తమిళంలో ఇప్పుడు విజయే నంబర్ వన్ హీరో అనడంలో మరో మాట లేదు. చాలా ఏళ్ల పాటు కోలీవుడ్లో సూపర్ స్టార్ రజినీకాంత్ హవానే నడిచినా.. గత దశాబ్ద కాలంలో ఆయన డౌన్ అవుతూ వచ్చారు. అదే సమయంలో విజయ్ పైపైకి ఎదిగిపోయాడు. అతడి సినిమాల బిజినెస్, కలెక్షన్లు వేరే లెవెల్కు వెళ్లిపోయాయి. విజయ్ సినిమాలు కొన్ని యావరేజ్ కంటెంట్తో 150-200 కోట్ల మేర వసూళ్లు సాధించాయంటే అక్కడ తన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
కానీ తెలుగులో మాత్రం విజయ్ రేంజ్ చాలా తక్కువ. చాలామంది తమిళ స్టార్లలా ఇక్కడ అతను ఫాలోయింగ్ సంపాదంచుకోలేకపోయాడు. పదేళ్ల ముందయితే విజయ్ని, అతడి డబ్బింగ్ సినిమాలను మన ప్రేక్షకులు అసలేమాత్రం పట్టించుకునేవారు కాదు. కానీ తుపాకి, జిల్లా, అదిరింది, బిగిల్, మాస్టర్ లాంటి చిత్రాలతో గత దశాబ్ద కాలంలో తెలుగులో కొంత గుర్తింపు, మార్కెట్ సంపాదించాడు.
ఐతే తెలుగులో ఎన్ని హిట్లు పడ్డా విజయ్ మార్కెట్ పది కోట్లకు అయితే మించే పరిస్థితి లేదు. ఇప్పుడు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు.. విజయ్తో ‘వారిసు’ అనే సినిమా తీస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ‘వారసుడు’ పేరుతో తెలుగులోనూ రిలీజవుతోంది. ఈ సినిమాకు ఎక్కువ థియేటర్లు కేటాయిస్తుండడంపై కొన్ని రోజులుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.
ఈ గొడవ నడుస్తున్న టైంలో విజయ్ సినిమాల్లోకి వచ్చి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అతడి హిట్ చిత్రాల్లో ఒకటైన ‘అదిరింది’కి హైదరాబాద్లో స్పెషల్ షో వేస్తుండడం గమనార్హం. ఇలాంటి స్పెషల్ షోలు ఆయా భాషల్లో స్టార్ హీరోలకు వేస్తుంటారు. తెలుగులో ఇటీవల ఇలాంటి షోల హడావుడి పెరిగిన మాట వాస్తవమే. కానీ విజయ్కి తెలుగులో ఫ్యాన్స్ ఉన్నారని, వాళ్ల కోసం స్పెషల్ షో వేస్తున్నామని చెబితే ఎవరికైనా నవ్వు వస్తుంది. విజయ్ సినిమాలు బాగుంటే ఇక్కడ ఓ మోస్తరుగా ఆడతాయేమో కానీ.. అతడికి డైహార్డ్ ఫ్యాన్స్ ఉండడం, వాళ్లు స్పెషల్ షోలను సెలబ్రేట్ చేయడం అన్నది కామెడీగానే అనిపిస్తుంది. బహుశా ‘వారసుడు’ విడుదలకు ముందు విజయ్కి తెలుగులో క్రేజ్ ఉందని చూపించే ప్రయత్నంలా ఉంది ఈ స్పెషల్ షో వ్యవహారం.
This post was last modified on December 1, 2022 2:25 pm
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…
సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…
పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…