటే ఇలా తప్పుకున్నాడేంటి అని కోలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు.
This post was last modified on December 5, 2022 2:20 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…