పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో బెస్ట్ ఆడియో ఏది అంటే ముందు వినిపించే పేరు.. ఖుషి. తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, జానీ, గుడుంబా శంకర్, తీన్మార్, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి సినిమాల ఆడియోలు కూడా సూపర్ హిట్లే.
కానీ ‘ఖుషి’ అన్నింట్లోకి ప్రత్యేకం. అందులో ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం. ఇప్పుడు విన్నా కూడా ట్రెండీగా అనిపిస్తూ.. ఆహ్లాదాన్ని పంచుతాయి ఆ పాటలు. మణిశర్మ కెరీర్లో కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్. ఎంతో శ్రద్ధ పెట్టి చేసినట్లుగా అనిపించే ఈ పాటలకు మణిశర్మ చాలా సమయమే తీసుకుని ఉంటాడని అంతా భావిస్తారు.
కానీ ఈ ఆడియో మొత్తం కేవలం మూడు రోజుల్లో రెడీ చేశాడట మణిశర్మ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయనీ విషయాన్ని వెల్లడించారు. తాను కెరీర్లోనే అత్యంత బిజీగా ఉన్న సమయంలో ‘ఖుషి’ సినిమాకు పని చేయాల్సి వచ్చిందని.. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు టైం పెట్టుకుని వరుసగా మూడు రోజులు పని చేసి ఈ ఆడియో పూర్తి చేశానని.. అన్ని ట్యూన్లూ ఓకే అయిపోయాయని మణిశర్మ తెలిపారు.
తన కెరీర్లో అత్యంత వేగంగా ఆడియో ఇచ్చిన సినిమాల్లో ఇదొకటని ఆయన చెప్పారు. ఇంత తక్కువ టైం తీసుకున్నప్పటికీ.. పాటలు అద్భుతంగా వచ్చాయని, ఆడియో చాలా పెద్ద హిట్టయిందని.. కానీ తన కెరీర్లోనే అత్యంత సమయం తీసుకుని చేసిన ‘మృగరాజు’ ఆడియో మాత్రం అనుకున్నంత స్థాయిలో రీచ్ కాలేదని అన్నారు. ఎంతో కష్టపడి, సమయం తీసుకుని అందులో ఒక్కో పాట చేశామని.. ఆడియో చాలా బాగా వచ్చినప్పటికీ సినిమా ఫ్లాప్ కావడంతో పాటలు ప్రేక్షకులకు చేరలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
This post was last modified on July 14, 2020 2:50 pm
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…