అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ మధ్య ఏ సినిమాకూ ఇవ్వనంత హైప్, ఎలివేషన్ ‘లవ్ టుడే’ అనే తమిళ అనువాద చిత్రానికి ఇచ్చాడు. తమిళంలో ఈ నెల ఆరంభంలో విడుదలై బ్లాక్ బస్టర్ అయింది ఈ చిత్రం. దీన్ని ముందు రీమేక్ చేద్దామని చూసి.. ఆ తర్వాత ఆలోచన మార్చుకుని డబ్ చేసి రిలీజ్ చేశాడు రాజు. థియేటర్లో తమిళ వెర్షన్ చూశాక దీన్ని రీమేక్ చేయడం కరెక్ట్ కాదని.. న్యాయం చేయలేమని అనిపించిందని రాజు వ్యాఖ్యానించాడు.
‘లవ్ టుడే’ తమిళంలో ఎలా అయితే థియేటర్లను షేక్ చేసిందో.. తెలుగులోనూ అలాగే మన ప్రేక్షకులను అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. తొలి రోజు పరిస్థితి ఎలా ఉన్నా.. రెండో రోజుకు సినిమా బలంగా పుంజుకుంటుందని అంచనా వేశాడు. ఈ రోజు సినిమా చూసిన వాళ్లకు రాజు మాటలు నిజమే అనిపిస్తున్నాయి. తొలి రోజు సినిమాకు ఉదయం పెద్దగా ఆక్యుపెన్సీ కనిపించలేదు. కానీ థియేటర్లలో జనం మాత్రం సినిమాను భలే ఎంజాయ్ చేస్తున్నారు.
అప్పుడెప్పుడో ‘జాతి రత్నాలు’ సినిమాకు నవ్వులతో థియేటర్లు షేక్ అయిపోయాయి. అదొక నవ్వుల సెలబ్రేషన్ లాగా కనిపించింది థియేటర్లలో. మళ్లీ ‘లవ్ టుడే’కు అలాంటి రెస్పాన్స్ కనిపిస్తోంది థియేటర్లలో. సినిమాకు రివ్యూలు, టాక్ చాలా బాగుండడంతో రాజు మాటలు నిజమై శనివారానికి సినిమాకు ఆక్యుపెన్సీ పెరుగుతుందని.. థియేటర్లు ఫుల్ అవుతాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండిట్లు.
ఇక సినిమా చూసిన వాళ్లు చాలామంది ఫీలవుతున్నది ఏమంటే.. ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తే తేడా కొట్టేది, అనువాదం చేసి రిలీజ్ చేయడమే కరెక్ట్ అని. ఎందుకంటే ఇందులో హీరో ప్రదీప్ స్థానంలో మరొకరిని ఊహించుకోవడం కష్టం. మనలో ఒకడిలా, చాలా మామూలుగా కనిపించే ప్రదీప్ను తెలుగులో రీప్లేస్ చేయగలిగే ఆర్టిస్టులు కనిపించరు. మన దగ్గర హీరోలంటే అందంగా ఉండాలని మంచి లుక్స్ ఉన్న కుర్ర హీరో ఎవరినో పెట్టేవారు. అప్పుడు సినిమాలో ఈ ఫీల్ ఉండేది కాదు. ప్రదీప్ లాగా నటించడం.. ఆ పాత్రను పండించడం మరొకరి వల్ల కాదు అనే స్థాయిలో అతను పెర్ఫామ్ చేశాడు. తనే దర్శకుడు కావడం వల్ల కూడా ఈ పాత్రను మరింత అర్థం చేసుకుని నటించాడు. మొత్తంగా సినిమా ఫీల్ చూసుకున్నా.. దీన్ని రీమేక్ చేస్తే వర్కవుట్ అయ్యేది కాదన్నది స్పష్టం.
పెద్దికి ఒళ్ళు హూనం చేసుకుని దర్శకుడు బుచ్చిబాబు అడిగిన దానికి రెండువందల శాతం ఎక్కువ ఇచ్చిన రామ్ చరణ్ దానికి…
వైసీపీ గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. 151 స్థానాల నుంచి 11కు పడిపోయింది. దీనికి కారణాలు ఏంటన్నవి అందరికీ తెలిసినా..…
కమెడియన్ పాత్రలు చేసుకునే సత్యం రాజేష్ను హీరోగా పెట్టి చాలా తక్కువ బడ్జెట్లో ‘మా ఊరి పొలిమేర’ అనే సినిమా తీశాడు…
తెలంగాణకు కీలక ప్రాజెక్టుగా రానున్న బుల్లెట్ రైలు రాష్ట్రానికి అత్యంత కీలకంగా మారనుంది. మొత్తం మూడు బుల్లెట్ రైళ్లను కేంద్ర…
టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు యువ హీరోయిన్ రాశీ సింగ్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. మొదటి నుంచి…
క్రిస్టఫర్ నోలన్ కొత్త సినిమా ‘ది ఒడిస్సీ’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ప్రపంచ చరిత్రలో ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే గ్రీక్, ట్రాయ్…