మొత్తానికి వచ్చే సంక్రాంతికి బెర్తులైతే కొంచెం ముందుగానే ఖరారైపోయాయి. ఆదిపురుష్ తప్పుకోగానే ఒక క్లారిటీ వచ్చేసింది. తెలుగు నుంచి మెగాస్టార్ చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ చిత్రం వీరసింహారెడ్డి బెర్తులు ఖరారు చేసుకోగా.. తమిళం నుంచి వారసుడు చాలామందే కన్ఫమ్ అయింది.
ఆదిపురుష్ తప్పుకుంది కాబట్టి అజిత్ మూవీ తునివును కూడా లిమిటెడ్ రిలీజ్తో అయితే తెలుగులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా మూడు చిత్రాలకు థియేటర్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. అలాగే రిలీజ్ విషయంలో ఇబ్బంది రాకుండా డేట్లను కూడా సర్దుబాటు చేసుకోవడం కూడా దాదాపు పూర్తయినట్లు సమాచారం. ఆయా నిర్మాణ సంస్థలు డిస్ట్రిబ్యూటర్లకు సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్లపై ఒక క్లారిటీ ఇచ్చేసినట్లు తెలుస్తోంది.
సంక్రాంతికి ముందు రాబోయే సినిమా తునివునే. తమిళంలో ఈ చిత్రానికి జనవరి 11 డేట్ ఫిక్స్ చేశారు. తర్వాతి రోజు వారిసు రిలీజయ్యేలా అక్కడ ఒప్పందం జరిగింది. తెలుగులో కూడా వారసుడు అదే ప్రకారం రిలీజవుతుంది. ఇక్కడ చిరు, బాయల్య సినిమాలు ఒక్కో రోజు వచ్చేలా ప్లానింగ్ జరిగింది.
జనవరి 12న గురువారానికి వీరసింహారెడ్డిని ఖరారు చేయగా.. 13న శుక్రవారం వాల్తేరు వీరయ్యను రిలీజ్ చేయాలని ఈ రెండు చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫిక్సయింది. వీరసింహారెడ్డికి వారసుడుతో క్లాష్ అవుతున్నప్పటికీ అది డబ్బింగ్ సినిమా కాబట్టి పర్వాలేదనుకుంటున్నారు. దాదాపు ఈ లెక్కల ప్రకారమే సంక్రాంతి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. థియేటర్ల అందుబాటును బట్టి తెలుగులో ఇంకైదేనా మిడ్ రేంజ్ సినిమా శనివారం రిలీజయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం. త్వరలోనే సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్ పోస్టర్లు విడుదల కాబోతున్నాయి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…