బ్లాక్ బస్టర్లను రీ రిలీజ్ చేయడం ఇటీవలి కాలంలో పెద్ద ట్రెండ్ గా మారిపోయింది. ఫ్యాన్స్ కూడా వాటిని బాగా ఎంజాయ్ చేస్తూ ఏకంగా కొత్త రిలీజుల రేంజ్లో హంగామా ప్లస్ కలెక్షన్లు ఇస్తున్నారు. సరే ఇవంటే హిట్లు కాబట్టి ఓకే. కానీ అదే పనిగా డిజాస్టర్లను కూడా తిరిగి థియేటర్లకు తీసుకురావడమే వింత పోకడగా మారుతోంది. ఆ మధ్య ప్రభాస్ రెబల్ ను ఇలాగే విడుదల చేస్తే అభిమానులు సైతం పెద్దగా పట్టించుకోలేదు. ఒకటి రెండు సింగల్ స్క్రీన్లలో తప్ప మిగిలిన చోట్ల వచ్చిన రెస్పాన్స్ సోసోనే. బిల్లా కొంచెం మెరుగ్గా ఆడితే అదే పనిగా తీసుకొచ్చినందుకు వర్షం ఇబ్బందుల పడక తప్పలేదు.
ఇప్పుడీ కోవలో రామ్ చరణ్ ఆరెంజ్ కూడా వస్తోందట. నిన్న ఈ మూవీ 12వ యానివర్సరీ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు దాని తాలూకు జ్ఞాపకాలు, పాటలు షేర్ చేసుకుని అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లారు. దీన్ని మళ్ళీ రిలీజ్ చేస్తే చూస్తామంటూ కొందరు నిర్మాత నాగబాబుకి ట్యాగ్ చేశారు. ఆయనా స్పందించి త్వరలోనే స్పెషల్ అకేషన్ లో ప్లాన్ చేస్తామని హామీ ఇచ్చేశారు. నిజానికి మగధీర తర్వాత ఆరెంజ్ అట్లాంటి ఇట్లాంటి ఫ్లాప్ కాదు. ఇదే నాగబాబు ఒక ఇంటర్వ్యూలో దీని నష్టాలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని చెప్పడం అప్పట్లో సంచలనం.
హరీష్ జైరాజ్ ఇచ్చిన అద్భుతమైన పాటలు, నేపధ్య సంగీతం ఒక్కటే ఆరెంజ్ కున్న అతి పెద్ద ప్లస్ పాయింట్స్. ఇప్పుడు గొప్పగా ఉందని కల్ట్ క్లాసిక్ అని చెప్పుకుంటున్న ఫాన్సే ఆ టైంలోనే రెండోసారి చూడలేక ఫ్లాప్ చేశారు. ముఖ్యంగా జెనీలియా ఓవర్ యాక్షన్ మీద నెగటివ్ కామెంట్స్ పెద్ద ఎత్తున వచ్చాయి. యూత్ కి కనెక్ట్ అయిన కొన్ని అంశాలే యుట్యూబ్ లో, ఆన్ లైన్ లో మళ్ళీ మళ్ళీ చూసేలా చేశాయి తప్పించి నిజానికి ఆరెంజ్ ఏ కాలంలో చూసినా ఫీలింగ్ లో పెద్ద తేడా ఉండదు. మరి నాగబాబు నిజంగా రీ మాస్టర్ చేయించి ఇస్తారా లేక ఏదో యథాలాపంగా అనేశారా వేచి చూడాలి.
This post was last modified on November 28, 2022 8:53 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…