మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నదమ్ములే అయినప్పటికీ.. వారు ఎప్పుడో ఒకసారే కలుస్తుంటారు కాబట్టి వారి కలయిక అమితాసక్తిని రేకెత్తిస్తుంటుంది. తాజాగా చిరు తన కొత్త చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ చిత్రీకరణలో ఉండగా అక్కడికి పవన్ కూడా వచ్చాడు. తన ‘హరి హర వీరమల్లు’ సినిమా కూడా సమీపంలోనే చిత్రీకరణ జరుపుకుటుండడంతో చిరును కలవడానికి వచ్చాడు పవన్. ఈ సందర్భంగా అన్నదమ్ములు ముచ్చటించుకుంటున్న ఫొటోలు బయటికి వచ్చాయి.
‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఒక పాటను పవన్ను చిరు చూపిస్తున్న దృశ్యం కూడా కనిపించింది. ఐతే ఈ ఫొటోలో చిరు, పవన్లను మించి ఓ వ్యక్తి హైలైట్ అయ్యారు. ఆయన ఎవరో కాదు.. దర్శకుడు క్రిష్. ఈ దర్శకుడు అంతగా అందరి దృష్టినీ ఆకర్షించడానికి కారణం ఆయన కొత్త లుక్కే.
కెరీర్ ఆరంభంలోనే క్రిష్కు నెత్తిన జుట్టు తక్కువగా కనిపించింది. కొన్నేళ్లకు మొత్తం బట్టతల వచ్చేసింది. ఐతే పెళ్లి చేసుకుంటున్న సమయంలో కూడా నెత్తిన జుట్టు లేకపోవడంపై క్రిష్ పెద్దగా పట్టించుుకన్నది లేదు. గత కొన్నేళ్లలో పూర్తిగా బాల్డ్ హెడ్లోకి వచ్చేశాడు క్రిష్. వయసు మరీ ఎక్కువ కాకపోయినా అంతలోనే ఇంత బట్టతల రావడం ఎవరికైనా బాధ కలిగించేదే. ఐతే క్రిష్ ఇలాంటివి పెద్దగా పట్టించుకునేలా కనిపించడు. కానీ ఇప్పుడు ఆయన ఆలోచన మారినట్లుంది. చాలామంది లాగే ఆయన కూడా నెత్తిన జుట్టు పెట్టించుకున్నాడు.
ఎప్పుడూ బట్టతలతో కనిపించే క్రిష్.. నెత్తిన ఫుల్లుగా నిగనిగలాడే జుట్టుతో కనిపించేసరికి చాలామంది ఆయన్ని గుర్తు పట్టలేకపోయారు ముందు. తర్వాత నెమ్మదిగా పోల్చుకుని క్రిష్ ఏంటి ఇలా తయారయ్యాడు అనుకున్నారు. ఎన్నడూ లేనిది క్రిష్ ఇలా హెయిర్ సెట్ చేసుకోవడంతో ఆయన వ్యక్తిగత జీవితంలో కొత్త మార్పులేమైనా వచ్చాయా అని చర్చించుకుంటున్నారు నెటిజన్లు.
This post was last modified on November 23, 2022 2:40 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…