ఈయన సినిమా కథలు మామూలుగానే ఉంటాయ్ గాని, హీరోలను ఎలివేట్ చెయ్యడానికి పేల్చే డైలాగ్స్ మాత్రం టాప్ లేపేస్తాయ్. అందుకే చాలామంది హీరోలకు హరీశ్ శంకర్తో ఒక్క సినిమా అయినా చెయ్యాలని కోరిక ఉంటుంది. కాకపోతే ఒరిజినల్ సినిమాలు తేడాపడటం.. రీమేక్ సినిమాలు ఆడటం వలన.. చాలామంది స్టార్లు మాత్రం మనోడ్ని రీమేక్ చెయ్యమని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం హరీశ్ చెప్పిన ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే ఒరిజినల్ లైన్ను లైక్ చెయ్యడంతో సీన్ మారిపోయింది అనుకున్నారంత.
ఇక పవన్ తో సినిమా అంటే అదెంత లేట్ అవుతుందో అందరికీ తెలిసిందే. అందుకే హరీశ్ ను బాలీవుడ్ పంపేయాలని మైత్రి మూవీ మేకర్స్ చూస్తున్నట్లు టాక్ వచ్చింది. నిజానికి ముంబాయ్ యాడ్ షూట్ కోసం వెళ్ళిన హరీశ్, అటునుంచటే సల్మాన్ ఖాన్కు స్టోరీ చెప్పాశాడంటూ చాలా రూమర్లు వచ్చేశాయ్. సరే ఒకవేళ ఆ స్టోరీ ఏమైనా కూడా, అసలు బాలీవుడ్ వెళ్ళడం కరక్టేనా అనేదే ఇప్పుడు అందరినీ వేధిస్తోన్న ప్రశ్న. దీనికో రీజన్ ఉంది.
బాలీవుడ్లోనే ఎలాగైనా సినిమా తీయాలని డిసైడైతే.. ఆ సినిమా ఇక్కడ ఎక్కుతుందనే గ్యారంటీ లేదు. ఇప్పటికే 2017లో డిజె దువ్వాడ జగన్నాథం సినిమా తీసిన హరీశ్.. ఆ తరువాత 2019లో గెద్దలకొండ గణేష్ అనే సినిమా మాత్రమే చేశాడు. అంత పెద్ద హిట్టు కొట్టాక కూడా మనోడు ఒరిజినల్ సినిమా చేయలదనే ఫీలింగ్ చాలామందికి కలిగింది. ఇప్పుడు హిందీ సినిమా అని మొదలుపెడితే అది పూర్తయ్యి రిలీజ్ అవ్వడానికి 2024 అయిపోతుంది. అంటే దాదాపు ఐదేళ్లపాటు తెలుగు సినిమాకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఒరిజినల్ తియ్యకుండా దూరమవుతున్నట్లేగా.
ఆ విధంగా చూసుకుంటే హరీశ్ శంకర్ తన తెలుగు కెరియర్ను రిస్క్ చేస్తున్నట్లే అనిపిస్తోంది. నిజానికి ఇక్కడే ఎవరన్నా స్టార్హీరోతో వెంటనే సినిమా తీసి మనోడు గట్టిగా హిట్టు కొడితే బాగుంటుందేమో.
రాయలసీమను కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సీమగా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…
బూజు పట్టిన, ప్రజలకు పనికిరాని రూల్స్ను బుట్టదాఖలు చేయాలని సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ…
ప్రమోషన్లు చేసే పద్ధతిని సమూలంగా మార్చిన దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందు వరసలో ఉంటుంది. సినిమాతో సంబంధం లేని…
రాజకీయాల్లోకి రాకముందు తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన జన నాయకుడు ఆరు నెలల తర్వాత విడుదలవుతున్నా కూడా రిలీజ్…
ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…