పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో బెస్ట్ ఆడియో ఏది అంటే ముందు వినిపించే పేరు.. ఖుషి. తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, జానీ, గుడుంబా శంకర్, తీన్మార్, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి సినిమాల ఆడియోలు కూడా సూపర్ హిట్లే.
కానీ ‘ఖుషి’ అన్నింట్లోకి ప్రత్యేకం. అందులో ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం. ఇప్పుడు విన్నా కూడా ట్రెండీగా అనిపిస్తూ.. ఆహ్లాదాన్ని పంచుతాయి ఆ పాటలు. మణిశర్మ కెరీర్లో కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్. ఎంతో శ్రద్ధ పెట్టి చేసినట్లుగా అనిపించే ఈ పాటలకు మణిశర్మ చాలా సమయమే తీసుకుని ఉంటాడని అంతా భావిస్తారు.
కానీ ఈ ఆడియో మొత్తం కేవలం మూడు రోజుల్లో రెడీ చేశాడట మణిశర్మ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయనీ విషయాన్ని వెల్లడించారు. తాను కెరీర్లోనే అత్యంత బిజీగా ఉన్న సమయంలో ‘ఖుషి’ సినిమాకు పని చేయాల్సి వచ్చిందని.. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు టైం పెట్టుకుని వరుసగా మూడు రోజులు పని చేసి ఈ ఆడియో పూర్తి చేశానని.. అన్ని ట్యూన్లూ ఓకే అయిపోయాయని మణిశర్మ తెలిపారు.
తన కెరీర్లో అత్యంత వేగంగా ఆడియో ఇచ్చిన సినిమాల్లో ఇదొకటని ఆయన చెప్పారు. ఇంత తక్కువ టైం తీసుకున్నప్పటికీ.. పాటలు అద్భుతంగా వచ్చాయని, ఆడియో చాలా పెద్ద హిట్టయిందని.. కానీ తన కెరీర్లోనే అత్యంత సమయం తీసుకుని చేసిన ‘మృగరాజు’ ఆడియో మాత్రం అనుకున్నంత స్థాయిలో రీచ్ కాలేదని అన్నారు. ఎంతో కష్టపడి, సమయం తీసుకుని అందులో ఒక్కో పాట చేశామని.. ఆడియో చాలా బాగా వచ్చినప్పటికీ సినిమా ఫ్లాప్ కావడంతో పాటలు ప్రేక్షకులకు చేరలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
This post was last modified on July 14, 2020 2:50 pm
గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…
అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…
ఐపీఎల్ 2025 సీజన్లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెడుతున్న…
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…
సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…