సమంత లేటెస్ట్ మూవీ యశోదకి ఓటీటీ చిక్కు ఎదురైన సంగతి తెలిసిందే. సినిమా ఓటీటీ రిలీజ్ పై కోర్టు స్టే ఇచ్చింది. విషయంలోకి వెళితే సినిమాలో సరోగశి ఫెసిలిటీ హాస్పిటల్ చూపించారు. దానికి ఈవా అనే పేరు పెట్టారు.
ఇదే పేరుతో హైదరాబాద్ లో ఓ హాస్పిటల్ ఉంది. దీంతో హాస్పిటల్ ఎండీ మోహన్ రావు కోర్టులో కేసు వేశారు. తమ హాస్పిటల్ రిపిటేషన్ దెబ్బ తీసేలా సినిమాలో ఈవా పేరు పెట్టారని కేసు ఫైల్ చేశారాయన. దీంతో తీర్పు వచ్చే వరకు ఓటీటీ రిలీజ్ చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఈ విషయంపై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ పై డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన ఓటీటీ సంస్థ తీవ్ర ఒత్తిడి చేసింది. దీంతో నిర్మాత ఈవా ఎండీ తో మీటింగ్ పెట్టుకొని సమస్యను క్లియర్ చేసుకున్నారు.
ఓటీటీ వర్షన్ లో ఈవా పేరు తొలగించేందుకు అంగీకరించారు నిర్మాత. అలాగే థియేటర్ వర్షన్ లో మార్పు కి కాస్త సమయం కోరారు. థియేటర్ లో పేరు తీయడం ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు మోహన్ రావు ను నిర్మాత టైం అడిగారు. ఈ లోపు ఓటీటీలో సినిమా వచ్చేసే అవకాశం ఉంది. సో యశోద కి చుట్టుకున్న ఇష్యూ క్లియర్ అయిపోయింది. అతి త్వరలోనే సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on November 29, 2022 3:14 pm
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…