బాస్ పార్టీ చార్ట్ బస్టర్ అయ్యాక మెగా ఫ్యాన్స్ లో ఒక్కసారిగా ఉత్సాహమొచ్చేసింది. దేవిశ్రీ ప్రసాద్ ప్రోమో మొదట్లో టెన్షన్ పెట్టినా చివరికి పాట జనంలోకి వెళ్లిపోవడంతో హ్యాపీ అయ్యారు. నెక్స్ట్ రవితేజ పాత్ర ఇంట్రో, ఆ తరువాత ఇద్దరి కాంబినేషన్ లో షూట్ చేసిన పూనకాలు లోడింగ్ సాంగ్ వచ్చేస్తాయి. ఇవన్నీ డిసెంబర్ రెండో వారంలోపే వదలబోతున్నట్టు సమాచారం. సినిమాకు సంబంధించిన కొన్ని లీక్స్ ఒక్కొకటిగా బయటకి వస్తూ అభిమానుల్లో ఎగ్జై మెంట్ పెంచే దిశగా ఉన్నాయి. అందులో కీలకమైన ఒక ఎపిసోడ్ గురించిన టాక్ అంచనాలు పెంచేలా ఉంది.
ఇందులో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి పోర్టులో దందాలు చేసే లోకల్ మాస్ లీడర్. ఈ ఇద్దరి మధ్య క్లాష్ జరిగే సన్నివేశాన్ని ఇంటర్వెల్ గా సెట్ చేశారట దర్శకుడు బాబీ. ఇద్దరూ పరస్పరం చేసుకునే ఛాలెంజులు ఓ రేంజ్ లో గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంటాయని వినికిడి. మణిరత్నం ఘర్షణ, బలరామకృష్ణులు టైపులో వీళ్ళు సవతి అన్నదమ్ములుగా నటిస్తున్నారన్న టాక్ ఆల్రెడీ ఉంది. ఇది కూడా వాస్తవమేనట. అయితే మాస్ మహారాజా క్యారెక్టర్ తాలూకు ఎండింగ్ గురించి ట్విస్టు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే పెట్టారు.
విడుదలకు ఇంకో నెలన్నరే ఉన్న నేపథ్యంలో పబ్లిసిటీ వేగాన్ని పెంచాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. వీరసింహారెడ్డి కూడా తమ బ్యానరే కావడంతో ఈ రెండు బాలన్స్ చేసుకోవడం మైత్రి అధినేతలకు పెద్ద సవాల్ గా పరిణమించింది. ఇప్పటిదాకా వచ్చింది ఒక్క పాటే కనక పోలికల పరంగా మరీ ఎక్కువ ఇబ్బంది కలగలేదు. ఇకపై కూడా ఇలాగే సాఫీగా ఉంటే ఎలాంటి సమస్య లేదు. వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి మొదటి వారంలో హైదరాబాద్ లోనే జరిపేలా ప్లానింగ్ జరుగుతోంది. వీరసింహారెడ్డిది సీమజిల్లాలో ఒక చోట చేయొచ్చు.
This post was last modified on November 27, 2022 11:22 am
ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో లోకేష్ కనకరాజ్ ఒకడు. ఖైదీ, విక్రమ్ చిత్రాలతో అతను తెచ్చుకున్న క్రేజ్ అంతా…
రాష్ట్రంలో కీలకమైన నాలుగు రాజ్యసభ ఖాళీ అవుతున్నాయి. వీటిలో మూడు వైసీపీకి చెందిన నాయకులవి కాగా ఒకటి టిడిపికి చెందిన…
ఐపీఎల్-2026లో అత్యధిక క్రేజ్ దక్కించుకున్న మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు ఒకటి. మే 22న ఉప్పల్లోని రాజీవ్…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు తీస్తున్నారు.…
తెలుగు దేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు ఈ దఫా సరికొత్తగా జరగనుంది. ఏటా మే నెల 27,28 తేదీల్లో…
ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి…