అసలు ఎటువంటి సినిమా చేస్తే కింగ్ నాగార్జున తిరిగి ఫామ్లోకి వస్తారు? ఫుల్ రొమాన్స్తో ‘మన్మథుడు 2’ సినిమా చేస్తే.. ఏజ్ బార్ హీరో ప్రక్కన ఆ చిన్నపిల్ల రకుల్ ఏంటండీ అంటూ విమర్శకులు ఏకి పారేశారు. పైగా సినిమా కూడా వర్కవుట్ కాలేదు. ఆ తరువాత ‘వైల్డ్ డాగ్’ అంతేకంటే ఘోరంగా బెడసికొట్టింది. మధ్యలో ‘బంగర్రాజు’ ఫర్వాలేదనిపించినా కూడా, మొన్నొచ్చిన ‘ది ఘోస్ట్’ కూడా మొండిచెయ్యే చూపించింది. మరి నాగ్ తక్షణ కర్తవ్యం ఏమంటారు?
నిజానికి తని ఒరువన్ సినిమా తరువాత మోహన్ రాజాతో సినిమా చేద్దాం అనుకున్న నాగార్జున, గాడ్ ఫాదర్ రిజల్ట్ చూశాక ఆ దర్శకుడితో పనిచేయట్లేదని టాక్. అయితే ప్రస్తుతం తానో మసాలా కామెడీ మూవీ చేస్తే బెటర్ అని నాగ్ ఫీలవుతున్నారట. ఈ మధ్యనే రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ.. ధమాకా సినిమా కోసం కూడా ధియేటర్లలో టాప్ లేపేసే కామెడీ రాశాడని టాక్ రావడంతో.. అతన్ని పిలిపించి నాగ్ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. హలోబ్రదర్ తరహా ఏదన్నా సూపర్బ్ మసాలా కామెడీ ఉంటే.. వెంటనే సినిమాను టేకాఫ్ చేసేద్దాం అని చూస్తున్నారట. అయితే ఇక్కడ ఇంకో చిక్కుంది.
నిజానికి తనే స్వయంగా డైరక్టర్ కావాలని ఎప్పటినుండో ప్రసన్న కుమార్ ప్రయత్నిస్తున్నాడు. ఆ మద్యన ఒకటి రెండు సినిమాలు పట్టాలెక్కినా వాటి జాడేంటతో తెలియట్లేదు. అయితే ఈ మధ్యన చాలామంది రైటర్లను డైరక్టర్స్గా చేసిన నాగ్.. చివరకు చేతులు కాల్చుకోవాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు నాగ్ కూడా కామెడీ కావాలి కాని సరైన డైరక్టర్ కూడా కావాలి అంటూ కండిషన్ పెట్టారట. చూద్దాం ఏమవుతుందో!
This post was last modified on November 23, 2022 10:09 pm
కలెక్షన్ల కోసం పోటీ పడే స్టార్ హీరోల అభిమానులను చూశాం కానీ ఇప్పుడీ ట్రెండ్ కటవుట్లకూ పాకింది. తమదే రికార్డుగా…
ఏపీ రాజధాని అమరావతికి ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు.. విజయవాడకు వచ్చి.. అటు నుంచి గుంటూరు మీదుగా అమరావతికి…
ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాదికార సంస్థ(శాప్) చైర్మన్ రవినాయుడు.. వర్సెస్ వైసీపీ మాజీ మంత్రి రోజా మధ్య ఇప్పుడు రాజకీయం జోరుగా సాగుతోంది.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో సారి పగ్గాలు చేపట్టిన తర్వాత.. ప్రపంచ దేశాల దిగుమతులపై భారీఎత్తున సుంకాలు (టారిఫ్లు)…
అల్లుడు అదుర్స్ తర్వాత హిందీ ఛత్రపతి కోసం మూడేళ్లు టాలీవుడ్ కు దూరమైపోయిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఇప్పుడు ప్రభాస్ రేంజ్…
ఏపీ వృద్ధి రేటులో దూసుకుపోతోంది. కూటమి పాలనలో గడచిన 10 నెలల్లోనే ఏపీ గణనీయ వృద్ధి రేటును సాధించింది. దేశంలోని అత్యధిక…