Movie News

పిల్ల జమీందార్ హీరోయిన్ + కేజీఎఫ్ విలన్

ఫిలిం ఇండస్ట్రీలో మరో ప్రేమ జంట పెళ్లి వైపు అడుగులు వేయడానికి నిర్ణయించుకుంది. ఆ ప్రేమికులిద్దరూ తెలుగు వాళ్లు కాదు కానీ.. తెలుగు సినిమాలతో వారికి టచ్ ఉంది. ఆ జంటనే.. హరిప్రియ, వశిష్ట.సింహా.

కన్నడ అమ్మాయి అయిన హరిప్రియను ఈ మధ్య తెలుగు ప్రేక్షకులు మరిచిపోయి ఉండొచ్చు కానీ.. ఆమె ఒక దశలో తెలుగులో చెప్పుకోగ్గ సినిమాలే చేసింది. నేచురల్ స్టార్ నాని హిట్ మూవీ ‘పిల్ల జమీందారు’లో ఆమే హీరోయిన్. ఈ చిత్రం ఆమెకు తెలుగులో ఏకైక హిట్. ఇది కాక నందమూరి బాలకృష్ణతో ‘జై సింహా’లోనూ ఆమె కథానాయికగా నటించింది. మరి కొన్ని చిన్న సినిమాల్లోనూ నటించింది. ఇక వశిష్ఠ సింహాకు ఎక్కువ పేరు తెచ్చిపెట్టిన సినిమా ‘కేజీఎఫ్’. అందులో నెగెటివ్ రోల్‌లో అతను ఆకట్టుకున్నాడు.

ఈ సినిమా తెచ్చిన గుర్తింపుతో అతను బిజీ ఆర్టిస్టు అయిపోయాడు. తెలుగులో అతను ‘ఓదెల రైల్వే స్టేషన్’ సహా కొన్ని చిత్రాల్లో నటించాడు. హరిప్రియ, వశిష్ఠ కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారట. ఎట్టకేలకు వాళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్న అనంతరం.. *Us’ అని రెండు అక్షరాలు, లవ్ సింబల్ జోడించి బీచ్‌ దగ్గర దిగిన ఒక రొమాంటిక్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి తాము ఎంగేజ్ అయిన విషయాన్ని వెల్లడించింది హరిప్రియ. త్వరలోనే వీరి పెళ్లి జరగబోతోంది.

2007లో తుళు అనే కన్నడ చిత్రంతో కథానాయికగా పరిచయం అయిన హరిప్రియ.. తెలుగులోనే కాక, తమిళంలోనూ కొన్ని సినిమాల్లో నటించింది. తెలుగులో భూమిక నిర్మించిన ‘తకిట తకిట’ ఆమె తొలి చిత్రం. హరిప్రియ నిశ్చితార్థం గురించి వెల్లడించిన సమయంలోనే తమిళ కథానాయిక ప్రియ భవానీ శంకర్‌ సైతం తనకు కాబోయే వరుడిని సోషల్ మీడియాలో పరిచయం చేసింది. అతడి పేరు రాజవేలు. కాలేజీ రోజుల్లో అతడితో ప్రేమలో పడ్డ ప్రియ.. సినిమాల్లో కథానాయికగా ఎదిగాక కూడా తనతో రిలేషన్‌షిప్ కంటిన్యూ చేస్తోంది. వీళ్లిద్దరూ కలిసి కొత్త ఇల్లు కట్టుకున్న సందర్బంగా రాజవేలును ప్రియ సోషల్ మీడియాకు పరిచయం చేసింది. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోనున్నారు.

This post was last modified on December 5, 2022 7:48 am

Share

Recent Posts

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

1 hour ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

1 hour ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

1 hour ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

2 hours ago

బాలయ్య తీసుకునేది తెలివైన నిర్ణయమే

ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…

2 hours ago

హైదరాబాద్‌లో ఇంకా పెద్ద ఐమాక్స్?

దేశంలో సినీ అభిమానం పరంగా టాప్‌లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్‌లో ఈ…

2 hours ago