నట్టి కుమార్ అని టాలీవుడ్ ‘సీనియర్’ ప్రొడ్యూసర్. ఇండస్ట్రీ సమస్యల మీద మాట్లాడుతూ, ఇండస్ట్రీ పెద్దల్ని టార్గెట్ చేస్తూ ఉండే ఈ నిర్మాత చుట్టూ వివాదాలు తక్కువేమీ కాదు. గతంలో ‘లవ్ ఇన్ ఖజుర’ అనే బి-గ్రేడ్ మసాలా మూవీ తీసిన నట్టి కుమార్.. ఆ తర్వాత చాలా సినిమాలే నిర్మించాడు. కానీ వాటిలో చాలా వరకు ఇలా వచ్చి అలా వెళ్లిపోయినవే. చాలా సినిమాలు అసలు విడుదలకే నోచుకోలేదు కూడా.
ఇప్పుడాయన దృష్టి ‘స్పెషల్ షో’ల మీద పడింది. స్టార్ హీరోల పుట్టిన రోజులు, ఇంకేవైనా స్పెషల్ అకేషన్స్ను పురస్కరించుకుని వారి కెరీర్లలో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచిన చిత్రాలను రీ రిలీజ్ చేస్తుండడం తెలిసిందే. పోకిరి, జల్సా, చెన్నకేశవరెడ్డి సినిమాలకు మంచి రెస్పాన్స్ రావడం చూసి నట్టి కుమార్ దృష్టి వీటి మీద పడింది.
ప్రభాస్ పుట్టిన రోజును పురస్కరించుకుని గత నెలలో రెబల్, వర్షం చిత్రాలను రిలీజ్ చేశాడు నట్టి కుమార్. ఈ నెలలో అకేషన్ ఏమీ లేకపోయినా ఎన్టీఆర్ సినిమా ‘బాద్షా’ను రిలీజ్ చేశాడు. అభిమానులతో ఏమాత్రం కోఆర్డినేట్ చేసుకోకుండా తన పాటికి తాను ఈ షోలు వేసుకున్నాడు. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమాలను పెద్దగా ఓన్ చేసుకోలేదు. అభిమానులు ఈ సినిమాలను ఓన్ చేసుకుని కలిసి కట్టుగా సాగితేనే పబ్లిసిటీ వస్తుంది. టికెట్లు తెగుతాయి. ఫుల్స్ పడతాయి. చెప్పుకోదగ్గ వసూళ్లు వస్తాయి. నట్టి కుమార్ ఫ్యాన్స్ను పట్టించుకోకుండా షోలు వేసుకున్నాడు. ఈ చిత్రాల్లో వేటికీ ఆశించిన స్పందన రాలేదు.
ఇప్పుడేమో ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలకు ఫుల్స్ పడలేదని యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కౌంటర్లు వేస్తున్నారు. ఇది ఆ హీరోల అభిమానులకు ఇబ్బందిగా తయారైంది. మొత్తానికి ప్లానింగ్, కోఆర్డినేషన్ లేకుండా ఈ సినిమాలను రిలీజ్ చేసి స్పెషల్ షోల మీద ఉన్న ఆసక్తినే చంపేశాడంటూ నట్టి కుమార్ మీద హీరోల ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
This post was last modified on November 21, 2022 3:59 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…