ఆఖరికి లీకులే నిజమయ్యాయి. పవన్ కళ్యాణ్, సాహో ఫేమ్ సుజిత్ కలయికలో సినిమా అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యింది. అది కూడా ఆర్ఆర్ఆర్ లాంటి ఇంటర్నేషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన డివివి బ్యానర్ కావడంతో అభిమానుల ఆనందం మాములుగా లేదు. ఇటీవలే సుజిత్ పవన్ ని పర్సనల్ గా పలుమార్లు కలుసుకున్నాక దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. దీంతో అభిమానునుల ఆనందం మాములుగా లేదు. పవన్ లుక్ రివీల్ చేయకపోయినా వెనుక నుంచి అతని ఇమేజ్ మీద జపాన్ భాషలో అగ్గి తుపాను వస్తోందని అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టడం వైరల్ అవుతోంది.
దే కాల్ హిం ఓజి(OG) అనే లైన్ కూడా జోడించారు. అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని అప్పుడే నిర్వచనాలు మొదలయ్యాయి. టాప్ టెక్నీషియన్ రవి కె చంద్రన్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. మ్యాటర్ ఇక్కడితో అయిపోలేదు. దీని వెనుక పెద్ద కథే జరిగిందని ఇన్ సైడ్ టాక్. కొంత కాలం క్రితం డివివి దానయ్య చిరంజీవితో వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఓ సినిమా అనౌన్స్ చేశారు. కానీ అది ముందుకు కదల్లేదు. ఫైనల్ వెర్షన్ సంతృప్తికరంగా రాకపోవడంతో డ్రాప్ అయ్యారని వినిపించింది కానీ ఆ తర్వాత ఎలాంటి ఉలుకు పలుకు లేదు. దాని స్థానంలోనే దానయ్యకు ఇప్పుడీ కాంబో ఇచ్చారని వినికిడి.
అంతే కాదు లూసిఫర్ రీమేక్ కు ముందు సుజిత్ ను తీసుకుని తర్వాత వద్దన్న సంగతి తెలిసిందే. ఇంకో మెగా మూవీ ఇస్తామనే హామీ ఇచ్చి పంపేశారు. ఆ కమిట్ మెంట్ కూడా ఇప్పుడీ ఓజి ద్వారా నెరవేర్చారనే టాక్ ఉంది. అంటే వెంకీ కుడుములది వదులుకున్నందుకు దానయ్యకు, గాడ్ ఫాదర్ తప్పించినందుకు సుజిత్ కు ఇలా రెండు రకాలుగా న్యాయం జరిగిందన్న మాట. ఇవన్నీ ఆన్ రికార్డ్ మాటలు కాదు కానీ ధృవ టైపులో లింక్ చేసుకుని చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. బాలు, పంజా తర్వాత పవన్ ఫుల్ లెన్త్ గ్యాంగ్ స్టర్ గా మళ్ళీ కనిపించలేదు. ఇప్పుడు సుజిత్ తనని ఏ రేంజ్ లో చూపించబోతున్నాడో.
This post was last modified on December 4, 2022 11:35 am
హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల యుద్ధం మరో వారం రోజుల్లో ఒక కొలిక్కి రావటంతో పాటు.. ఎన్నికల్లో కీలక అంకమైన…
మాములుగా ఒక చిన్న సినిమా దర్శకుడు డీసెంట్ సక్సెస్ సాధించినప్పుడు అతనికి వెంటనే పెద్ద ఆఫర్లు రావడం అరుదు. రాజావారు…
తీన్మార్ మల్లన్న. నిత్యం మీడియాలో ఉంటూ..తనదైన శైలిలో గత కేసీఆర్ సర్కారును ఉక్కిరిబిక్కిరికి గురి చేసిన చింతపండు నవీన్ గురించి…
ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన మలయాళం సినిమా ఆవేశం తెలుగులో డబ్బింగ్ లేదా రీమేక్ రూపంలో చూడాలని ఫ్యాన్స్…
తెలంగాణలో ఈసారి 17 ఎంపీ స్థానాలకు 12 స్థానాలలో గెలుపు ఖాయం అని బీజేపీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది.…
ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు కొన్ని బాగానే వర్కౌట్ చేసుకున్న నేపథ్యంలో బాక్ అరణ్మనై 4 మీద కాస్తో కూస్తో…