పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో బెస్ట్ ఆడియో ఏది అంటే ముందు వినిపించే పేరు.. ఖుషి. తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, జానీ, గుడుంబా శంకర్, తీన్మార్, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి సినిమాల ఆడియోలు కూడా సూపర్ హిట్లే.
కానీ ‘ఖుషి’ అన్నింట్లోకి ప్రత్యేకం. అందులో ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం. ఇప్పుడు విన్నా కూడా ట్రెండీగా అనిపిస్తూ.. ఆహ్లాదాన్ని పంచుతాయి ఆ పాటలు. మణిశర్మ కెరీర్లో కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్. ఎంతో శ్రద్ధ పెట్టి చేసినట్లుగా అనిపించే ఈ పాటలకు మణిశర్మ చాలా సమయమే తీసుకుని ఉంటాడని అంతా భావిస్తారు.
కానీ ఈ ఆడియో మొత్తం కేవలం మూడు రోజుల్లో రెడీ చేశాడట మణిశర్మ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయనీ విషయాన్ని వెల్లడించారు. తాను కెరీర్లోనే అత్యంత బిజీగా ఉన్న సమయంలో ‘ఖుషి’ సినిమాకు పని చేయాల్సి వచ్చిందని.. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు టైం పెట్టుకుని వరుసగా మూడు రోజులు పని చేసి ఈ ఆడియో పూర్తి చేశానని.. అన్ని ట్యూన్లూ ఓకే అయిపోయాయని మణిశర్మ తెలిపారు.
తన కెరీర్లో అత్యంత వేగంగా ఆడియో ఇచ్చిన సినిమాల్లో ఇదొకటని ఆయన చెప్పారు. ఇంత తక్కువ టైం తీసుకున్నప్పటికీ.. పాటలు అద్భుతంగా వచ్చాయని, ఆడియో చాలా పెద్ద హిట్టయిందని.. కానీ తన కెరీర్లోనే అత్యంత సమయం తీసుకుని చేసిన ‘మృగరాజు’ ఆడియో మాత్రం అనుకున్నంత స్థాయిలో రీచ్ కాలేదని అన్నారు. ఎంతో కష్టపడి, సమయం తీసుకుని అందులో ఒక్కో పాట చేశామని.. ఆడియో చాలా బాగా వచ్చినప్పటికీ సినిమా ఫ్లాప్ కావడంతో పాటలు ప్రేక్షకులకు చేరలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
This post was last modified on July 14, 2020 2:50 pm
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…