జూబ్లీ హిల్స్ ఏంటి. అందులో ప్రభాస్ ఫాం హౌస్ ఏంటి.. అది 84 ఎకరాల్లో ఉండడం ఏంటి.. అని ఆశ్చర్యం కలుగుతోందా? టైమ్స్ నౌ అలాంటి ప్రముఖ పత్రిక ఈ మేరకు ఒక కథనం ప్రచురంచేసింది. లోపల మేటర్లో తెలియకుండా పొరబాటున ఇలా రాసేశారు అనుుకంటే తప్పులో కాలేసినట్లే. చక్కగా Prabhas’ lavish Jubilee Hills farmhouse spread over 84 acres oozes Adipurush actor’s simple taste అని పెద్ద హెడ్డింగ్ పెట్టి మరీ ఈ స్టోరీని పబ్లిష్ చేయడం విశేషం.
ఇంగ్లిష్ మీడియా సెలబ్రెటీల గురించి.. ముఖ్యంగా సౌత్ వాళ్ల గురంచి కథనాలు ప్రచురించేటపుడు ఏమాత్రం గ్రౌండ్ వర్క్ చేస్తుంది.. ఎంత నిర్లక్ష్యంగా కథనాలు వండి వారుస్తుంది చెప్పడానికి ఇది ఉదాహరణ. హైదరాబాద్ సిటీలో మోస్ట్ పోష్ ఏరియాల్లో ఒకటైన జూబ్లీ హిల్స్లో 84 ఎకరాల ఫాం హౌస్ అని రాయడం అంటే ఇంగ్లిష్ జర్నలిస్టులు ఎంత అవగాహన లేమితో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.. అతడి పట్ల ఉత్తరాది జనాల్లో కూడా ఆసక్తి ఉంది.. సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలపై మరింత క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి ఎక్కడో ఢిల్లీలోనో, ముంబయిలోనో కూర్చుని హైదరాబాద్ గురించి కనీస అవగాహన లేకుండా ఈ స్టోరీ రాసినట్లున్నారు. కనీసం హైదరాబాద్తో టచ్ ఉన్న ఎవరితోనూ క్రాస్ చెక్ చేయించినట్లు లేరు.
పైగా ఈ కథనంలో ‘రాధేశ్యామ్’ సినిమాలోని దృశ్యాన్ని వాడుకున్నారు. ఈ స్టోరీ చూసి ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ టైమ్స్ నౌ వాళ్లకు గట్టిగా గడ్డి పెట్టాడు. జూబ్లీ హిల్స్లో 84 ఎకరాలంటే ఏంటో వీళ్లకసలు తెలుసా? ఏదో ఒక చెత్త రాసి, దానికి ఏదో ఒక సెలబ్రెటీ పేరును తగిలించేస్తారంటూ ఆయన మండిపడ్డారు. ఈ కథనంపై ప్రస్తుతం ప్రభాస్తో సినిమా చేస్తున్న మారుతి సైతం స్పందించి కౌంటర్ వేశాడు. ఐతే శోభు ఇలా స్పందించాక కూడా ఆ కథనాన్ని డెలీట్ చేయకుండా అలాగే కొనసాగిస్తుండడం విశేషం.
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…