ఫిలిం ఇండస్ట్రీలో మరో ప్రేమ జంట పెళ్లి వైపు అడుగులు వేయడానికి నిర్ణయించుకుంది. ఆ ప్రేమికులిద్దరూ తెలుగు వాళ్లు కాదు కానీ.. తెలుగు సినిమాలతో వారికి టచ్ ఉంది. ఆ జంటనే.. హరిప్రియ, వశిష్ట.సింహా.
కన్నడ అమ్మాయి అయిన హరిప్రియను ఈ మధ్య తెలుగు ప్రేక్షకులు మరిచిపోయి ఉండొచ్చు కానీ.. ఆమె ఒక దశలో తెలుగులో చెప్పుకోగ్గ సినిమాలే చేసింది. నేచురల్ స్టార్ నాని హిట్ మూవీ ‘పిల్ల జమీందారు’లో ఆమే హీరోయిన్. ఈ చిత్రం ఆమెకు తెలుగులో ఏకైక హిట్. ఇది కాక నందమూరి బాలకృష్ణతో ‘జై సింహా’లోనూ ఆమె కథానాయికగా నటించింది. మరి కొన్ని చిన్న సినిమాల్లోనూ నటించింది. ఇక వశిష్ఠ సింహాకు ఎక్కువ పేరు తెచ్చిపెట్టిన సినిమా ‘కేజీఎఫ్’. అందులో నెగెటివ్ రోల్లో అతను ఆకట్టుకున్నాడు.
ఈ సినిమా తెచ్చిన గుర్తింపుతో అతను బిజీ ఆర్టిస్టు అయిపోయాడు. తెలుగులో అతను ‘ఓదెల రైల్వే స్టేషన్’ సహా కొన్ని చిత్రాల్లో నటించాడు. హరిప్రియ, వశిష్ఠ కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారట. ఎట్టకేలకు వాళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్న అనంతరం.. *Us’ అని రెండు అక్షరాలు, లవ్ సింబల్ జోడించి బీచ్ దగ్గర దిగిన ఒక రొమాంటిక్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి తాము ఎంగేజ్ అయిన విషయాన్ని వెల్లడించింది హరిప్రియ. త్వరలోనే వీరి పెళ్లి జరగబోతోంది.
2007లో తుళు అనే కన్నడ చిత్రంతో కథానాయికగా పరిచయం అయిన హరిప్రియ.. తెలుగులోనే కాక, తమిళంలోనూ కొన్ని సినిమాల్లో నటించింది. తెలుగులో భూమిక నిర్మించిన ‘తకిట తకిట’ ఆమె తొలి చిత్రం. హరిప్రియ నిశ్చితార్థం గురించి వెల్లడించిన సమయంలోనే తమిళ కథానాయిక ప్రియ భవానీ శంకర్ సైతం తనకు కాబోయే వరుడిని సోషల్ మీడియాలో పరిచయం చేసింది. అతడి పేరు రాజవేలు. కాలేజీ రోజుల్లో అతడితో ప్రేమలో పడ్డ ప్రియ.. సినిమాల్లో కథానాయికగా ఎదిగాక కూడా తనతో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తోంది. వీళ్లిద్దరూ కలిసి కొత్త ఇల్లు కట్టుకున్న సందర్బంగా రాజవేలును ప్రియ సోషల్ మీడియాకు పరిచయం చేసింది. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోనున్నారు.
This post was last modified on December 5, 2022 7:48 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…