జూబ్లీ హిల్స్ ఏంటి. అందులో ప్రభాస్ ఫాం హౌస్ ఏంటి.. అది 84 ఎకరాల్లో ఉండడం ఏంటి.. అని ఆశ్చర్యం కలుగుతోందా? టైమ్స్ నౌ అలాంటి ప్రముఖ పత్రిక ఈ మేరకు ఒక కథనం ప్రచురంచేసింది. లోపల మేటర్లో తెలియకుండా పొరబాటున ఇలా రాసేశారు అనుుకంటే తప్పులో కాలేసినట్లే. చక్కగా Prabhas’ lavish Jubilee Hills farmhouse spread over 84 acres oozes Adipurush actor’s simple taste అని పెద్ద హెడ్డింగ్ పెట్టి మరీ ఈ స్టోరీని పబ్లిష్ చేయడం విశేషం.
ఇంగ్లిష్ మీడియా సెలబ్రెటీల గురించి.. ముఖ్యంగా సౌత్ వాళ్ల గురంచి కథనాలు ప్రచురించేటపుడు ఏమాత్రం గ్రౌండ్ వర్క్ చేస్తుంది.. ఎంత నిర్లక్ష్యంగా కథనాలు వండి వారుస్తుంది చెప్పడానికి ఇది ఉదాహరణ. హైదరాబాద్ సిటీలో మోస్ట్ పోష్ ఏరియాల్లో ఒకటైన జూబ్లీ హిల్స్లో 84 ఎకరాల ఫాం హౌస్ అని రాయడం అంటే ఇంగ్లిష్ జర్నలిస్టులు ఎంత అవగాహన లేమితో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.. అతడి పట్ల ఉత్తరాది జనాల్లో కూడా ఆసక్తి ఉంది.. సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలపై మరింత క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి ఎక్కడో ఢిల్లీలోనో, ముంబయిలోనో కూర్చుని హైదరాబాద్ గురించి కనీస అవగాహన లేకుండా ఈ స్టోరీ రాసినట్లున్నారు. కనీసం హైదరాబాద్తో టచ్ ఉన్న ఎవరితోనూ క్రాస్ చెక్ చేయించినట్లు లేరు.
పైగా ఈ కథనంలో ‘రాధేశ్యామ్’ సినిమాలోని దృశ్యాన్ని వాడుకున్నారు. ఈ స్టోరీ చూసి ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ టైమ్స్ నౌ వాళ్లకు గట్టిగా గడ్డి పెట్టాడు. జూబ్లీ హిల్స్లో 84 ఎకరాలంటే ఏంటో వీళ్లకసలు తెలుసా? ఏదో ఒక చెత్త రాసి, దానికి ఏదో ఒక సెలబ్రెటీ పేరును తగిలించేస్తారంటూ ఆయన మండిపడ్డారు. ఈ కథనంపై ప్రస్తుతం ప్రభాస్తో సినిమా చేస్తున్న మారుతి సైతం స్పందించి కౌంటర్ వేశాడు. ఐతే శోభు ఇలా స్పందించాక కూడా ఆ కథనాన్ని డెలీట్ చేయకుండా అలాగే కొనసాగిస్తుండడం విశేషం.
మోహన్ లాల్ వయసు ప్రస్తుతం 66 సంవత్సరాలు. ఇంకో నాలుగేళ్లు పోతే ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇంత ఏజ్…
భర్త ఎవరితోనో సంబంధం పెట్టుకుంటాడు. భార్యకు అనుమానం వస్తుంది. విషయం రూఢి చేసుకుంటుంది. భర్తను జాగ్రత్తగా గమనిస్తూ.. పరాయి మహిళతో…
ఎట్టకేలకు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి…
మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరలు ఎక్కువ. పైగా పెద్ద సినిమాలు రిలీజైనపుడు అదనపు…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మైకు పట్టడం బాగా తెలుసు. ఆయన మైకు అందుకుంటే.. వినేవారికైనా బోర్ కొడు…
మన తెలుగు ప్రేక్షకులు నిండు మనసుతో భాష భేదం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు వసూళ్లు ఇచ్చి మరీ బ్లాక్…