లిబరల్స్, ఇంటలెక్చువల్స్ అని ముద్ర వేయించుకున్న కొందరు ప్రముఖులు సోషల్ మీడియాలో అదే పనిగా నరేంద్ర మోడీ సర్కారును టార్గెట్ చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఐతే వాళ్లు చేసే కామెంట్లలో సహేతుకంగా అనిపించేవి ఉంటాయి. కొన్ని అతిగా అనిపిస్తాయి. ఐతే ఏ విషయంలో అయినా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే ఓకే.
కానీ సున్నితమైన విషయాల్లో తలదూర్చి అతిగా అనిపించే కామెంట్లు చేస్తే ట్రీట్మెంట్ మామూలుగా ఉండదు. తప్పయిపోయిందని లెంపలేసుకున్నా కూడా ఫలితం ఉండదు. ఇప్పుడు బాలీవుడ్ నటి రిచా చద్దా పరిస్థితి ఇలాగే తయారైంది. తాజాగా నార్నర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ ఉపేంద్ర ద్వివేది.. పాక్ ఆక్రమిత కశ్మీర్ను సొంతం చేసుకుంటామని, అందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉందని ఒక ట్వీట్ చేశారు.
దానికి బదులుగా.. రిచా గాల్వాన్ సేస్ హాయ్ అని ట్వీట్ చేసింది. మామూలుగా ఈ కామెంట్ చూస్తే ఏ పాకిస్థానీనో, చైనీయులో ట్వీట్ చేసి ఉంటారని అనుకుంటాం. ఎందుకంటే గాల్వాన్ వాలీలో చైనా సైనికులతో పోరాడి భారతీయ సైనికులు 28 మంది దాకా ప్రాణాలు వదలడం ఒక చేదు జ్ఞాపకం.
దేశం కోసం అంతమంది సైనికులు వీర మరణం పొందితే దాన్ని గుర్తు చేస్తూ ఇండియన్ ఆర్మీకి కౌంటర్ వేయడం ఎంత దారుణం? అందుకే రిచా మీద ఆ వర్గం ఈ వర్గం అని తేడా లేకుండా అందరూ విరుచుకుపడిపోయారు. ఆమెకు గట్టిగా గడ్డి పెట్టారు. ఐతే తాను చేసింది ఎంత పెద్ద తప్పో గుర్తుకు వచ్చి రిచా తర్వాత ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. తన తండ్రి, మామ సైన్యంలో పని చేశారని.. దేశభక్తి అనేది తన రక్తంలో ఉందని.. ఎవరైనా బాధించి ఉంటే మన్నించాలని.. ఇలా వివరణ ఇవ్వడానికి ప్రయత్నించింది. అయినా కూడా ఆమె మీద నెటిజన్ల దాడి ఆగట్లేదు.
This post was last modified on November 24, 2022 10:43 pm
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…