Movie News

ఎన్టీఆర్ వ‌ద్ద‌న్న క‌థే బ‌న్నీతో

రైట‌ర్‌గా కిక్, రేసుగుర్రం, టెంప‌ర్ లాంటి హిట్లు కొట్టి నా పేరు సూర్య సినిమాతో ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేశాడు వ‌క్కంతం వంశీ. కానీ ఆ చిత్రం అత‌డికి చేదు అనుభ‌వాన్ని మిగిల్చింది. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఆ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దారుణంగా బోల్తా కొట్టింది. క‌థ‌ల విష‌యంలో జ‌డ్జిమెంట్ బాగుంటుంద‌ని పేరున్న అల్లు అర్జున్ ఈ సినిమా విష‌యంలో మాత్రం త‌డ‌బ‌డ్డాడు.

ఐతే నిజానికి ఈ క‌థ రాసింది అల్లు అర్జున్ కోసం కాద‌ట‌. జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో చేయాల్సిన సినిమానే బ‌న్నీతో చేశాడ‌ట వ‌క్కంతం వంశీ. ఈ విష‌యాన్ని అత‌నే స్వ‌యంగా వెల్ల‌డించాడు. నిజానికి వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వ అరంగేట్రం చేయాల్సింది తార‌క్‌తోనే. ఈ సినిమాను అధికారికంగా ప్ర‌క‌టించారు కూడా. కానీ ఏం జ‌రిగిందో ఏమో ఆ సినిమా ఆగిపోయింది. త‌ర్వాత బ‌న్నీతో సినిమా ఓకే అయింది.

దీని వెనుక క‌థ‌ను వంశీ వెల్ల‌డించాడు. ముందు నా పేరు సూర్య క‌థ‌ను తార‌క్ కోస‌మే రెడీ చేశాన‌ని.. ఐతే స్క్రిప్టు ద‌శ‌లో ఎందుకో ఇది ఎన్టీఆర్‌తో వ‌ర్క‌వుట్ కాదేమో అనిపించింద‌ని.. ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే ఆ సినిమాను ఆపేశామ‌న్న‌ట్లుగా చెప్పాడు వంశీ. ఐతే ఒక ఫ్రెండు ద్వారా బ‌న్నీ ద‌గ్గ‌రికి ఈ క‌థ వెళ్ల‌గా అత‌డికి వెంట‌నే న‌చ్చేసి ఈ సినిమాను ప‌ట్టాలెక్కించాడ‌ని వంశీ తెలిపాడు.

ఈ క‌థ‌ను త‌న‌కంటే బ‌న్నీ, అల్లు అర‌వింద్ ఎక్కువ న‌మ్మార‌ని అత‌ను చెప్పాడు. నా పేరు సూర్య‌లో అన్వ‌ర్ పాత్ర మీద క్లైమాక్స్ న‌డ‌ప‌డం చాలామందికి న‌చ్చ‌లేద‌ని.. ఐతే అల్లు అర‌వింద్ దానిపై స్పందిస్తూ ఇది రిస్క్ అని చెబుతూనే సినిమాలో బాగానే వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశార‌ని.. దీంతో తాను ధైర్యంగా ముందుకెళ్లిపోయాన‌ని వంశీ వెల్ల‌డించాడు. నా పేరు సూర్య ఫ్లాప్ కావ‌డంతో త‌న కెరీర్ ఇబ్బందిక‌రంగా మారింద‌నే విష‌యాన్ని వంశీ అంగీక‌రించాడు.

This post was last modified on November 24, 2022 9:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

2 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

3 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

3 hours ago

లోకేశ్ పై జోగి వివాదాస్పద కామెంట్లు

కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టై 84 రోజుల పాటు జైల్లో ఉన్న…

4 hours ago

అంబటి ఇంటిపై దాడి… హై టెన్షన్

ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…

4 hours ago

భాగ్య‌న‌గ‌రంలో గ‌న్ క‌ల్చ‌ర్.. డేంజ‌రే!

తెలంగాణ ప్ర‌భుత్వం... పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గ‌ధామంగా మారుస్తామ‌ని చెబుతున్న హైద‌రాబాద్‌లో గ‌న్ క‌ల్చ‌ర్ పెరుగుతోందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. వ్య‌క్తిగ‌తంగా…

4 hours ago