కొత్త సినిమా రిలీజై థియేటర్లలో సందడి చేస్తున్న టైంలో సీక్వెల్ గురించి చిత్ర బృందం మాట్లాడడం మామూలైపోతోంది ఈ రోజుల్లో. గతంలో చాలామంది ఇలా సీక్వెల్స్ గురించి మాట్లాడి.. సినిమా థియేటర్ల నుంచి వెళ్లిపోగానే సైలెంట్ అయిపోయారు. సినిమా హిట్టయినా సరే.. సీక్వెల్ గురించి ఆలోచించడం కష్టంగా మారిన ఈ రోజుల్లో రిజల్ట్ ఆశించిన మేర రాకుంటే రెండో భాగం చేయడం అసాధ్యమే అవుతుంది.
టాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ ‘యశోద’ విషయంలోనూ దర్శకులు హరి-హరీష్ సీక్వెల్ గురించి హింట్ ఇచ్చారు. సమంత ఒప్పుకుంటే కచ్చితంగా సీక్వెల్ తీస్తామని ప్రకటించారు. సీక్వెల్ కోసం తమ దగ్గర కథకు సంబంధించి ఐడియా కూడా ఉన్నట్లు, అంతే కాక యశోద మూడో పార్ట్ తీయడానికి కూడా లీడ్ ఇప్పటికే ఆలోచించినట్లు తెలిపారు. తమ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సైతం సీక్వెల్ విషయంలో ఆసక్తితో ఉన్నట్లు వెల్డించారీ దర్శక ద్వయం.
ఐతే ‘సమంత’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంతృప్తికర ఫలితం అయితే అందుకోలేదు. తొలి వీకెండ్ వరకు సినిమా బాగానే ఆడింది. వరల్డ్ వైడ్ 7-8 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఆ తర్వాత వసూళ్లు డ్రాప్ అయ్యాయి. ఫుల్ రన్ కలెక్షన్లు రూ.15 కోట్ల లోపే ఉండేలా ఉన్నాయి. ఈ సినిమాకు రూ.22-24 కోట్ల మధ్య థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఆ లెక్కన చూసుకుంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైనట్లే లెక్క.
ఇక సినిమాకు ప్రేక్షకుల నుంచి కూడా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కాన్సెప్ట్ బాగున్నా అనుకున్నంత బాగా తెరకెక్కించలేదనే అసంతృప్తి వ్యక్తమైంది. కథ పరంగా చూసుకుంటే దీన్ని ఇంతకుమించి సాగదీస్తే బాగుండదనే అనిపిస్తోంది. సమంత కూడా రిస్క్ చేయడానికి రెడీగా లేకపోవచ్చు. కాబట్టి యశోద సీక్వెల్ కార్యరూపం దాల్చడం సందేహమే. ప్రస్తుతానికి పబ్లిసిటీ కోసం, సినిమా థియేట్రికల్ రన్ను ఇంకాస్త లాగడానికి ఈ మాట చెప్పినట్లున్నారు.
This post was last modified on November 18, 2022 3:46 pm
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…