సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి ముప్పై రోజులు గడచింది. అతని ప్రేయసిగా రియా చక్రవర్తి పేరు ఆరోజునుంచి మీడియాలో, సోషల్ మీడియాలో నలుగుతూనే ఉంది, అయితే ఆమె పబ్లిక్ గా రియాక్ట్ అవడానికి ఇష్టపడలేదు. నెల రోజుల పాటు సోషల్ మీడియాకు దూరమయిన రియా ఇక స్పందించక తప్పలేదు.
తన రెగ్యులర్ అప్డేట్స్ పెడితే ఫాన్స్ తో పాటు మీడియా కూడా ఉతికి ఆరేస్తుంది. అందుకే ముందుగా సుశాంత్ గురించే ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తమ ప్రేమ సంగతిని మొదటిసారి తనంతట తానుగా తెలియజేయడమే కాకుండా, సుశాంత్ లేని లోటు ఎంత వేధిస్తోందో చెప్పుకొచ్చింది. సెలెబ్రిటీలు, స్నేహితులు ఆమెకు ఓదార్పు అందిస్తున్నారు.
అయితే సుశాంత్ అభిమానులు మాత్రం ఆ పోస్ట్ తో కరగలేదు. ఆమెపై తిట్ల దండకం అందుకున్నారు. కామెంట్స్ లిమిట్ చేయని రియా ఓపికగా పలు కామెంట్స్ డిలీట్ చేస్తోంది. కానీ ఫాన్స్ నుంచి వస్తున్న నిరసన ఆగడం లేదు. సుశాంత్ తో అసలు సంబంధం లేని వారినే ఎటాక్ చేస్తున్న ఫాన్స్ ఇక అతని గర్ల్ ఫ్రెండ్ ని వదిలిపెడతారా? కాకపోతే ఈ దాగుడుమూతలు ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి ముందుకు కదలాలి కనుక రియా ధైర్యం చేసేసినట్టుంది.
This post was last modified on July 14, 2020 4:37 pm
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…