లిబరల్స్, ఇంటలెక్చువల్స్ అని ముద్ర వేయించుకున్న కొందరు ప్రముఖులు సోషల్ మీడియాలో అదే పనిగా నరేంద్ర మోడీ సర్కారును టార్గెట్ చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఐతే వాళ్లు చేసే కామెంట్లలో సహేతుకంగా అనిపించేవి ఉంటాయి. కొన్ని అతిగా అనిపిస్తాయి. ఐతే ఏ విషయంలో అయినా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే ఓకే.
కానీ సున్నితమైన విషయాల్లో తలదూర్చి అతిగా అనిపించే కామెంట్లు చేస్తే ట్రీట్మెంట్ మామూలుగా ఉండదు. తప్పయిపోయిందని లెంపలేసుకున్నా కూడా ఫలితం ఉండదు. ఇప్పుడు బాలీవుడ్ నటి రిచా చద్దా పరిస్థితి ఇలాగే తయారైంది. తాజాగా నార్నర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ ఉపేంద్ర ద్వివేది.. పాక్ ఆక్రమిత కశ్మీర్ను సొంతం చేసుకుంటామని, అందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉందని ఒక ట్వీట్ చేశారు.
దానికి బదులుగా.. రిచా గాల్వాన్ సేస్ హాయ్ అని ట్వీట్ చేసింది. మామూలుగా ఈ కామెంట్ చూస్తే ఏ పాకిస్థానీనో, చైనీయులో ట్వీట్ చేసి ఉంటారని అనుకుంటాం. ఎందుకంటే గాల్వాన్ వాలీలో చైనా సైనికులతో పోరాడి భారతీయ సైనికులు 28 మంది దాకా ప్రాణాలు వదలడం ఒక చేదు జ్ఞాపకం.
దేశం కోసం అంతమంది సైనికులు వీర మరణం పొందితే దాన్ని గుర్తు చేస్తూ ఇండియన్ ఆర్మీకి కౌంటర్ వేయడం ఎంత దారుణం? అందుకే రిచా మీద ఆ వర్గం ఈ వర్గం అని తేడా లేకుండా అందరూ విరుచుకుపడిపోయారు. ఆమెకు గట్టిగా గడ్డి పెట్టారు. ఐతే తాను చేసింది ఎంత పెద్ద తప్పో గుర్తుకు వచ్చి రిచా తర్వాత ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. తన తండ్రి, మామ సైన్యంలో పని చేశారని.. దేశభక్తి అనేది తన రక్తంలో ఉందని.. ఎవరైనా బాధించి ఉంటే మన్నించాలని.. ఇలా వివరణ ఇవ్వడానికి ప్రయత్నించింది. అయినా కూడా ఆమె మీద నెటిజన్ల దాడి ఆగట్లేదు.
This post was last modified on November 24, 2022 10:43 pm
రాష్ట్రంలో కీలకమైన నాలుగు రాజ్యసభ ఖాళీ అవుతున్నాయి. వీటిలో మూడు వైసీపీకి చెందిన నాయకులవి కాగా ఒకటి టిడిపికి చెందిన…
ఐపీఎల్-2026లో అత్యధిక క్రేజ్ దక్కించుకున్న మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు ఒకటి. మే 22న ఉప్పల్లోని రాజీవ్…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు తీస్తున్నారు.…
తెలుగు దేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు ఈ దఫా సరికొత్తగా జరగనుంది. ఏటా మే నెల 27,28 తేదీల్లో…
ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే శస్త్ర చికిత్స తీసుకుని… అనంతరం స్వల్ప వ్యవధి విశ్రాంతి…