ఇండియన్ స్క్రీన్ మీద వచ్చిన అత్యుత్తమ బయోపిక్స్లో ‘ఆకాశం నీ హద్దురా’ ఒకటని చెప్పొచ్చు. ఇది ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా అన్న సంగతి తెలిసిందే. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి, అనేక కష్టాలకు ఓర్చి సొంతంగా విమాన యాన సంస్థను నెలకొల్పి, దాన్ని విజయవంతంగా నడిపించే స్థాయికి గోపీనాథ్ ఎదిగిన క్రమాన్ని చాలా హృద్యంగా, మనసులకు హత్తుకునేలా రూపొందించి విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి గొప్ప ఆదరణ అందుకుంది తెలుగమ్మాయి అయిన తమిళ దర్శకురాలు సుధ కొంగర.
ఆమె విజన్కు తగ్గట్లు సూర్య అద్భుతంగా ఆ పాత్రను పోషించి మెప్పించాడు. వీరి కలయికలో త్వరలోనే మరో బయోపిక్ రాబోతున్నట్లు తాజా సమాచారం. అది దేశం గర్వించే వ్యాపారవేత్త, మానవతా వాది రతన్ టాటా జీవిత కథ అని వార్తలొస్తుండడం విశేషం.
‘ఆకాశం నీ హద్దురా’ తర్వాత సుధ ఇంకా తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టలేదు. ఒక దశలో అజిత్ హీరోగా ఓ సినిమా ఓకే అయినట్లు వార్తలొచ్చాయి. కానీ తర్వాత దాని గురించి కదలిక లేదు. ఆమె మళ్లీ సూర్యతోనే జట్టు కట్టబోతోందని.. ఆయనతో చేయబోయే సినిమా మీదే దీర్ఘ కాలంగా పని చేస్తోందని తెలుస్తోంది. గోపీనాథ్ జీవితాన్ని హృద్యంగా తెరపై చూపించినట్లే.. రతన్ టాటా లైఫ్ స్టోరీని అంతకంటే గొప్పగా తెరకెక్కించడం కోసం సుధ కష్టపడుతోందట.
ఈ చిత్రంలో సూర్యతో పాటు అభిషేక్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషించనున్నాడట. మరి అతనేం పాత్ర చేస్తాడో చూడాలి మరి. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. సుధ దర్శకత్వంలో తాము సినిమా చేయనున్నట్లు హోంబలె ఫిలిమ్స్ అధినేతలు ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం సూర్య వెట్రిమారన్, శివ, బాల చిత్రాలను లైన్లో పెట్టాడు. మరి సుధతో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.
This post was last modified on November 23, 2022 3:48 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…