ఈయన సినిమా కథలు మామూలుగానే ఉంటాయ్ గాని, హీరోలను ఎలివేట్ చెయ్యడానికి పేల్చే డైలాగ్స్ మాత్రం టాప్ లేపేస్తాయ్. అందుకే చాలామంది హీరోలకు హరీశ్ శంకర్తో ఒక్క సినిమా అయినా చెయ్యాలని కోరిక ఉంటుంది. కాకపోతే ఒరిజినల్ సినిమాలు తేడాపడటం.. రీమేక్ సినిమాలు ఆడటం వలన.. చాలామంది స్టార్లు మాత్రం మనోడ్ని రీమేక్ చెయ్యమని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం హరీశ్ చెప్పిన ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే ఒరిజినల్ లైన్ను లైక్ చెయ్యడంతో సీన్ మారిపోయింది అనుకున్నారంత.
ఇక పవన్ తో సినిమా అంటే అదెంత లేట్ అవుతుందో అందరికీ తెలిసిందే. అందుకే హరీశ్ ను బాలీవుడ్ పంపేయాలని మైత్రి మూవీ మేకర్స్ చూస్తున్నట్లు టాక్ వచ్చింది. నిజానికి ముంబాయ్ యాడ్ షూట్ కోసం వెళ్ళిన హరీశ్, అటునుంచటే సల్మాన్ ఖాన్కు స్టోరీ చెప్పాశాడంటూ చాలా రూమర్లు వచ్చేశాయ్. సరే ఒకవేళ ఆ స్టోరీ ఏమైనా కూడా, అసలు బాలీవుడ్ వెళ్ళడం కరక్టేనా అనేదే ఇప్పుడు అందరినీ వేధిస్తోన్న ప్రశ్న. దీనికో రీజన్ ఉంది.
బాలీవుడ్లోనే ఎలాగైనా సినిమా తీయాలని డిసైడైతే.. ఆ సినిమా ఇక్కడ ఎక్కుతుందనే గ్యారంటీ లేదు. ఇప్పటికే 2017లో డిజె దువ్వాడ జగన్నాథం సినిమా తీసిన హరీశ్.. ఆ తరువాత 2019లో గెద్దలకొండ గణేష్ అనే సినిమా మాత్రమే చేశాడు. అంత పెద్ద హిట్టు కొట్టాక కూడా మనోడు ఒరిజినల్ సినిమా చేయలదనే ఫీలింగ్ చాలామందికి కలిగింది. ఇప్పుడు హిందీ సినిమా అని మొదలుపెడితే అది పూర్తయ్యి రిలీజ్ అవ్వడానికి 2024 అయిపోతుంది. అంటే దాదాపు ఐదేళ్లపాటు తెలుగు సినిమాకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఒరిజినల్ తియ్యకుండా దూరమవుతున్నట్లేగా.
ఆ విధంగా చూసుకుంటే హరీశ్ శంకర్ తన తెలుగు కెరియర్ను రిస్క్ చేస్తున్నట్లే అనిపిస్తోంది. నిజానికి ఇక్కడే ఎవరన్నా స్టార్హీరోతో వెంటనే సినిమా తీసి మనోడు గట్టిగా హిట్టు కొడితే బాగుంటుందేమో.
This post was last modified on November 15, 2022 10:21 am
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…