కెరీర్ ఆరంభంలో నటుడిగా, దర్శకుడిగా గట్టి ఎదురు దెబ్బలే తిన్నాడు అడివి శేష్. కానీ ‘క్షణం’ దగ్గర్నుంచి అతడి రాత మారిపోయింది. రైటర్గా, ఫిలిం మేకర్గా తనకు ఒక పరిధిని నిర్దేశించుకుని, అభిరుచి ఉన్న.. తనతో సింక్ అయ్యే ప్రతిభావంతులైన దర్శకులను ఎంచుకుని చక్కటి థ్రిల్లర్ సినిమాలు చేస్తూ అతను ముందుకు సాగుతున్నాడు. గూఢచారి, ఎవరు, మేజర్ లాంటి సినిమాలు అతడి ఇమేజ్, ఫాలోయింగ్ను ఎంతగానో విస్తరించాయి.
ఇప్పుడు శేష్ నుంచి రాబోతున్న ‘హిట్-2’ మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ రోజే రిలీజైన ‘హిట్-2’ ట్రైలర్ అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. ఈ ట్రైలర్ లాంచ్ సందర్భంగా శేష్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలో తాను ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు వెల్లడించాడు. ఇంతకుముందు ఇదే బేనర్లో శేష్ ‘గూఢచారి’ సినిమా చేశాడు. అది సూపర్ హిట్టయింది.
ఈసారి పాన్ ఇండియా లెవెల్లో మల్టీ లాంగ్వేజ్ మూవీ చేయనున్నాడట శేష్ అన్నపూర్ణ వారి బేనర్లో. ఇదొక యాక్షన్ టచ్ ఉన్న లవ్ స్టోరీ అని కూడా అతను వెల్లడించాడు. ఐతే ఈ చిత్రానికి దర్శకుడెవరు, ఇతర వివరాలేంటి అన్నది వెల్లడించలేదు. మరోవైపు ‘హిట్-2’ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ ఆలోచన కూడా ఉన్నట్లు శేష్ తెలిపాడు.
ముందు ఈ చిత్రాన్ని తెలుగు వరకే అనుకుని చేశామని.. కానీ హిట్-2 ప్రోమోలకు హిందీ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఆశ్చర్యం కలిగిస్తోందని.. ముందు డిసెంబరు 2న తెలుగులో రిలీజ్ చేసి, ఆ తర్వాత హిందీ సహా పలు భాషల్లోకి అనువాదం చేసి రిలీజ్ చేస్తామని శేష్ తెలిపాడు. అంతే కాక ‘హిట్-3’ కూడా పక్కాగా ఉంటుందని, అందులో తాను నటిస్తానని.. ఇంకా ఎవరెవరు ఆ చిత్రంలో ఉంటారన్నది తర్వాత చెబుతామని శేష్ చెప్పాడు. హిట్-3లో నాని, విజయ్ సేతుపతి కూడా నటిస్తారని, ఇది అమెరికా నేపథ్యంలో సాగుతుందని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 23, 2022 9:34 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…