అనారోగ్యంతో బాధ పడుతున్నా హాస్పిటల్ నుంచే ప్రమోషన్ చేసిన దానికి ఫలితంగా యశోద రూపంలో సమంతాకు మంచి ఫలితమే దక్కింది. టాక్ కొంచెం మిక్స్డ్ గా వినిపించినప్పటికీ ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద లాభాలతో బయట పడుతోంది. అపోజిషన్ లేకపోవడాన్ని బాగా ఎంజాయ్ చేసిన యశోద ఇంకో వారం పైనే సేఫ్ రన్ కొనసాగించేలా ఉంది. ఇది ఓకే కానీ ఇంతకీ సామ్ పూర్తిగా ఎప్పుడు కోలుకుంటుందో అంతు చిక్కడం లేదు. త్వరలోనే అనే మాట వినిపిస్తోంది కానీ అది డిసెంబరా లేక వచ్చే ఏడాదా అనేది తేలడం లేదు. డాక్టర్లు చెప్పేదాన్ని బట్టే తుది నిర్ణయం ఉంటుంది.
సామ్ కోసం వంద కోట్ల పెట్టుబడులు మోక్షం పొందడానికి ఎదురు చూస్తున్నాయి. అందులో మొదటిది ఖుషి. ఇంకో ముప్పై రోజులు షూటింగ్ చేస్తే అయిపోతుందనగా సమంతా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. దీంతో యూనిట్ అప్పటి నుంచి వెయిట్ చేస్తూనే ఉంది. హీరో విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్టు కమిటవ్వకుండా ఖుషి ఫినిష్ చేయడం కోసమే ఎదురు చూస్తున్నాడు. అంతా సవ్యంగా జరిగితే 2023 వేసవిలో రిలీజ్ చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఎంతలేదన్నా ఖుషి మీద థియేట్రికల్ బిజినెస్ నలభై కోట్ల దాకా జరగొచ్చు. మల్టీ లాంగ్వేజ్ కాబట్టి అదేమంత కష్టం కాదు.
ఇక గుణశేఖర్ శాకుంతలంలో సామ్ భాగం ఎప్పుడో అయిపోయింది కానీ ఆమె వస్తే తప్ప పబ్లిసిటీ మొదలుపెట్టలేరు. యశోద లాగా ఒక వీడియో ఇంటర్వ్యూతో అయిపోయే వ్యవహారం కాదిది. మార్కెట్ ని మించి బడ్జెట్ ఖర్చు పెట్టారు. సో క్రేజ్ రావాలంటే సమంతా బయట కనిపించాలి. దీనికి అన్ని బాషలకు కలిపి అరవై కోట్లకు పైగానే టార్గెట్ పెట్టుకుంది గుణ టీమ్. ఓ రెండు మూడు పోస్టర్లు తప్ప శాకుంతలంకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు. కొత్తగా మొదలుపెట్టాల్సిన ప్రాజెక్టుల సంగతి తర్వాత చూసుకోవచ్చు కానీ ముందైతే ఈ రెండు సినిమాలకు రూట్ క్లియర్ అయితే అంతకంటే ఫ్యాన్స్ కి కావాల్సింది ఏముంది.
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…