సమంత లేటెస్ట్ మూవీ యశోదకి ఓటీటీ చిక్కు ఎదురైన సంగతి తెలిసిందే. సినిమా ఓటీటీ రిలీజ్ పై కోర్టు స్టే ఇచ్చింది. విషయంలోకి వెళితే సినిమాలో సరోగశి ఫెసిలిటీ హాస్పిటల్ చూపించారు. దానికి ఈవా అనే పేరు పెట్టారు.
ఇదే పేరుతో హైదరాబాద్ లో ఓ హాస్పిటల్ ఉంది. దీంతో హాస్పిటల్ ఎండీ మోహన్ రావు కోర్టులో కేసు వేశారు. తమ హాస్పిటల్ రిపిటేషన్ దెబ్బ తీసేలా సినిమాలో ఈవా పేరు పెట్టారని కేసు ఫైల్ చేశారాయన. దీంతో తీర్పు వచ్చే వరకు ఓటీటీ రిలీజ్ చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఈ విషయంపై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ పై డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన ఓటీటీ సంస్థ తీవ్ర ఒత్తిడి చేసింది. దీంతో నిర్మాత ఈవా ఎండీ తో మీటింగ్ పెట్టుకొని సమస్యను క్లియర్ చేసుకున్నారు.
ఓటీటీ వర్షన్ లో ఈవా పేరు తొలగించేందుకు అంగీకరించారు నిర్మాత. అలాగే థియేటర్ వర్షన్ లో మార్పు కి కాస్త సమయం కోరారు. థియేటర్ లో పేరు తీయడం ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు మోహన్ రావు ను నిర్మాత టైం అడిగారు. ఈ లోపు ఓటీటీలో సినిమా వచ్చేసే అవకాశం ఉంది. సో యశోద కి చుట్టుకున్న ఇష్యూ క్లియర్ అయిపోయింది. అతి త్వరలోనే సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on November 29, 2022 3:14 pm
గత కొన్ని రోజులుగా ఇంటర్వ్యూలతో హీరోయిన్ తాప్సీ తెగ హడావుడి చేస్తోంది. కారణం తన బాలీవుడ్ మూవీ అస్సీ ఇటీవలే…
ఇటీవలే విడుదలైన టాక్సిక్ టీజర్ మీద పాజిటివ్, నెగటివ్ రెండు రకాల రియాక్షన్లు సోషల్ మీడియాలో కనిపించాయి. వయొలెన్స్ ఎక్కువయ్యిందని…
నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…