చిరునవ్వుకు చిరునామాగా.. సంతోషానికి కేరాఫ్ అడ్రస్ లాగా కనిపించే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు పుట్టెడు దు:ఖంలో మునిగిపోయి ఉన్నాడు. ఇప్పుడందరూ ఆయన్ని చూసి అయ్యో అనుకుంటున్నారు. ఈ ఏడాది మహేష్ చూసిన విషాదాలు అలాంటివి. వయసు మీద తల్లిదండ్రులు ఏదో ఒక దశలో దూరం కావడం ఎవ్వరి జీవితంలోనైనా జరిగేదే. కానీ కేవలం నెలన్నర వ్యవధిలో జన్మనిచ్చిన తల్లిదండ్రులిద్దరినీ కోల్పోవడం ఏ మనిషికైనా తట్టుకోవడం కష్టమే. ఇదే పెద్ద విషాదం అంటే.. తన తోడబుట్టిన సోదరుడిని సైతం ఈ ఏడాదే కోల్పోయాడు మహేష్. కేవలం పది నెలల వ్యవధిలో ఈ మూడు పెను విషాదాలు చోటు చేసుకున్నాయి.
ఈ ఏడాది జనవరిలో మహేష్ కొవిడ్ బారిన పడి నాలుగ్గోడలకు పరిమితం అయిన సమయంలో ఆయన సోదరుడు రమేష్ బాబు మృతిచెందారు. తన తోడబుట్టిన వాళ్లలో రమేష్తోనే మహేష్కు అనుబంధం ఎక్కువ అంటారు. మహేష్తో కలిసి సినిమాల్లో నటించడమే కాదు.. తాను సినిమాలకు దూరం అయ్యాక మహేష్ కెరీర్ను ముందుకు తీసుకెళ్లడంలో రమేష్ కీలక పాత్ర పోషించారు. అలాంటి వ్యక్తిని తక్కువ వయసులోనే కోల్పోవడం.. పైగా కరోనా కారణంగా కడసారి చూపుకు కూడా నోచుకోలేకపోవడం మహేష్ జీవితంలో అతి పెద్ద విషాదం.
అంతకుముందు ఏడాదే దశాబ్దాల నుంచి తనకు సినిమాల పీఆర్ వ్యవహారాల్లో అత్యంత కీలకంగా వ్యవహరించే, ఫాదర్ ఫిగర్ లాంటి బీఏ రాజును దూరం చేసుకోవడం మహేష్కు షాక్. తర్వాత అన్నయ్యను కూడా కోల్పోవడం గురించి ‘సర్కారు వారి పాట’ ప్రి రిలీజ్ ఈవెంట్లో చాలా ఎమోషనల్ అయ్యాడు మహేష్. ఇవే పెద్ద విషాదాలు అనుకుంటే నెలన్నర కిందట తనకెంతో ఇష్టమైన తల్లి ఇందిరాదేవిని కోల్పోయాడు. ఆ విషాదం నుంచి తేరుకునేలోపే తండ్రి కృష్ణనూ దూరం చేసుకున్నాడు. మొత్తంగా చూస్తే 2022 సంవత్సరం మహేష్కు ఎప్పటికీ మరువలేని తీవ్ర విషాదాన్ని మిగిల్చిందనే చెప్పాలి.
This post was last modified on November 15, 2022 11:52 am
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…