మొదలుపెట్టిన టైంలో బంగారు బాతులా కనిపించి కాసులు కురిపించిన రీ రిలీజుల ట్రెండ్ కాస్తా ఇప్పుడు వట్టిపోయిన గేదెలా మారిపోయింది. కొందరు డిస్ట్రిబ్యూటర్ల అత్యాశ వల్ల కేవలం అభిమానుల ఎమోషన్ ని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో వరస బెట్టి సినిమాలు దింపడం క్రమంగా తేడా కొడుతోంది. ఆ మధ్య రెబెల్ థియేటర్లలో జనం కనిపించలేదు. తాజాగా బాద్షాకు ఆడియన్స్ రాక కొన్ని చోట్ల షోలు క్యాన్సిల్ చేసే పరిస్థితి. మనల్ని చూసి కోలీవుడ్ జనాలకు ఇదేదో బాగుందే అనే ఆశలు చిగురించాయి. అందులో భాగంగా వాళ్ళు కూడా పాత చిత్రాలను బయటికి తీయడం మొదలుపెట్టారు.
వచ్చే నెల డిసెంబర్ 12 తలైవా రజనీకాంత్ పుట్టినరోజుని పురస్కరించుకుని బాబాని రీమాస్టర్ చేయించి సరికొత్త సౌండ్ తో గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారని చెన్నై అప్డేట్. తెలుగు వెర్షన్ కూడా ఉంటుందట. 2002లో రిలీజైన ఈ బాబా మాములు డిజాస్టర్ కాదు. మొదటి ఆటకే పబ్లిక్ బాబోయ్ అని దండం పెడితే డిస్ట్రిబ్యూటర్లు విపరీతంగా నష్టపోవాల్సి వచ్చింది. దాని భర్తీకే రజని తన పారితోషికంలో సగం మొత్తం వెనక్కు ఇచ్చారనే వార్త అప్పట్లో మీడియాలో మారుమ్రోగిపోయింది. రెహమాన్ సంగీతం కూడా కాపాడలేకపోయింది. దైవత్వానికి కమర్షియల్ టచ్ ఇద్దామని చూసిన ప్రయత్నం బెడిసి కొట్టింది.
అలాంటి కళాఖండం ఇప్పుడు తీసుకురావడం విచిత్రమే. అదేదో బ్లాక్ బస్టర్ నరసింహనో సూపర్ హిట్ అరుణాచలమో సూపర్ క్లాసిక్ బాషానో చేస్తే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు కానీ మరీ ఈ బాబా ఏంటని సినీ ప్రేమికులు వాపోతున్నారు. కొందరికి కల్ట్ క్లాసిక్ అనే ఫీలింగ్ ఉండొచ్చు కానీ తమిళనాడులోనే ఓ మోస్తరుగా ఆడిన బాబా బయట రాష్ట్రాల్లో కొట్టిన దెబ్బ చిన్నది కాదు. మరి ఏ కాన్ఫిడెన్స్ తో దీన్ని సిద్ధం చేస్తున్నారో. అయినా ఫ్యానిజం వెర్రితలలు వేసే తమిళనాడులో బాబాని థియేటర్లలో ఎగబడి చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పైగా చాలా ఏళ్ళుగా టీవీ టెలికాస్ట్ జరగలేదు. అది కూడా ఒక కారణమే అయ్యుంటుంది.
This post was last modified on November 21, 2022 10:47 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…