ఒక సినిమా చేస్తున్నపుడు.. ఆ కొంత కాలం హీరో హీరోయిన్లు చాలా సన్నిహితంగా మెలగడం.. వాళ్ల మధ్య ఏదో ఉందని ప్రచారాలు జరగడం మామూలే. బాలీవుడ్లో ఇలాంటివి ప్లాన్ చేసి మరీ చేస్తుంటారు.
ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ ద్వారా కూడా సినిమాకు పబ్లిసిటీ తేవడం కోసం హీరో హీరోయిన్లు చాలా క్లోజ్గా మూవ్ అవుతుంటారు. పనిగట్టుకుని మీడియాలో ఇలా గాసిప్ వార్తలు రాయించే సంస్కృతి కూడా ఉందక్కడ.
మన టాలీవుడ్లో కూడా విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా.. సాయిధరమ్ తేజ్-రెజీనా కసాండ్రా లాంటి జంటలు బయట కూడా సన్నిహితంగా మెలిగి వాళ్ల మధ్య ఏదో ఉందన్న సందేహాలు రేకెత్తించాయి. ఐతే తర్వాత వీళ్ల కాంబినేషన్లకు తెరపడ్డాక ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.
బెల్లంకొండ శ్రీనివాస్-కాజల్ అగర్వాల్ జోడీ వరుసగా ‘సీత’, ‘కవచం’ సినిమాలు చేసినపుడు వాళ్ల మధ్య ఏదో ఉందన్న సందేహాలు కలిగాయి కానీ.. తర్వాత వాళ్లు కూడా ఎవరికి వారు అన్నట్లే ఉన్నారు. ఇద్దరి గురించి ఎలాంటి వార్తలు రాలేదు. కానీ ఇప్పుడు కాజల్.. ఉన్నట్లుండి బెల్లంకొండ శ్రీనివాస్ను మిస్సయిపోతున్నట్లు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్టు పెట్టడం చర్చనీయాంశం అవుతోంది.
శ్రీనివాస్తో షూటింగ్ చేసినప్పటి క్లోజ్ ఫొటో ఒకటి పెట్టి అతణ్ని మిస్సవుతున్నట్లు కాజల్ పేర్కొంది. దీనికి అతను బదులిస్తూ.. తాను కూడా కాజల్ను మిస్సవుతున్నానని, కానీ ఇప్పుడు కలవలేని సమయంలో ఇలా అంటే ఎలా అంటూ రొమాంటిగ్గా స్పందించాడు.
వీళ్లిద్దరూ ఏ ఉద్దేశంతో మాట్లాడుకుంటున్నారో ఏమో కానీ.. ఈ టైంలో ఇద్దరూ ఇలాంటి పోస్టులు పెట్టేసరికి జనాలకు రకరకాల సందేహాలు కలుగుతున్నాయి. నిజంగా ఇద్దరి మధ్య ఏమైనా ఉందా అని అనుమానిస్తున్నారు.
This post was last modified on July 15, 2020 5:18 pm
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…