అసలు ఎటువంటి సినిమా చేస్తే కింగ్ నాగార్జున తిరిగి ఫామ్లోకి వస్తారు? ఫుల్ రొమాన్స్తో ‘మన్మథుడు 2’ సినిమా చేస్తే.. ఏజ్ బార్ హీరో ప్రక్కన ఆ చిన్నపిల్ల రకుల్ ఏంటండీ అంటూ విమర్శకులు ఏకి పారేశారు. పైగా సినిమా కూడా వర్కవుట్ కాలేదు. ఆ తరువాత ‘వైల్డ్ డాగ్’ అంతేకంటే ఘోరంగా బెడసికొట్టింది. మధ్యలో ‘బంగర్రాజు’ ఫర్వాలేదనిపించినా కూడా, మొన్నొచ్చిన ‘ది ఘోస్ట్’ కూడా మొండిచెయ్యే చూపించింది. మరి నాగ్ తక్షణ కర్తవ్యం ఏమంటారు?
నిజానికి తని ఒరువన్ సినిమా తరువాత మోహన్ రాజాతో సినిమా చేద్దాం అనుకున్న నాగార్జున, గాడ్ ఫాదర్ రిజల్ట్ చూశాక ఆ దర్శకుడితో పనిచేయట్లేదని టాక్. అయితే ప్రస్తుతం తానో మసాలా కామెడీ మూవీ చేస్తే బెటర్ అని నాగ్ ఫీలవుతున్నారట. ఈ మధ్యనే రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ.. ధమాకా సినిమా కోసం కూడా ధియేటర్లలో టాప్ లేపేసే కామెడీ రాశాడని టాక్ రావడంతో.. అతన్ని పిలిపించి నాగ్ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. హలోబ్రదర్ తరహా ఏదన్నా సూపర్బ్ మసాలా కామెడీ ఉంటే.. వెంటనే సినిమాను టేకాఫ్ చేసేద్దాం అని చూస్తున్నారట. అయితే ఇక్కడ ఇంకో చిక్కుంది.
నిజానికి తనే స్వయంగా డైరక్టర్ కావాలని ఎప్పటినుండో ప్రసన్న కుమార్ ప్రయత్నిస్తున్నాడు. ఆ మద్యన ఒకటి రెండు సినిమాలు పట్టాలెక్కినా వాటి జాడేంటతో తెలియట్లేదు. అయితే ఈ మధ్యన చాలామంది రైటర్లను డైరక్టర్స్గా చేసిన నాగ్.. చివరకు చేతులు కాల్చుకోవాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు నాగ్ కూడా కామెడీ కావాలి కాని సరైన డైరక్టర్ కూడా కావాలి అంటూ కండిషన్ పెట్టారట. చూద్దాం ఏమవుతుందో!
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…