ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తుంది. థియేటర్స్ లో ప్రతీ వారం రెండు మూడు సినిమాలు రిలీజ్ అవుతుంటే ఓటీటీ అరడజను సినిమాలు , సిరీస్ లు వస్తున్నాయి. అయితే ఇటివల ఓటీటీ సంస్థలు కొన్ని కండీషన్స్ పెట్టుకొని ముందుకెళ్తున్నారు. అందులో ఆంథాలజీ లు తీసుకోకూడదనే రూల్ పెట్టుకున్నారు. అన్ని సంస్థలు ఈ రూల్ పాటిస్తున్నాయని అనలేం కానీ మెజారిటీ సంస్థలు ఇప్పటికే ఆంథాలజీ స్టోరీస్ చాలానే రిజెక్ట్ చేశాయి. దీనికి కారణం ప్రేక్షకులు తమ ఫ్లాట్ ఫార్మ్ లో ఆంథాలజీ తో సిరీస్ లు చూడకపోవడం సరైన వ్యూస్ దక్కకపోవడం.
అయితే నాని ప్రొడ్యూస్ చేసిన ‘మీట్ క్యూట్’ కూడా ఆంథాలజీనే. ఐదు కథలతో తెరకెక్కిన సిరీస్ ఇది. మరి నాని అతని అక్క ఈ ఆంథాలజీ సిరీస్ తో ఓటీటీ సంస్థ ను ఎలా మెప్పించారు ? అనే సందేహం రిజెక్ట్ అనిపించుకున్న దర్శక నిర్మాతల మనసులో ఉంది. తాజాగా నానిను ఇదే ప్రశ్న అడగ్గా దానికి నేచురల్ స్టార్ సమాధానమిచ్చాడు. షూటింగ్ స్టేజిలోనే సోనీ లివ్ సంస్థ ఈ సిరీస్ కోసం తన అక్క అండ్ టీం పడుతున్న కష్టం చూశారని ముఖ్యంగా తన సిస్టర్ వర్క్ వాళ్లకి బాగా నచ్చేసిందని, రెండు, మూడు ఎపిసోడ్స్ చూశాకే మేము తీసుకుంటామని ముందుకొచ్చారని చెప్పుకున్నాడు. అంతే కాదు మేం కొంటాం అంటే, మేం కొంటాం అన్నారని కూడా నాని అన్నాడు.
అయితే ఇందులో ఇంకో విషయం కూడా ఉంది. నాని బ్రాండ్ ఈ ఆంథాలజీ సిరీస్ మార్కెటింగ్ కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే అందరికీ పరిచయం ఉన్న ప్యాడింగ్ ఉంది. ఈ రెండు విషయాలు ఓటీటీ దృష్టిలో పెట్టుకొని ఉండొచ్చు. అలాగే నాని సిస్టర్ దీప్తి కూడా తన కంటెంట్ కూడా మెప్పించింది కాబోలు. ఇవన్నీ కలిసొచ్చి ఫైనల్ గా ఆంథాలజీ ప్రేక్షకుల ముందుకొస్తుంది. నాని సిస్టర్ తో పాటు అందరూ ఈ సిరీస్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సిరీస్ కనుక సక్సెస్ అయితే మిగతా ఓటీటీ సంస్థలు కూడా తాము పెట్టుకున్న కండీషన్ తో కూడిన రూల్ పక్కన పెట్టేసి ఆంథాలజీ కథల కోసం చూసే అవకాశం ఉంది.
This post was last modified on November 22, 2022 10:26 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…