నవంబరు నెలలో టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డల్లుగా నడుస్తోంది. టాక్ బాగున్న సినిమాలు కూడా అనుకున్నంతగా ఆడే పరిస్థితి కనిపించడం లేదు. అయినా సరే ప్రతి వారం కొత్త సినిమాలు వస్తూనే ఉణ్నాయి. ఈ వారానికి మూడు సినిమాలు థియేటర్లలోకి దిగాయి. అందులో ఒకటి అల్లరి నరేష్ సినిమా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ కాగా.. మిగతా రెండూ డబ్బింగ్ చిత్రాలైన ‘లవ్ టుడే’, ‘తోడేలు’. ఈ మూడు చిత్రాల్లో బాక్సాఫీస్ దగ్గర ఆధిపత్యం చలాయిస్తుందని ట్రేడ్ పండిట్లు అంచనా వేసిన సినిమా ‘లవ్ టుడే’.
ప్రదీప్ రంగనాథన్ అనే యువ దర్శకుడు తనే లీడ్ రోల్ చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం ఆల్రెడీ తమిళంలో బ్లాక్బస్టర్ అయింది. విడుదలైన నాలుగో వారంలోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమా చూసి ఫిదా అయిపోయిన దిల్ రాజు తెలుగులో ఈ చిత్రాన్ని పెద్ద స్థాయిలో రిలీజ్ చేశాడు. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోయినా.. రిలీజ్ తర్వాత సినిమా కచ్చితంగా జోరు చూపిస్తుందని రాజు అంచనా వేశాడు.
రాజు అంచనా వేసినట్లే ‘లవ్ టుడే’ రిలీజ్ రోజు సాయంత్రం నుంచి బలంగా పుంజుకుంది. మార్నింగ్ షోలకు ఆక్యుపెన్సీ ఓ మోస్తరుగా కనిపించింది. ఐతే ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, తోడేలు చిత్రాలతో పోలిస్తే ఆ షోలకు కూడా బెటర్ ఆక్యుపెన్సీనే తెచ్చుకుంది ‘లవ్ టుడే’. ఇక పాజిటివ్ టాక్, రివ్యూలు సినిమాకు కలిసొచ్చి సాయంత్రానికి సినిమా దూకుడు పెంచింది.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో కొత్త సినిమాల కలెక్షన్ల లెక్కలు చూస్తే దేని పరిస్థితి ఏంటో స్పష్టంగా తెలిసిపోతుంది. అక్కడ సుదర్శన్ థియేటర్లో శుక్రవారం సెకండ్ షోకు ‘లవ్ టుడే’ 1.21 లక్షల గ్రాస్ కలెక్ట్ చేయగా.. దేవి థియేటర్లలో ‘ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం’ 18 వేలకు దగ్గరగా కలెక్షన్లు తెచ్చుకుంది. సంధ్యలో ‘తోడేలు’ చిత్రానికి 15 వేల వసూళ్లు వచ్చాయి. మిగతా రెండు చిత్రాల వసూళ్లు కలిపినా ‘లవ్ టుడే’ వసూళ్లలో నాలుగో వంతు ఉన్నాయంటే ఆ సినిమా దూకుడు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. వీకెండ్లో ఈ సినిమా హౌస్ ఫుల్ వసూళ్లతో దూసుకెళ్లేలా కనిపిస్తోంది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…