టాలీవుడ్ సంక్రాంతికి వారసుడు పెట్టిన చిచ్చు మాములుగా లేదు. ఒక తమిళ పార్టీ ఏమో తెలుగు సినిమాలు బ్యాన్ చేస్తామంటుంది. ఫామ్ లో లేని ఒక కోలీవుడ్ స్టార్ డైరెక్టరేమో వరిసుకు ముందు ఆ తర్వాత పరిణామాలు వేరే ఉంటాయంటూ వెరైటీ బెదిరింపులు చేస్తాడు. తీరా చూస్తే తమిళ స్టార్ హీరోలెవరూ ఆఫర్లు ఇవ్వకపోతే ఇక్కడికొచ్చి ఊపుమీదున్న కుర్ర హీరోకు డిజాస్టర్ ఇచ్చిన ట్రాక్ రికార్డు ఈయనది. ఇదంతా చూస్తూ తెలుగు సినిమా అభిమానులు ఊరుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ నిరసనను పబ్లిక్ గానే ప్రకటిస్తున్నారు. ఇది టూ మచ్ అంటూ కౌంటర్లు ఇస్తున్నారు
నిజానికి డబ్బింగ్ రూపంలో తమిళ నిర్మాతలకు మన మార్కెట్ కల్పతరువు లాంటిది. విక్రమ్ అపరిచితుడు, సూర్య గజిని, శంకర్ బాయ్స్ లాంటివి ఒరిజినల్ వెర్షన్ కంటే ఏపీ తెలంగాణలోనే బ్రహ్మాండమైన వసూళ్లు దక్కించుకున్నాయి. అక్కడ రెండు వారాలకు చాప చుట్టేసిన వాటిని మనం ఆదరించిన ఉదంతాలున్నాయి. అంతెందుకు విజయ్ మొహమే సరిగా గుర్తు పట్టని తెలుగు జనాలు బాగానే ఉన్నాయనే కారణంతోనే కదా తుపాకీ, విజిల్, మాస్టర్ లాంటి వాటిని హిట్లు చేసింది. అదంతా మర్చిపోయి ఏదో అన్యాయం జరిగిపోతోందనే రేంజ్ లో శోకాలు పెట్టడం ఓవర్ డ్రామా.
వీటిని అడ్డుకునేదెవరంటే సమాధానం దొరకదు. డబ్బింగుల వర్షం పడుతూనే ఉంటుంది. ఈ శుక్రవారం లవ్ టుడేకి నాలుగు వందలకు పైగా థియేటర్లు రెడీ అయ్యాయి. వీకెండ్ కి మరింత పెరగొచ్చు. బాలీవుడ్ తోడేలుకి సైతం భారీ ప్లాన్ వేశారు. ఇంతే స్థాయిలో అల్లరి నరేష్ ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గంకు కేటాయిస్తారా అంటే డౌటే. ఇవన్నీ గమనించుకుంటే తమిళ బ్యాచు ఇంతగా పెట్రేగిపోవడానికి మనకు మనమే కారణంగా తోస్తోంది. కఠిన నిబంధనలు పెట్టుకుంటే తప్ప అనువాదాల ప్రవాహాన్ని ఆపడం కష్టమే. మరోవైపు విజయ్ ఫ్యాన్స్ ఏదో తమ హీరోకి అన్యాయం జరుగుతోందన్న రేంజ్ లో శోకాలు పెట్టడం అసలైన కామెడీ ట్విస్ట్.
This post was last modified on November 22, 2022 9:06 am
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…