సమంత లేటెస్ట్ మూవీ యశోదకి ఓటీటీ చిక్కు ఎదురైన సంగతి తెలిసిందే. సినిమా ఓటీటీ రిలీజ్ పై కోర్టు స్టే ఇచ్చింది. విషయంలోకి వెళితే సినిమాలో సరోగశి ఫెసిలిటీ హాస్పిటల్ చూపించారు. దానికి ఈవా అనే పేరు పెట్టారు.
ఇదే పేరుతో హైదరాబాద్ లో ఓ హాస్పిటల్ ఉంది. దీంతో హాస్పిటల్ ఎండీ మోహన్ రావు కోర్టులో కేసు వేశారు. తమ హాస్పిటల్ రిపిటేషన్ దెబ్బ తీసేలా సినిమాలో ఈవా పేరు పెట్టారని కేసు ఫైల్ చేశారాయన. దీంతో తీర్పు వచ్చే వరకు ఓటీటీ రిలీజ్ చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఈ విషయంపై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ పై డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన ఓటీటీ సంస్థ తీవ్ర ఒత్తిడి చేసింది. దీంతో నిర్మాత ఈవా ఎండీ తో మీటింగ్ పెట్టుకొని సమస్యను క్లియర్ చేసుకున్నారు.
ఓటీటీ వర్షన్ లో ఈవా పేరు తొలగించేందుకు అంగీకరించారు నిర్మాత. అలాగే థియేటర్ వర్షన్ లో మార్పు కి కాస్త సమయం కోరారు. థియేటర్ లో పేరు తీయడం ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు మోహన్ రావు ను నిర్మాత టైం అడిగారు. ఈ లోపు ఓటీటీలో సినిమా వచ్చేసే అవకాశం ఉంది. సో యశోద కి చుట్టుకున్న ఇష్యూ క్లియర్ అయిపోయింది. అతి త్వరలోనే సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on November 29, 2022 3:14 pm
ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ…
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…