ఈయన సినిమా కథలు మామూలుగానే ఉంటాయ్ గాని, హీరోలను ఎలివేట్ చెయ్యడానికి పేల్చే డైలాగ్స్ మాత్రం టాప్ లేపేస్తాయ్. అందుకే చాలామంది హీరోలకు హరీశ్ శంకర్తో ఒక్క సినిమా అయినా చెయ్యాలని కోరిక ఉంటుంది. కాకపోతే ఒరిజినల్ సినిమాలు తేడాపడటం.. రీమేక్ సినిమాలు ఆడటం వలన.. చాలామంది స్టార్లు మాత్రం మనోడ్ని రీమేక్ చెయ్యమని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం హరీశ్ చెప్పిన ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే ఒరిజినల్ లైన్ను లైక్ చెయ్యడంతో సీన్ మారిపోయింది అనుకున్నారంత.
ఇక పవన్ తో సినిమా అంటే అదెంత లేట్ అవుతుందో అందరికీ తెలిసిందే. అందుకే హరీశ్ ను బాలీవుడ్ పంపేయాలని మైత్రి మూవీ మేకర్స్ చూస్తున్నట్లు టాక్ వచ్చింది. నిజానికి ముంబాయ్ యాడ్ షూట్ కోసం వెళ్ళిన హరీశ్, అటునుంచటే సల్మాన్ ఖాన్కు స్టోరీ చెప్పాశాడంటూ చాలా రూమర్లు వచ్చేశాయ్. సరే ఒకవేళ ఆ స్టోరీ ఏమైనా కూడా, అసలు బాలీవుడ్ వెళ్ళడం కరక్టేనా అనేదే ఇప్పుడు అందరినీ వేధిస్తోన్న ప్రశ్న. దీనికో రీజన్ ఉంది.
బాలీవుడ్లోనే ఎలాగైనా సినిమా తీయాలని డిసైడైతే.. ఆ సినిమా ఇక్కడ ఎక్కుతుందనే గ్యారంటీ లేదు. ఇప్పటికే 2017లో డిజె దువ్వాడ జగన్నాథం సినిమా తీసిన హరీశ్.. ఆ తరువాత 2019లో గెద్దలకొండ గణేష్ అనే సినిమా మాత్రమే చేశాడు. అంత పెద్ద హిట్టు కొట్టాక కూడా మనోడు ఒరిజినల్ సినిమా చేయలదనే ఫీలింగ్ చాలామందికి కలిగింది. ఇప్పుడు హిందీ సినిమా అని మొదలుపెడితే అది పూర్తయ్యి రిలీజ్ అవ్వడానికి 2024 అయిపోతుంది. అంటే దాదాపు ఐదేళ్లపాటు తెలుగు సినిమాకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఒరిజినల్ తియ్యకుండా దూరమవుతున్నట్లేగా.
ఆ విధంగా చూసుకుంటే హరీశ్ శంకర్ తన తెలుగు కెరియర్ను రిస్క్ చేస్తున్నట్లే అనిపిస్తోంది. నిజానికి ఇక్కడే ఎవరన్నా స్టార్హీరోతో వెంటనే సినిమా తీసి మనోడు గట్టిగా హిట్టు కొడితే బాగుంటుందేమో.
This post was last modified on November 15, 2022 10:21 am
ఏపీ ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వాన్ని చక్కటి సమన్వయంతో ముందుకు నడిపిస్తున్న చంద్రబాబుకు 10 నెలలు పూర్తయ్యాయి. గత ఏడాది జూన్…
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…