తమిళ స్టార్ హీరో ధనుష్ దృష్టి ఉన్నట్లుండి తెలుగు మార్కెట్ మీద పడింది. ఆల్రెడీ ‘రఘువరన్ బీటెక్’, ‘తిరు’ లాంటి చిత్రాలతో ఇక్కడ కొంత మేర ఫాలోయింగ్ సంపాదించినప్పటికీ.. కేవలం డబ్బింగ్ సినిమాలతో సరిపెట్టకుండా స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులను అలరించాలని ఫిక్సయ్యాడు ధనుష్. ఇందులో భాగంగానే టాలీవుడ్ దర్శకులు శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరిలతో సినిమాలు అనౌన్స్ చేశాడు.
ఇందులో ముందు ప్రకటించిన చిత్రం కమ్ములది కాగా.. లేటుగా అనౌన్స్ అయిన వెంకీ అట్లూరి సినిమా ‘సార్’ను ఆల్రెడీ పూర్తి చేసేశాడు. ఆ చిత్రం విడుదలకు కూడా సిద్ధమవుతోంది. దీన్ని పూర్తి చేశాక ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ అనే మరో చిత్రాన్ని ప్రకటించడం.. అతడి కోసం వేరే ప్రాజెక్టులు కూడా లైన్లో ఉండడంతో కమ్ముల సినిమా మీద సందేహాలు నెలకొన్నాయి. సినిమా ప్రకటించాక దాదాపు ఏడాది పాటు దీని గురించి సౌండే లేకపోవడంతో ఈ చిత్రం ఆగిపోయిందేమో అన్న ప్రచారం కూడా నడిచింది.
ఐతే ఊహాగానాలకు చెక్ పెడుతూ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ సినిమాకు సోమవారం ప్రారంభోత్సవం జరిపారు. ధనుష్ గుబురు గడ్డంతో సరికొత్త లుక్లో కనిపించాడు ఈ వేడుకలో. సంప్రదాయ తమిళ కుర్రాడిలా పంచెకట్టుతో ధనుష్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ నిర్మిస్తున్నాడు. శేఖర్ కమ్ముల సినిమా సినిమాకూ గ్యాప్ తీసుకోవడం మామూలే. స్క్రిప్టు కోసం ఆయన చాలా టైం తీసుకుంటాడు. ధనుష్ సినిమా తన కెరీర్లోనే అత్యంత పెద్దది, పైగా ద్విభాషా చిత్రం కావడంతో ఆయన ఇంకాస్త ఎక్కువ శ్రద్ధే పెట్టినట్లున్నారు.
మిగతా దర్శకుల్లా మీడియాకు టచ్లో ఉంటూ లీక్స్ ఇచ్చే టైపు కాదు ఆయన. అందుకే సినిమా గురించి ఏడాది పాటు సౌండ్ లేదు. సైలెంటుగా స్క్రిప్టు రెడీ చేసి ఇప్పుడు సినిమాకు ప్రారంభోత్సవం జరిపాడు కమ్ముల. ఈ చిత్రంతో పాటు ‘కెప్టెన్ మిల్లర్’ మూవీని సమాంతరంగా పూర్తి చేయబోతున్నాడు ధనుష్. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ధనుష్-కమ్ముల సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on November 28, 2022 5:31 pm
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…