అనారోగ్యంతో బాధ పడుతున్నా హాస్పిటల్ నుంచే ప్రమోషన్ చేసిన దానికి ఫలితంగా యశోద రూపంలో సమంతాకు మంచి ఫలితమే దక్కింది. టాక్ కొంచెం మిక్స్డ్ గా వినిపించినప్పటికీ ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద లాభాలతో బయట పడుతోంది. అపోజిషన్ లేకపోవడాన్ని బాగా ఎంజాయ్ చేసిన యశోద ఇంకో వారం పైనే సేఫ్ రన్ కొనసాగించేలా ఉంది. ఇది ఓకే కానీ ఇంతకీ సామ్ పూర్తిగా ఎప్పుడు కోలుకుంటుందో అంతు చిక్కడం లేదు. త్వరలోనే అనే మాట వినిపిస్తోంది కానీ అది డిసెంబరా లేక వచ్చే ఏడాదా అనేది తేలడం లేదు. డాక్టర్లు చెప్పేదాన్ని బట్టే తుది నిర్ణయం ఉంటుంది.
సామ్ కోసం వంద కోట్ల పెట్టుబడులు మోక్షం పొందడానికి ఎదురు చూస్తున్నాయి. అందులో మొదటిది ఖుషి. ఇంకో ముప్పై రోజులు షూటింగ్ చేస్తే అయిపోతుందనగా సమంతా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. దీంతో యూనిట్ అప్పటి నుంచి వెయిట్ చేస్తూనే ఉంది. హీరో విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్టు కమిటవ్వకుండా ఖుషి ఫినిష్ చేయడం కోసమే ఎదురు చూస్తున్నాడు. అంతా సవ్యంగా జరిగితే 2023 వేసవిలో రిలీజ్ చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఎంతలేదన్నా ఖుషి మీద థియేట్రికల్ బిజినెస్ నలభై కోట్ల దాకా జరగొచ్చు. మల్టీ లాంగ్వేజ్ కాబట్టి అదేమంత కష్టం కాదు.
ఇక గుణశేఖర్ శాకుంతలంలో సామ్ భాగం ఎప్పుడో అయిపోయింది కానీ ఆమె వస్తే తప్ప పబ్లిసిటీ మొదలుపెట్టలేరు. యశోద లాగా ఒక వీడియో ఇంటర్వ్యూతో అయిపోయే వ్యవహారం కాదిది. మార్కెట్ ని మించి బడ్జెట్ ఖర్చు పెట్టారు. సో క్రేజ్ రావాలంటే సమంతా బయట కనిపించాలి. దీనికి అన్ని బాషలకు కలిపి అరవై కోట్లకు పైగానే టార్గెట్ పెట్టుకుంది గుణ టీమ్. ఓ రెండు మూడు పోస్టర్లు తప్ప శాకుంతలంకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు. కొత్తగా మొదలుపెట్టాల్సిన ప్రాజెక్టుల సంగతి తర్వాత చూసుకోవచ్చు కానీ ముందైతే ఈ రెండు సినిమాలకు రూట్ క్లియర్ అయితే అంతకంటే ఫ్యాన్స్ కి కావాల్సింది ఏముంది.
This post was last modified on November 24, 2022 9:30 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…