ఆఖరికి లీకులే నిజమయ్యాయి. పవన్ కళ్యాణ్, సాహో ఫేమ్ సుజిత్ కలయికలో సినిమా అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యింది. అది కూడా ఆర్ఆర్ఆర్ లాంటి ఇంటర్నేషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన డివివి బ్యానర్ కావడంతో అభిమానుల ఆనందం మాములుగా లేదు. ఇటీవలే సుజిత్ పవన్ ని పర్సనల్ గా పలుమార్లు కలుసుకున్నాక దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. దీంతో అభిమానునుల ఆనందం మాములుగా లేదు. పవన్ లుక్ రివీల్ చేయకపోయినా వెనుక నుంచి అతని ఇమేజ్ మీద జపాన్ భాషలో అగ్గి తుపాను వస్తోందని అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టడం వైరల్ అవుతోంది.
దే కాల్ హిం ఓజి(OG) అనే లైన్ కూడా జోడించారు. అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని అప్పుడే నిర్వచనాలు మొదలయ్యాయి. టాప్ టెక్నీషియన్ రవి కె చంద్రన్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. మ్యాటర్ ఇక్కడితో అయిపోలేదు. దీని వెనుక పెద్ద కథే జరిగిందని ఇన్ సైడ్ టాక్. కొంత కాలం క్రితం డివివి దానయ్య చిరంజీవితో వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఓ సినిమా అనౌన్స్ చేశారు. కానీ అది ముందుకు కదల్లేదు. ఫైనల్ వెర్షన్ సంతృప్తికరంగా రాకపోవడంతో డ్రాప్ అయ్యారని వినిపించింది కానీ ఆ తర్వాత ఎలాంటి ఉలుకు పలుకు లేదు. దాని స్థానంలోనే దానయ్యకు ఇప్పుడీ కాంబో ఇచ్చారని వినికిడి.
అంతే కాదు లూసిఫర్ రీమేక్ కు ముందు సుజిత్ ను తీసుకుని తర్వాత వద్దన్న సంగతి తెలిసిందే. ఇంకో మెగా మూవీ ఇస్తామనే హామీ ఇచ్చి పంపేశారు. ఆ కమిట్ మెంట్ కూడా ఇప్పుడీ ఓజి ద్వారా నెరవేర్చారనే టాక్ ఉంది. అంటే వెంకీ కుడుములది వదులుకున్నందుకు దానయ్యకు, గాడ్ ఫాదర్ తప్పించినందుకు సుజిత్ కు ఇలా రెండు రకాలుగా న్యాయం జరిగిందన్న మాట. ఇవన్నీ ఆన్ రికార్డ్ మాటలు కాదు కానీ ధృవ టైపులో లింక్ చేసుకుని చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. బాలు, పంజా తర్వాత పవన్ ఫుల్ లెన్త్ గ్యాంగ్ స్టర్ గా మళ్ళీ కనిపించలేదు. ఇప్పుడు సుజిత్ తనని ఏ రేంజ్ లో చూపించబోతున్నాడో.
This post was last modified on December 4, 2022 11:35 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…