తమిళ స్టార్ హీరో ధనుష్ దృష్టి ఉన్నట్లుండి తెలుగు మార్కెట్ మీద పడింది. ఆల్రెడీ ‘రఘువరన్ బీటెక్’, ‘తిరు’ లాంటి చిత్రాలతో ఇక్కడ కొంత మేర ఫాలోయింగ్ సంపాదించినప్పటికీ.. కేవలం డబ్బింగ్ సినిమాలతో సరిపెట్టకుండా స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులను అలరించాలని ఫిక్సయ్యాడు ధనుష్. ఇందులో భాగంగానే టాలీవుడ్ దర్శకులు శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరిలతో సినిమాలు అనౌన్స్ చేశాడు.
ఇందులో ముందు ప్రకటించిన చిత్రం కమ్ములది కాగా.. లేటుగా అనౌన్స్ అయిన వెంకీ అట్లూరి సినిమా ‘సార్’ను ఆల్రెడీ పూర్తి చేసేశాడు. ఆ చిత్రం విడుదలకు కూడా సిద్ధమవుతోంది. దీన్ని పూర్తి చేశాక ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ అనే మరో చిత్రాన్ని ప్రకటించడం.. అతడి కోసం వేరే ప్రాజెక్టులు కూడా లైన్లో ఉండడంతో కమ్ముల సినిమా మీద సందేహాలు నెలకొన్నాయి. సినిమా ప్రకటించాక దాదాపు ఏడాది పాటు దీని గురించి సౌండే లేకపోవడంతో ఈ చిత్రం ఆగిపోయిందేమో అన్న ప్రచారం కూడా నడిచింది.
ఐతే ఊహాగానాలకు చెక్ పెడుతూ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ సినిమాకు సోమవారం ప్రారంభోత్సవం జరిపారు. ధనుష్ గుబురు గడ్డంతో సరికొత్త లుక్లో కనిపించాడు ఈ వేడుకలో. సంప్రదాయ తమిళ కుర్రాడిలా పంచెకట్టుతో ధనుష్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ నిర్మిస్తున్నాడు. శేఖర్ కమ్ముల సినిమా సినిమాకూ గ్యాప్ తీసుకోవడం మామూలే. స్క్రిప్టు కోసం ఆయన చాలా టైం తీసుకుంటాడు. ధనుష్ సినిమా తన కెరీర్లోనే అత్యంత పెద్దది, పైగా ద్విభాషా చిత్రం కావడంతో ఆయన ఇంకాస్త ఎక్కువ శ్రద్ధే పెట్టినట్లున్నారు.
మిగతా దర్శకుల్లా మీడియాకు టచ్లో ఉంటూ లీక్స్ ఇచ్చే టైపు కాదు ఆయన. అందుకే సినిమా గురించి ఏడాది పాటు సౌండ్ లేదు. సైలెంటుగా స్క్రిప్టు రెడీ చేసి ఇప్పుడు సినిమాకు ప్రారంభోత్సవం జరిపాడు కమ్ముల. ఈ చిత్రంతో పాటు ‘కెప్టెన్ మిల్లర్’ మూవీని సమాంతరంగా పూర్తి చేయబోతున్నాడు ధనుష్. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ధనుష్-కమ్ముల సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on November 28, 2022 5:31 pm
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…