కొత్త సినిమా రిలీజై థియేటర్లలో సందడి చేస్తున్న టైంలో సీక్వెల్ గురించి చిత్ర బృందం మాట్లాడడం మామూలైపోతోంది ఈ రోజుల్లో. గతంలో చాలామంది ఇలా సీక్వెల్స్ గురించి మాట్లాడి.. సినిమా థియేటర్ల నుంచి వెళ్లిపోగానే సైలెంట్ అయిపోయారు. సినిమా హిట్టయినా సరే.. సీక్వెల్ గురించి ఆలోచించడం కష్టంగా మారిన ఈ రోజుల్లో రిజల్ట్ ఆశించిన మేర రాకుంటే రెండో భాగం చేయడం అసాధ్యమే అవుతుంది.
టాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ ‘యశోద’ విషయంలోనూ దర్శకులు హరి-హరీష్ సీక్వెల్ గురించి హింట్ ఇచ్చారు. సమంత ఒప్పుకుంటే కచ్చితంగా సీక్వెల్ తీస్తామని ప్రకటించారు. సీక్వెల్ కోసం తమ దగ్గర కథకు సంబంధించి ఐడియా కూడా ఉన్నట్లు, అంతే కాక యశోద మూడో పార్ట్ తీయడానికి కూడా లీడ్ ఇప్పటికే ఆలోచించినట్లు తెలిపారు. తమ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సైతం సీక్వెల్ విషయంలో ఆసక్తితో ఉన్నట్లు వెల్డించారీ దర్శక ద్వయం.
ఐతే ‘సమంత’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంతృప్తికర ఫలితం అయితే అందుకోలేదు. తొలి వీకెండ్ వరకు సినిమా బాగానే ఆడింది. వరల్డ్ వైడ్ 7-8 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఆ తర్వాత వసూళ్లు డ్రాప్ అయ్యాయి. ఫుల్ రన్ కలెక్షన్లు రూ.15 కోట్ల లోపే ఉండేలా ఉన్నాయి. ఈ సినిమాకు రూ.22-24 కోట్ల మధ్య థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఆ లెక్కన చూసుకుంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైనట్లే లెక్క.
ఇక సినిమాకు ప్రేక్షకుల నుంచి కూడా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కాన్సెప్ట్ బాగున్నా అనుకున్నంత బాగా తెరకెక్కించలేదనే అసంతృప్తి వ్యక్తమైంది. కథ పరంగా చూసుకుంటే దీన్ని ఇంతకుమించి సాగదీస్తే బాగుండదనే అనిపిస్తోంది. సమంత కూడా రిస్క్ చేయడానికి రెడీగా లేకపోవచ్చు. కాబట్టి యశోద సీక్వెల్ కార్యరూపం దాల్చడం సందేహమే. ప్రస్తుతానికి పబ్లిసిటీ కోసం, సినిమా థియేట్రికల్ రన్ను ఇంకాస్త లాగడానికి ఈ మాట చెప్పినట్లున్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…