డిమాండ్ ఉన్న యూత్ హీరోలు లేనంత బిజీగా మాస్ మహారాజా డైరీ చాలా టైట్ అయిపోతోంది. డిజాస్టర్లు పడుతున్నా సరే తన స్పీడ్ మాత్రం ఆగడం లేదు. క్రాక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఆస్వాదించే లోపు ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ ఫలితాలు అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచాయి. అందుకే ధమాకా మీద ఇంకా ఆశించిన స్థాయిలో బజ్ రావడం లేదు. జింతకు జిజిన్న పాట ఓ రేంజ్ లో రెస్పాన్స్ తెచ్చుకుంది కానీ ఆ తర్వాత వచ్చిన సాంగ్ సోసోగానే వెళ్తోంది. డిసెంబర్ 23 విడుదలకు అట్టే సమయం లేదు. ఇరవై రోజులు ఇట్టే కరిగిపోతాయి. ఆలోగా పబ్లిసిటీ వేగం పెంచి హైప్ పెరిగేలా చూసుకోవాలి.
ఇదిలా ఉంటే రేపు రిలీజ్ కాబోతున్న విష్ణు విశాల్ మట్టి కుస్తీకి రవితేజనే నిర్మాణ భాగస్వామి. పోటీగా ఉన్న హిట్ 2తో పోలిస్తే ఈ డబ్బింగ్ మూవీని మనవాళ్ళు లైట్ తీసుకున్నారని బుకింగ్స్ చూస్తే అర్థమవుతోంది. ఒకవేళ అబ్బో అదిరిపోయిందనే టాక్ వస్తే తప్ప పికప్ ఆశించడం కష్టం. దీని తాలూకు వ్యవహారాలపై మాస్ రాజా ఓ కన్నేసి ఉంచాలి. సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకున్న వాల్తేర్ వీరయ్య షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. చిరంజీవితో కాంబినేషన్ సీన్లలో రవితేజ పాల్గొంటున్నారు. దీంతో ఈ కాంబినేషన్ భాగం దాదాపుగా పూర్తవుతుందని సమాచారం.
ఆల్రెడీ చిత్రీకరణ దశలో ఉన్న రావణాసుర, ఈగల్ లను వచ్చే ఏడాది తొలి క్వార్ట్రర్ లోనే ఫినిష్ చేయాల్సి ఉంటుంది. టైగర్ నాగేశ్వరరావు కోసం ప్రత్యేకంగా జుట్టు గెడ్డం పెంచాల్సి ఉంటుంది కాబట్టి ఆలోగా ఇవన్నీ క్లియర్ చేసుకునే ఒత్తిడి రవితేజ మీద ఉంది. మధ్యలో ధమాకా, వాల్తేర్ వీరయ్య ఈవెంట్లు ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వాలి. జయాపజయాల సంగతి ఎలా ఉన్నా ఈ వయసులోనూ మాస్ మహారాజా స్పీడ్ చూస్తుంటే ముచ్చటనిపించక మానదు. ఏడాదికి ఒకటి చేయడమే భారంగా ఫీలవుతున్న ట్రెండ్ లో కొందరు కుర్రహీరోలు తనను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
This post was last modified on December 1, 2022 11:48 am
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…
ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…