తమిళ స్టార్ హీరో ధనుష్ దృష్టి ఉన్నట్లుండి తెలుగు మార్కెట్ మీద పడింది. ఆల్రెడీ ‘రఘువరన్ బీటెక్’, ‘తిరు’ లాంటి చిత్రాలతో ఇక్కడ కొంత మేర ఫాలోయింగ్ సంపాదించినప్పటికీ.. కేవలం డబ్బింగ్ సినిమాలతో సరిపెట్టకుండా స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులను అలరించాలని ఫిక్సయ్యాడు ధనుష్. ఇందులో భాగంగానే టాలీవుడ్ దర్శకులు శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరిలతో సినిమాలు అనౌన్స్ చేశాడు.
ఇందులో ముందు ప్రకటించిన చిత్రం కమ్ములది కాగా.. లేటుగా అనౌన్స్ అయిన వెంకీ అట్లూరి సినిమా ‘సార్’ను ఆల్రెడీ పూర్తి చేసేశాడు. ఆ చిత్రం విడుదలకు కూడా సిద్ధమవుతోంది. దీన్ని పూర్తి చేశాక ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ అనే మరో చిత్రాన్ని ప్రకటించడం.. అతడి కోసం వేరే ప్రాజెక్టులు కూడా లైన్లో ఉండడంతో కమ్ముల సినిమా మీద సందేహాలు నెలకొన్నాయి. సినిమా ప్రకటించాక దాదాపు ఏడాది పాటు దీని గురించి సౌండే లేకపోవడంతో ఈ చిత్రం ఆగిపోయిందేమో అన్న ప్రచారం కూడా నడిచింది.
ఐతే ఊహాగానాలకు చెక్ పెడుతూ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ సినిమాకు సోమవారం ప్రారంభోత్సవం జరిపారు. ధనుష్ గుబురు గడ్డంతో సరికొత్త లుక్లో కనిపించాడు ఈ వేడుకలో. సంప్రదాయ తమిళ కుర్రాడిలా పంచెకట్టుతో ధనుష్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ నిర్మిస్తున్నాడు. శేఖర్ కమ్ముల సినిమా సినిమాకూ గ్యాప్ తీసుకోవడం మామూలే. స్క్రిప్టు కోసం ఆయన చాలా టైం తీసుకుంటాడు. ధనుష్ సినిమా తన కెరీర్లోనే అత్యంత పెద్దది, పైగా ద్విభాషా చిత్రం కావడంతో ఆయన ఇంకాస్త ఎక్కువ శ్రద్ధే పెట్టినట్లున్నారు.
మిగతా దర్శకుల్లా మీడియాకు టచ్లో ఉంటూ లీక్స్ ఇచ్చే టైపు కాదు ఆయన. అందుకే సినిమా గురించి ఏడాది పాటు సౌండ్ లేదు. సైలెంటుగా స్క్రిప్టు రెడీ చేసి ఇప్పుడు సినిమాకు ప్రారంభోత్సవం జరిపాడు కమ్ముల. ఈ చిత్రంతో పాటు ‘కెప్టెన్ మిల్లర్’ మూవీని సమాంతరంగా పూర్తి చేయబోతున్నాడు ధనుష్. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ధనుష్-కమ్ముల సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on November 28, 2022 5:31 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…