Movie News

స‌మంత సినిమాకు భ‌లే ఫెసిలిటీ

ఓటీటీల్లో ఈ మ‌ధ్య ఏ కొత్త సినిమా రిలీజైనా వేర్వేరు భాష‌ల్లో ఆడియో అందుబాటులో ఉంటోంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ‌య్యే సినిమాల‌కు మామూలుగానే ఆయా భాష‌ల ఆడియోను జ‌త చేస్తారు. అలా కాకుండా ఏదో ఒక్క భాష‌లోనే తెర‌కెక్కిన సినిమాకు కూడా ఓటీటీలు ప్ర‌త్యేకంగా ఆడియోను జోడిస్తున్నాయి. ఏ భాష‌లో కావాలంటే ఆ భాష‌లో సినిమాను చూసుకునే సౌల‌భ్యం ల‌భిస్తోంది.

ఐతే థియేట‌ర్ల‌లో కూడా ఇలా మ‌న‌కు న‌చ్చిన భాష‌ను సెల‌క్ట్ చేసుకుని చూసుకునే అవ‌కాశం ఉంటే ఎలా ఉంటుంది? ఈ టెక్నాల‌జీ ఇప్పుడు అందుబాటులోకి వ‌స్తోంది. టాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ య‌శోద‌కు ఈ సౌల‌భ్యం ఉండ‌డం విశేషం. ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రిలీజైంది. ఐతే హిందీలో సినిమా చూడాలంటే హిందీ వెర్ష‌న్ ఆడుతున్న థియేట‌ర్‌కే వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగు వెర్ష‌న్‌కే వెళ్లినా హిందీ ఆడియోతో సినిమా చూడొచ్చు.

ఐతే ఇందుకు హెడ్‌సెట్‌తో పాటు మొబైల్లో సినీ డ‌బ్స్ అనే యాప్ అందుబాటులో ఉండాలి. ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని.. చూడ‌బోతున్న సినిమా, మ‌నం వెళ్లిన థియేట‌ర్‌, స‌మ‌యం అన్నీ ఎంట‌ర్ చేసి లాంగ్వేజ్ సెల‌క్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిగ్గా సినిమాకు త‌గ్గ‌ట్లుగా ఆడియో సింక్ అయిపోతుంది. బిగ్ స్క్రీన్ మీద దృశ్యాలు చూస్తూ.. హెడ్ సెట్‌లో ఆడియో వింటూ మ‌న‌కు న‌చ్చిన భాష‌లోనే సినిమాను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

య‌శోద సినిమాకు ఈ సౌల‌భ్యం ఉన్న విష‌యాన్ని చిత్ర బృందం సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించింది. జ‌నం దీనికి అల‌వాటు ప‌డితే మున్ముందు ఇది ఒక ట్రెండ్‌గా మారే అవ‌కాశాలు లేక‌పోలేదు. అది ప్రేక్ష‌కుల‌కు మంచి అనుభ‌వం అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. త‌మిళ ద‌ర్శ‌కులు హ‌రి-హ‌రీష్ క‌లిసి రూపొందించిన య‌శోద‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌నే వ‌స్తోంది.

This post was last modified on November 15, 2022 10:24 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

28 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

5 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago