టాలీవుడ్లో ట్రాక్ రికార్డు చూడకుండా దర్శకులతో సినిమాలు చేసే హీరోల్లో శర్వానంద్ ఒకడు. తన కెరీర్ ప్రమాదంలో ఉన్న స్థితిలో కూడా అతను ఫ్లాప్ దర్శకులకు, డెబ్యూ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చాడు. ‘నేను శైలజ’ తర్వాత సరైన విజయాన్ని అందుకోని కిషోర్ తిరుమలతో అతను చేసిన ‘ఆడవాళ్ళు నీకు జోహార్లు’ తీవ్రంగా నిరాశ పరిచింది. దీని తర్వాత శ్రీ కార్తీక్ అనే కొత్త దర్శకుడిని నమ్మి ‘ఒకే ఒక జీవితం’ సినిమా చేస్తే.. అది శర్వాకు అత్యావశ్యక విజయాన్ని అందించింది. ఈ సినిమా రిలీజ్ కాకముందే శర్వా ఒక ఫ్లాప్ డైరెక్టర్తో సినిమాను లైన్లో పెట్టాడు.
‘రౌడీ ఫెలో’ మూవీతో పర్వాలేదనిపించి ఆ తర్వాత ‘ఛల్ మోహన్ రంగ’తో షాక్ తిన్న కృష్ణచైతన్యతో శర్వా ఓ సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ మధ్యే చిత్రీకరణ దశలోకి వెళ్లగా.. శర్వా కొత్తగా మరో సినిమాను ఒప్పుకున్నట్లు సమాచారం.
యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యతో శర్వానంద్ ఓ సినిమా చేయబోతున్నాడన్నది తాజా కబురు. ‘భలే మంచి రోజు’తో ప్రామిసింగ్ డైరెక్టర్లా కనిపించిన శ్రీరామ్.. తర్వాత వరుసగా ఫ్లాపులు ఇచ్చాడు. శమంతకమణి, దేవదాసు, హీరో సినిమాలు అతణ్ని నిరాశకు గురి చేశాయి. అంతకుముందు రెండు చిత్రాలైనా ఓకే కానీ.. చివరగా శ్రీరామ్ తీసిన ‘హీరో’ ప్రేక్షకులకు ఏమాత్రం రుచించలేదు. దీని తర్వాత అతడికి ఇంకో ఛాన్స్ కష్టమనుకుంటున్న సమయంలో శర్వా అతడితో సినిమాను ఓకే చేశాడట. వీరి కలయికలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రూపుదిద్దుకోబోతోందట. ఒక యంగ్ ప్రొడ్యూసర్ దీన్ని నిర్మిస్తాడట.
ఈ చిత్రంలో శర్వా సరసన ‘ఉప్పెన’ భామ కృతి శెట్టి నటించనున్నట్లు సమాచారం. వీరి కలయికలో రానున్న తొలి చిత్రమిదే. స్వల్ప వ్యవధిలో వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలతో హ్యాట్రిక్ ఫ్లాపులు ఎదుర్కొన్న కృతికి శర్వా లాంటి పేరున్న హీరో పక్కన ఛాన్స్ రావడం విశేషమే.
This post was last modified on November 22, 2022 9:23 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…