మొన్న వాల్తేర్ వీరయ్య ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో వేర్ ఈజ్ ది పార్టీ అంటూ వీడియోలు ఆడియోలు హోరెత్తిపోయాయి. ప్రోమో టైంలో వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని దేవిశ్రీ ప్రసాద్ తనదైన మాస్ స్టైల్ లో దూదిపింజెలా ఎగరగొట్టేశాడు. ఇప్పుడు బాలయ్య వంతు వచ్చింది. వీరసింహారెడ్డికి తమన్ ఎలాంటి పాటలు ఇచ్చి ఉంటాడోనన్న అంచనాలు అభిమానుల్లో విపరీతంగా ఉన్నాయి. అందులోనూ అఖండ లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఆల్బమ్ కావడంతో హైప్ మాములుగా లేదు. దానికి తగ్గట్టే మొదటి పాట జై బాలయ్య వచ్చేసింది.
ఫ్యాన్స్ కోరుకున్నట్టే తమన్ డీసెంట్ ట్యూన్ తో జై బాలయ్యని కంపోజ్ చేశాడు. కరీముల్లా గాత్రం మంచి డెప్త్ ని తీసుకొచ్చింది. రాజసం నీ ఇంటి పేరు పౌరుషం నీ ఒంటి తీరు అంటూ రామజోగయ్య శాస్త్రి ఇచ్చిన సాహిత్యానికి హుషారొచ్చేలా సాగే ట్యూన్ మెల్లగా ఎక్కేలా ఉంది. కొంత ఒసేయ్ రాములమ్మ సౌండ్ లా అనిపించినప్పటికీ తమన్ వాడిన ఇన్స్ ట్రుమెంటేషన్స్ రిచ్ గా ఉన్నాయి. జై బాలయ్య నినాదాన్ని పాటగా మార్చాలంటే అదంత సులభం కాదు. పైగా అఖండలో డ్యూయెట్ కోసం వాడిన జై బాలయ్య పదాలు ఇంకా మైండ్ లో ఫ్రెష్ గా ఉండగానే డిఫరెంట్ గా ఇవ్వడం సవాలే.
ఏదైతేనేం మొత్తానికి తమన్ కూడా పాస్ అయ్యాడు. వేరీజ్ ది పార్టీతో దీన్ని పోల్చడానికి లేదు. చిరంజీవిది ఐటెం సాంగ్. బాలకృష్ణది క్యారెక్టరైజేషన్ గీతం. ఒకవేళ రెండూ ఒక తరహా అయ్యుంటే అప్పుడు ఏది బెటరనే చర్చ వచ్చి ఉండేది కానీ విడిగా వింటే మాత్రం అటు దేవిశ్రీ ప్రసాద్, ఇటు తమన్ ఇద్దరూ మైత్రి మేకర్స్ మీదున్న మొదటి బరువును తగ్గించేశారు. చాలా తక్కువ గ్యాప్ లో బ్యాలన్స్ గా ప్రమోషన్లు చేయాల్సి రావడం మహా కష్టంగా మారిపోయింది. సంక్రాంతికి రావడం పక్కానే అయినా ఎవరు ముందు ఎవరు వెనుకనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. త్వరలోనే ప్రకటనలుంటాయి.
This post was last modified on November 25, 2022 12:56 pm
ప్రభాస్ అభిమానుల సహనానికి పరీక్ష పెడుతూ వచ్చినది రాజా సాబ్ ఎట్టకేలకు ప్రమోషన్ల పరంగా ఒక అడుగు ముందుకు వేస్తోంది.…
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో గాడిన పడ్డట్లే పడి.. ఆ తర్వాత ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలతో ఎదురు దెబ్బలు తిన్నాడు…
దేశాన్ని కుదిపేసిన పెహల్గామ్ దుర్ఘటన పట్ల చిన్నా పెద్దా ప్రతి ఒక్కరిలోనూ తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. సినీ పరిశ్రమ నుంచి…
ప్రేక్షకులను బాలీవుడ్ మేకర్స్ ఎలా ఊహించుకుంటున్నారో కానీ కొన్ని సినిమాలు ప్రకటనల స్టేజి దగ్గరే నవ్వు తెప్పిస్తున్నాయి. నిన్న కార్తీక్…
యావత్ దేశాన్ని కుదిపేసిన పెహల్గామ్ సంఘటన తర్వాత ఊహించని కోణాల్లో వివాదాలు తలెత్తున్నాయి. తాజాగా ప్రభాస్ ఫౌజీ ద్వారా హీరోయిన్…
ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో టిడిపి నేత ముప్పవరపు వీరయ్య చౌదరిని దారుణంగా హతమార్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి…