బాస్ పార్టీ చార్ట్ బస్టర్ అయ్యాక మెగా ఫ్యాన్స్ లో ఒక్కసారిగా ఉత్సాహమొచ్చేసింది. దేవిశ్రీ ప్రసాద్ ప్రోమో మొదట్లో టెన్షన్ పెట్టినా చివరికి పాట జనంలోకి వెళ్లిపోవడంతో హ్యాపీ అయ్యారు. నెక్స్ట్ రవితేజ పాత్ర ఇంట్రో, ఆ తరువాత ఇద్దరి కాంబినేషన్ లో షూట్ చేసిన పూనకాలు లోడింగ్ సాంగ్ వచ్చేస్తాయి. ఇవన్నీ డిసెంబర్ రెండో వారంలోపే వదలబోతున్నట్టు సమాచారం. సినిమాకు సంబంధించిన కొన్ని లీక్స్ ఒక్కొకటిగా బయటకి వస్తూ అభిమానుల్లో ఎగ్జై మెంట్ పెంచే దిశగా ఉన్నాయి. అందులో కీలకమైన ఒక ఎపిసోడ్ గురించిన టాక్ అంచనాలు పెంచేలా ఉంది.
ఇందులో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి పోర్టులో దందాలు చేసే లోకల్ మాస్ లీడర్. ఈ ఇద్దరి మధ్య క్లాష్ జరిగే సన్నివేశాన్ని ఇంటర్వెల్ గా సెట్ చేశారట దర్శకుడు బాబీ. ఇద్దరూ పరస్పరం చేసుకునే ఛాలెంజులు ఓ రేంజ్ లో గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంటాయని వినికిడి. మణిరత్నం ఘర్షణ, బలరామకృష్ణులు టైపులో వీళ్ళు సవతి అన్నదమ్ములుగా నటిస్తున్నారన్న టాక్ ఆల్రెడీ ఉంది. ఇది కూడా వాస్తవమేనట. అయితే మాస్ మహారాజా క్యారెక్టర్ తాలూకు ఎండింగ్ గురించి ట్విస్టు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే పెట్టారు.
విడుదలకు ఇంకో నెలన్నరే ఉన్న నేపథ్యంలో పబ్లిసిటీ వేగాన్ని పెంచాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. వీరసింహారెడ్డి కూడా తమ బ్యానరే కావడంతో ఈ రెండు బాలన్స్ చేసుకోవడం మైత్రి అధినేతలకు పెద్ద సవాల్ గా పరిణమించింది. ఇప్పటిదాకా వచ్చింది ఒక్క పాటే కనక పోలికల పరంగా మరీ ఎక్కువ ఇబ్బంది కలగలేదు. ఇకపై కూడా ఇలాగే సాఫీగా ఉంటే ఎలాంటి సమస్య లేదు. వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి మొదటి వారంలో హైదరాబాద్ లోనే జరిపేలా ప్లానింగ్ జరుగుతోంది. వీరసింహారెడ్డిది సీమజిల్లాలో ఒక చోట చేయొచ్చు.
దశాబ్దానికి పైగా సమయం దాటిపోయినా అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ కు ఇంకా సాలిడ్ బ్లాక్ బస్టర్ పడలేదు.…
వైసీపీ ఏపీలో డీలా పడిన విషయం తెలిసిందే. గత 2024 ఎన్నికల వరకు 151 మంది ఎమ్మెల్యేలతో కళకళ లాడిన…
ఏది జరిగినా మంచికే అని పెద్దలు ఊరికే అనలేదు. సమంతకు ఇది ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తోంది. ఖుషి తర్వాత బాగా…
హీరోలు నిర్మాతలు కావడం కొత్తేమి కాదు. చిరంజీవి పీక్స్ లో ఉన్నప్పుడే అంజనా ప్రొడక్షన్స్ స్థాపించారు. కార్డు నాగబాబు పేరు…
వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడుపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం…
వైసీపీ అధినేత జగన్పై ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో…