తమిళం, హిందీలో కూడా వాళ్లిద్దరే

తెలుగు హీరోల సినిమాలు వేరే భాషల్లో నామమాత్రంగా డబ్ అయ్యేవి ఒకప్పుడు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు మారాయి. మన వాళ్ల సినిమాలు ఒకేసారి బహు భాషల్లో తెరకెక్కుతున్నాయి. వేరే భాషల్లోనూ మన వాళ్లు డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. మహేష్ బాబు ‘స్పైడర్’ సినిమా కోసం తమిళంలో డబ్బింగ్ చెప్పుకున్న సంగతి తెలిసిందే.

ప్రభాస్ కూడా ‘బాహుబలి: ది కంక్లూజన్’కు వాయిస్ ఇచ్చాడు. ఇప్పుడు రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ కోసమని జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పెద్ద సాహసమే చేస్తున్నారు. తెలుగు కాకుండా రెండు భాషల్లో వీళ్లిద్దరూ సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుండటం విశేషం. తమిళంతో పాటు హిందీలోనూ వీళ్లిద్దరి గొంతే వినిపించనుంది.

తెలుగు హీరోలు చాలామందికి తమిళం వచ్చన్న సంగతి తెలిసిందే. వాళ్ల కుటుంబాలు చెన్నై నుంచి ఇక్కడికి వచ్చినవే. దీంతో చిన్నతనంలో తమిళంతో టచ్ ఉంది. ఐతే తారక్, చరణ్ ఊహ తెలిసే సమయం నుంచి హైదరాబాద్‌లోనే ఉన్నారు.

వాళ్లకు తమిళంపై ఏమాత్రం పట్టు ఉందన్నది సందేహమే. చరణ్‌కు ఇంతకుముందు హీందీ మూవీ ‘జంజీర్’లో నటించిన అనుభవం ఉంది. మరి ఆ అనుభవం ఇప్పుడు కలిసొస్తుందేమో చూడాలి. జక్కన్న అంటేనే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ కాబట్టి ప్రతి భాషలోనూ డబ్బింగ్ పక్కాగా ఉండేలా చూసుకుంటాడనడంలో సందేహం లేదు.

ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో వర్క్ ఫ్రమ్ హోం చేస్తోంది ‘ఆర్ఆర్ఆర్’ టీం. తాజాగా రాజమౌళి, కీరవాణి, తమిళ రచయిత మదన్ కార్కీలతో కలిసి ఎన్టీఆర్ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతూ డబ్బింగ్ పని లాగిస్తుండటం విశేషం. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కార్కీ ట్విట్టర్లో షేర్ చేశాడు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడేళ్ళలో పుష్ప 3 సాధ్యమేనా

ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్ప 2 ది రూల్ తర్వాత మూడో భాగం ది ర్యాంపేజ్…

46 seconds ago

బాహుబలి 1 రీ రిలీజ్ – రికార్డులు గల్లంతే

ఈ మధ్య రీ రిలీజుల ట్రెండ్ మళ్ళీ ఊపందుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకి దక్కిన ఆదరణే దానికి సాక్ష్యం.…

5 minutes ago

సునీతా సంపాదన ఎంతో తెలుసా?

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్ ఎనిమిది రోజుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, అనుకోని సమస్యల…

44 minutes ago

ఫ్యామిలీకి దూరంగా.. బీసీసీఐ నిబంధనపై కోహ్లీ అసహనం!

టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ తీసుకున్న కుటుంబ పరిమితి నిబంధనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బీసీసీఐ…

1 hour ago

లాంఛనం పూర్తి… రాజధానికి రూ.11 వేల కోట్లు

నిజమే… నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సెలవు రోజైన ఆదివారం రూ.11 వేల కోట్ల రుణం అందింది. కేంద్ర…

2 hours ago

అక్క బదులు తమ్ముడు… మరో వివాదంలో భూమా

టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు... ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే…

3 hours ago