చాలా తక్కువ సినిమాలతోనే తమిళ సినీ చరిత్రలోనే అత్యుత్తమ దర్శకుల్లో ఒకడిగా గుర్తింపు సంపాదించాడు బాలా. విక్రమ్ కెరీర్ను మలుపు తిప్పిన ‘సేతు’తో పాటు నందా, పితామగన్, నాన్ కడవుల్, అవన్ ఇవన్, పరదేశి లాంటి చిత్రాలతో కోలీవుడ్లో కల్ట్ డైరెక్టర్ అనిపించుకున్నాడు బాలా. ఇందులో కమర్షియల్ సక్సెస్ అయిన సినిమాలు తక్కువే అయినా.. బాలాకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. కోలీవుడ్లో అందరూ ఆయన్ని అమితంగా గౌరవిస్తారు.
ఐతే గత కొన్నేళ్లలో బాలా బ్రాండు బాగా దెబ్బ తినేసింది. వరుస పరాజయాలకు తోడు ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘వర్మ’ ఆయనకు చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ఆ సినిమా ఫైనల్ కట్ చూసి బెంబేలెత్తిపోయిన నిర్మాత మొత్తం తీసి డస్ట్ బిన్లో పడేసి ‘అర్జున్ రెడ్డి’ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన గిరీశయ్యను పెట్టి కొత్తగా ఆ సినిమాను పునర్నిర్మించడం బాలాకు పెద్ద అవమానమే.
ఆ దెబ్బ నుంచి కోలుకుని ‘వానమగన్’ అనే ప్రెస్టీజియస్ ప్రాజెక్టును ప్రకటించాడు బాలా. సూర్య హీరోగా ఈ సినిమా తెరకెక్కాల్సింది. ఐతే సినిమా ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇది ముందుకు కదల్లేదు. మధ్యలో సూర్య ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ ప్రచారాన్ని ఖండిస్తూ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో ఈ ప్రాజెక్టు పక్కా అనుకున్నారు.
కానీ తీరా చూస్తే ఈ చిత్రం నుంచి ఇప్పుడు సూర్య తప్పుకున్న విషయాన్ని బాలానే అధికారికంగా ప్రకటించాడు. స్క్రిప్టులో మార్పుల వల్ల సూర్యకు ఈ సినిమా సూట్ కావట్లేదని, అందుకే అతను తప్పుకుంటున్నాడని, మరో హీరోతో ఈ సినిమా రూపొందిస్తానని బాలా ప్రకటించాడు. ఐతే తనకు నందా, పితామగన్ లాంటి క్లాసిక్స్ ఇచ్చిన కృతజ్ఞతతో కష్ట కాలంలో ఉన్న బాలాను సూర్య అయినా ఆదుకుంటాడనుకుంటే ఇలా తప్పుకున్నాడేంటి అని కోలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు.
This post was last modified on December 5, 2022 2:20 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…