రైటర్గా కిక్, రేసుగుర్రం, టెంపర్ లాంటి హిట్లు కొట్టి నా పేరు సూర్య సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు వక్కంతం వంశీ. కానీ ఆ చిత్రం అతడికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. కథల విషయంలో జడ్జిమెంట్ బాగుంటుందని పేరున్న అల్లు అర్జున్ ఈ సినిమా విషయంలో మాత్రం తడబడ్డాడు.
ఐతే నిజానికి ఈ కథ రాసింది అల్లు అర్జున్ కోసం కాదట. జూనియర్ ఎన్టీఆర్తో చేయాల్సిన సినిమానే బన్నీతో చేశాడట వక్కంతం వంశీ. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. నిజానికి వక్కంతం వంశీ దర్శకత్వ అరంగేట్రం చేయాల్సింది తారక్తోనే. ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ ఏం జరిగిందో ఏమో ఆ సినిమా ఆగిపోయింది. తర్వాత బన్నీతో సినిమా ఓకే అయింది.
దీని వెనుక కథను వంశీ వెల్లడించాడు. ముందు నా పేరు సూర్య కథను తారక్ కోసమే రెడీ చేశానని.. ఐతే స్క్రిప్టు దశలో ఎందుకో ఇది ఎన్టీఆర్తో వర్కవుట్ కాదేమో అనిపించిందని.. పరస్పర అంగీకారంతోనే ఆ సినిమాను ఆపేశామన్నట్లుగా చెప్పాడు వంశీ. ఐతే ఒక ఫ్రెండు ద్వారా బన్నీ దగ్గరికి ఈ కథ వెళ్లగా అతడికి వెంటనే నచ్చేసి ఈ సినిమాను పట్టాలెక్కించాడని వంశీ తెలిపాడు.
ఈ కథను తనకంటే బన్నీ, అల్లు అరవింద్ ఎక్కువ నమ్మారని అతను చెప్పాడు. నా పేరు సూర్యలో అన్వర్ పాత్ర మీద క్లైమాక్స్ నడపడం చాలామందికి నచ్చలేదని.. ఐతే అల్లు అరవింద్ దానిపై స్పందిస్తూ ఇది రిస్క్ అని చెబుతూనే సినిమాలో బాగానే వర్కవుట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారని.. దీంతో తాను ధైర్యంగా ముందుకెళ్లిపోయానని వంశీ వెల్లడించాడు. నా పేరు సూర్య ఫ్లాప్ కావడంతో తన కెరీర్ ఇబ్బందికరంగా మారిందనే విషయాన్ని వంశీ అంగీకరించాడు.
This post was last modified on November 24, 2022 9:38 am
దేశ భద్రతపై మళ్లీ శాంతిభంగం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయని నిఘా సంస్థలు హెచ్చరించాయి. శనివారం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…
హర్యానాలోని సోనిపట్లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.…
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…