సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి ముప్పై రోజులు గడచింది. అతని ప్రేయసిగా రియా చక్రవర్తి పేరు ఆరోజునుంచి మీడియాలో, సోషల్ మీడియాలో నలుగుతూనే ఉంది, అయితే ఆమె పబ్లిక్ గా రియాక్ట్ అవడానికి ఇష్టపడలేదు. నెల రోజుల పాటు సోషల్ మీడియాకు దూరమయిన రియా ఇక స్పందించక తప్పలేదు.
తన రెగ్యులర్ అప్డేట్స్ పెడితే ఫాన్స్ తో పాటు మీడియా కూడా ఉతికి ఆరేస్తుంది. అందుకే ముందుగా సుశాంత్ గురించే ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తమ ప్రేమ సంగతిని మొదటిసారి తనంతట తానుగా తెలియజేయడమే కాకుండా, సుశాంత్ లేని లోటు ఎంత వేధిస్తోందో చెప్పుకొచ్చింది. సెలెబ్రిటీలు, స్నేహితులు ఆమెకు ఓదార్పు అందిస్తున్నారు.
అయితే సుశాంత్ అభిమానులు మాత్రం ఆ పోస్ట్ తో కరగలేదు. ఆమెపై తిట్ల దండకం అందుకున్నారు. కామెంట్స్ లిమిట్ చేయని రియా ఓపికగా పలు కామెంట్స్ డిలీట్ చేస్తోంది. కానీ ఫాన్స్ నుంచి వస్తున్న నిరసన ఆగడం లేదు. సుశాంత్ తో అసలు సంబంధం లేని వారినే ఎటాక్ చేస్తున్న ఫాన్స్ ఇక అతని గర్ల్ ఫ్రెండ్ ని వదిలిపెడతారా? కాకపోతే ఈ దాగుడుమూతలు ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి ముందుకు కదలాలి కనుక రియా ధైర్యం చేసేసినట్టుంది.
This post was last modified on July 14, 2020 4:37 pm
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్…