Movie News

పవన్ బ్లాక్ బస్టర్ ఆడియో.. మూడే మూడు రోజుల్లో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో బెస్ట్ ఆడియో ఏది అంటే ముందు వినిపించే పేరు.. ఖుషి. తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, జానీ, గుడుంబా శంకర్, తీన్‌మార్, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి సినిమాల ఆడియోలు కూడా సూపర్ హిట్లే.

కానీ ‘ఖుషి’ అన్నింట్లోకి ప్రత్యేకం. అందులో ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం. ఇప్పుడు విన్నా కూడా ట్రెండీగా అనిపిస్తూ.. ఆహ్లాదాన్ని పంచుతాయి ఆ పాటలు. మణిశర్మ కెరీర్లో కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్. ఎంతో శ్రద్ధ పెట్టి చేసినట్లుగా అనిపించే ఈ పాటలకు మణిశర్మ చాలా సమయమే తీసుకుని ఉంటాడని అంతా భావిస్తారు.

కానీ ఈ ఆడియో మొత్తం కేవలం మూడు రోజుల్లో రెడీ చేశాడట మణిశర్మ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయనీ విషయాన్ని వెల్లడించారు. తాను కెరీర్లోనే అత్యంత బిజీగా ఉన్న సమయంలో ‘ఖుషి’ సినిమాకు పని చేయాల్సి వచ్చిందని.. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు టైం పెట్టుకుని వరుసగా మూడు రోజులు పని చేసి ఈ ఆడియో పూర్తి చేశానని.. అన్ని ట్యూన్లూ ఓకే అయిపోయాయని మణిశర్మ తెలిపారు.

తన కెరీర్లో అత్యంత వేగంగా ఆడియో ఇచ్చిన సినిమాల్లో ఇదొకటని ఆయన చెప్పారు. ఇంత తక్కువ టైం తీసుకున్నప్పటికీ.. పాటలు అద్భుతంగా వచ్చాయని, ఆడియో చాలా పెద్ద హిట్టయిందని.. కానీ తన కెరీర్లోనే అత్యంత సమయం తీసుకుని చేసిన ‘మృగరాజు’ ఆడియో మాత్రం అనుకున్నంత స్థాయిలో రీచ్ కాలేదని అన్నారు. ఎంతో కష్టపడి, సమయం తీసుకుని అందులో ఒక్కో పాట చేశామని.. ఆడియో చాలా బాగా వచ్చినప్పటికీ సినిమా ఫ్లాప్ కావడంతో పాటలు ప్రేక్షకులకు చేరలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

This post was last modified on July 14, 2020 2:50 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

అమరావతి పోయినా విశాఖ వస్తుందని జగన్ నమ్మకమా?

ఏపీ రాజ‌ధాని ఏది?  అంటే.. ఇప్పుడు చెప్పుకొనే ప‌రిస్థితి లేదు. 2019కి ముందు వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావతి అని చెప్పుకొనే…

2 hours ago

గూగుల్ యాడ్స్ కే గుమ్మరించారు

దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…

2 hours ago

ఏజెంట్ గారూ ఇప్పటికైనా కరుణించండి

సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…

3 hours ago

కల్కి నిర్ణయం ఆషామాషీ కాదు

అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…

3 hours ago

ఆ టైటానిక్ ప్రయాణికుడి వాచ్ ఖరీదు రూ.12.17 కోట్లు

టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…

3 hours ago

కూటమి విజయాన్ని ఖరారు చేసిన వైసీపీ.?

వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…

3 hours ago