Movie News

యశోద-2.. అంత ఛాన్సుందా?

కొత్త సినిమా రిలీజై థియేటర్లలో సందడి చేస్తున్న టైంలో సీక్వెల్ గురించి చిత్ర బృందం మాట్లాడడం మామూలైపోతోంది ఈ రోజుల్లో. గతంలో చాలామంది ఇలా సీక్వెల్స్ గురించి మాట్లాడి.. సినిమా థియేటర్ల నుంచి వెళ్లిపోగానే సైలెంట్ అయిపోయారు. సినిమా హిట్టయినా సరే.. సీక్వెల్ గురించి ఆలోచించడం కష్టంగా మారిన ఈ రోజుల్లో రిజల్ట్ ఆశించిన మేర రాకుంటే రెండో భాగం చేయడం అసాధ్యమే అవుతుంది.

టాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ ‘యశోద’ విషయంలోనూ దర్శకులు హరి-హరీష్ సీక్వెల్ గురించి హింట్ ఇచ్చారు. సమంత ఒప్పుకుంటే కచ్చితంగా సీక్వెల్ తీస్తామని ప్రకటించారు. సీక్వెల్ కోసం తమ దగ్గర కథకు సంబంధించి ఐడియా కూడా ఉన్నట్లు, అంతే కాక యశోద మూడో పార్ట్ తీయడానికి కూడా లీడ్ ఇప్పటికే ఆలోచించినట్లు తెలిపారు. తమ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సైతం సీక్వెల్ విషయంలో ఆసక్తితో ఉన్నట్లు వెల్డించారీ దర్శక ద్వయం.

ఐతే ‘సమంత’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంతృప్తికర ఫలితం అయితే అందుకోలేదు. తొలి వీకెండ్ వరకు సినిమా బాగానే ఆడింది. వరల్డ్ వైడ్ 7-8 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఆ తర్వాత వసూళ్లు డ్రాప్ అయ్యాయి. ఫుల్ రన్ కలెక్షన్లు రూ.15 కోట్ల లోపే ఉండేలా ఉన్నాయి. ఈ సినిమాకు రూ.22-24 కోట్ల మధ్య థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఆ లెక్కన చూసుకుంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైనట్లే లెక్క.

ఇక సినిమాకు ప్రేక్షకుల నుంచి కూడా మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. కాన్సెప్ట్ బాగున్నా అనుకున్నంత బాగా తెరకెక్కించలేదనే అసంతృప్తి వ్యక్తమైంది. కథ పరంగా చూసుకుంటే దీన్ని ఇంతకుమించి సాగదీస్తే బాగుండదనే అనిపిస్తోంది. సమంత కూడా రిస్క్ చేయడానికి రెడీగా లేకపోవచ్చు. కాబట్టి యశోద సీక్వెల్ కార్యరూపం దాల్చడం సందేహమే. ప్రస్తుతానికి పబ్లిసిటీ కోసం, సినిమా థియేట్రికల్ రన్‌ను ఇంకాస్త లాగడానికి ఈ మాట చెప్పినట్లున్నారు.

This post was last modified on November 18, 2022 3:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

59 minutes ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

2 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

3 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

3 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

5 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

5 hours ago