ఏంటో ఈ మధ్య కొన్ని సినిమాలకు ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా దాన్ని కనీసం ఓ వారం రోజుల పాటు హోల్డ్ చేసుకోవడం పెద్ద సవాల్ గా మారిపోయింది. గత నెల దసరాకు గాడ్ ఫాదర్ వచ్చినప్పుడు బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి. బాలేదని ఎవరూ అనలేదు. కట్ చేస్తే ఇప్పుడది ఏ స్థాయి హిట్టో ఎవరూ చెప్పలేకపోతున్నారు. నిర్మాత ఓన్ రిలీజని చెప్పాక బయ్యర్ల వైపు నుంచి ఎలాంటి కామెంట్స్ లేవు. చిరంజీవి మార్కెట్ రేంజ్ లెక్కల్లో చూసుకుంటే ఇది ఫ్లాప్ కిందే పరిగణించాలి. కాకపోతే ఆచార్య కంటే మెరుగ్గా ఉండటం ఫ్యాన్స్ కి ఊరట కలిగించింది.
ఇప్పుడు యశోద వంతు వచ్చింది. దీనికీ అదే సమస్య. సమంతా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అంటూ సోషల్ మీడియాలో జోరుగా వినిపించింది. ఓసారి నిక్షేపంగా చూడొచ్చని మీడియా సైతం సపోర్ట్ చేసింది. తన అనారోగ్యం గురించి సామ్ ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూ ప్రభావం శని ఆదివారాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్లకు తీసుకొచ్చింది. కట్ చేస్తే సోమవారం నుంచి చాలా డ్రాప్ కనిపిస్తోంది. దానికి తోడు సూపర్ స్టార్ కృష్ణ హఠాన్మరణం జనాల మూడ్ ని పూర్తిగా మార్చేసింది. ఆయన చివరి చూపు తాలూకు టీవీ లైవ్ లు, ప్రముఖుల సందర్శనలను చూడటంతోనే సరిపెడుతున్నారు.
ఈ కారణంగానే నిన్న ఉదయం ఆటలు రద్దయ్యాయి. మొన్న కొన్ని చోట్ల స్వచ్చందంగా బంద్ పాటించారు. ఇవి యశోద వసూళ్ల మీద మరింత ప్రభావం చూపించాయి. ట్రేడ్ టాక్ ప్రకారం యశోదకు పది కోట్లకు పైగా షేర్ వచ్చింది. ఇంకో కోటిన్నర తెచ్చుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఎలా చూసుకున్నా ఇది భారీ మొత్తమే కానీ ఇంకాస్త పెద్ద రేంజ్ ఆశించారు నిర్మాతలు. అయినప్పటికీ హీరో లేకుండా కేవలం తన ఇమేజ్ మీద ఇంత రాబట్టడం చిన్న విషయం కాదు. ఈ వారంలో లవ్ టుడే వాయిదా పడటం హారర్ థ్రిల్లర్ మసూద తప్ప ఇంకే పోటీ లేకపోవడం యశోదకు ఇంకో వీకెండ్ ని సానుకూలంగా మార్చింది. చూడాలి మరి ఎలా వాడుకుంటుందో.
పెద్ది కమర్షియల్ రేంజ్, వసూళ్ల లెక్కలు ఇంకా చాలా దూరం తర్వాత డిస్కస్ చేయాల్సిన మ్యాటర్. కానీ ముందే మాట్లాడుకోవాల్సిన…
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్… పాలనలో తనదైన శైలి కొత్త తరహాతో దూసుకుపోతున్నారు. అంతేకాదండోయ్..…
నాలుగు నెలల తర్వాత ఏపీ తెలంగాణ థియేటర్లు నిండుగా కళకళలాడుతూ కనిపించాయి. కారణం పెద్ది. ఒక పెద్ద స్టార్ హీరో…
ఇండియా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకుంటున్న రామాయణ విడుదలకు జూన్ మినహాయిస్తే ఇంకో నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది.…
వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి…
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…