తమిళంలో ఇప్పుడు విజయే నంబర్ వన్ హీరో అనడంలో మరో మాట లేదు. చాలా ఏళ్ల పాటు కోలీవుడ్లో సూపర్ స్టార్ రజినీకాంత్ హవానే నడిచినా.. గత దశాబ్ద కాలంలో ఆయన డౌన్ అవుతూ వచ్చారు. అదే సమయంలో విజయ్ పైపైకి ఎదిగిపోయాడు. అతడి సినిమాల బిజినెస్, కలెక్షన్లు వేరే లెవెల్కు వెళ్లిపోయాయి. విజయ్ సినిమాలు కొన్ని యావరేజ్ కంటెంట్తో 150-200 కోట్ల మేర వసూళ్లు సాధించాయంటే అక్కడ తన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
కానీ తెలుగులో మాత్రం విజయ్ రేంజ్ చాలా తక్కువ. చాలామంది తమిళ స్టార్లలా ఇక్కడ అతను ఫాలోయింగ్ సంపాదంచుకోలేకపోయాడు. పదేళ్ల ముందయితే విజయ్ని, అతడి డబ్బింగ్ సినిమాలను మన ప్రేక్షకులు అసలేమాత్రం పట్టించుకునేవారు కాదు. కానీ తుపాకి, జిల్లా, అదిరింది, బిగిల్, మాస్టర్ లాంటి చిత్రాలతో గత దశాబ్ద కాలంలో తెలుగులో కొంత గుర్తింపు, మార్కెట్ సంపాదించాడు.
ఐతే తెలుగులో ఎన్ని హిట్లు పడ్డా విజయ్ మార్కెట్ పది కోట్లకు అయితే మించే పరిస్థితి లేదు. ఇప్పుడు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు.. విజయ్తో ‘వారిసు’ అనే సినిమా తీస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ‘వారసుడు’ పేరుతో తెలుగులోనూ రిలీజవుతోంది. ఈ సినిమాకు ఎక్కువ థియేటర్లు కేటాయిస్తుండడంపై కొన్ని రోజులుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.
ఈ గొడవ నడుస్తున్న టైంలో విజయ్ సినిమాల్లోకి వచ్చి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అతడి హిట్ చిత్రాల్లో ఒకటైన ‘అదిరింది’కి హైదరాబాద్లో స్పెషల్ షో వేస్తుండడం గమనార్హం. ఇలాంటి స్పెషల్ షోలు ఆయా భాషల్లో స్టార్ హీరోలకు వేస్తుంటారు. తెలుగులో ఇటీవల ఇలాంటి షోల హడావుడి పెరిగిన మాట వాస్తవమే. కానీ విజయ్కి తెలుగులో ఫ్యాన్స్ ఉన్నారని, వాళ్ల కోసం స్పెషల్ షో వేస్తున్నామని చెబితే ఎవరికైనా నవ్వు వస్తుంది. విజయ్ సినిమాలు బాగుంటే ఇక్కడ ఓ మోస్తరుగా ఆడతాయేమో కానీ.. అతడికి డైహార్డ్ ఫ్యాన్స్ ఉండడం, వాళ్లు స్పెషల్ షోలను సెలబ్రేట్ చేయడం అన్నది కామెడీగానే అనిపిస్తుంది. బహుశా ‘వారసుడు’ విడుదలకు ముందు విజయ్కి తెలుగులో క్రేజ్ ఉందని చూపించే ప్రయత్నంలా ఉంది ఈ స్పెషల్ షో వ్యవహారం.
This post was last modified on December 1, 2022 2:25 pm
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…