మొదలుపెట్టిన టైంలో బంగారు బాతులా కనిపించి కాసులు కురిపించిన రీ రిలీజుల ట్రెండ్ కాస్తా ఇప్పుడు వట్టిపోయిన గేదెలా మారిపోయింది. కొందరు డిస్ట్రిబ్యూటర్ల అత్యాశ వల్ల కేవలం అభిమానుల ఎమోషన్ ని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో వరస బెట్టి సినిమాలు దింపడం క్రమంగా తేడా కొడుతోంది. ఆ మధ్య రెబెల్ థియేటర్లలో జనం కనిపించలేదు. తాజాగా బాద్షాకు ఆడియన్స్ రాక కొన్ని చోట్ల షోలు క్యాన్సిల్ చేసే పరిస్థితి. మనల్ని చూసి కోలీవుడ్ జనాలకు ఇదేదో బాగుందే అనే ఆశలు చిగురించాయి. అందులో భాగంగా వాళ్ళు కూడా పాత చిత్రాలను బయటికి తీయడం మొదలుపెట్టారు.
వచ్చే నెల డిసెంబర్ 12 తలైవా రజనీకాంత్ పుట్టినరోజుని పురస్కరించుకుని బాబాని రీమాస్టర్ చేయించి సరికొత్త సౌండ్ తో గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారని చెన్నై అప్డేట్. తెలుగు వెర్షన్ కూడా ఉంటుందట. 2002లో రిలీజైన ఈ బాబా మాములు డిజాస్టర్ కాదు. మొదటి ఆటకే పబ్లిక్ బాబోయ్ అని దండం పెడితే డిస్ట్రిబ్యూటర్లు విపరీతంగా నష్టపోవాల్సి వచ్చింది. దాని భర్తీకే రజని తన పారితోషికంలో సగం మొత్తం వెనక్కు ఇచ్చారనే వార్త అప్పట్లో మీడియాలో మారుమ్రోగిపోయింది. రెహమాన్ సంగీతం కూడా కాపాడలేకపోయింది. దైవత్వానికి కమర్షియల్ టచ్ ఇద్దామని చూసిన ప్రయత్నం బెడిసి కొట్టింది.
అలాంటి కళాఖండం ఇప్పుడు తీసుకురావడం విచిత్రమే. అదేదో బ్లాక్ బస్టర్ నరసింహనో సూపర్ హిట్ అరుణాచలమో సూపర్ క్లాసిక్ బాషానో చేస్తే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు కానీ మరీ ఈ బాబా ఏంటని సినీ ప్రేమికులు వాపోతున్నారు. కొందరికి కల్ట్ క్లాసిక్ అనే ఫీలింగ్ ఉండొచ్చు కానీ తమిళనాడులోనే ఓ మోస్తరుగా ఆడిన బాబా బయట రాష్ట్రాల్లో కొట్టిన దెబ్బ చిన్నది కాదు. మరి ఏ కాన్ఫిడెన్స్ తో దీన్ని సిద్ధం చేస్తున్నారో. అయినా ఫ్యానిజం వెర్రితలలు వేసే తమిళనాడులో బాబాని థియేటర్లలో ఎగబడి చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పైగా చాలా ఏళ్ళుగా టీవీ టెలికాస్ట్ జరగలేదు. అది కూడా ఒక కారణమే అయ్యుంటుంది.
This post was last modified on November 21, 2022 10:47 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…