మామూలుగానే తన మీద ఒక చిన్న రూమర్ వచ్చినా కూడా.. మీడియా చాలా చీప్ అంటూ మండిపడుతుంది టెన్నిస్ సంచలనం సానియా మీర్జా. అయితే అమ్మడు టెన్నిస్ నుండి దూరమయ్యాక అస్సలు న్యూస్లో లేకుండా పోతోంది. సరిగ్గా ఇదే సమయంలో.. తన పాకిస్తానీ భర్త, క్రికెటర్ షోయబ్ మాలిక్ నుండి విడాకులు తీసుకోనుంది అనే వార్త వైరల్ అయిపోయింది. ఈ సమయంలో షోయబ్ కూడా ఒక పాక్ హీరోయిన్తో కలసి కనిపించడం, ఆ వార్తలు నిజమనే అందరూ నమ్మారు. కాని సడన్గా ఒక ఊర్దూ ఓటిటి యాప్ మాత్రం.. ‘ది మీర్జా మాలిక్ షో’ వస్తోందంటూ ప్రకటన ఇచ్చేసింది.
ఒక ప్రక్కన ఈ ప్రకటనను ఎండార్స్ చేస్తూ అటు షోయబ్ కానీ ఇటు సానియా కాని ఒక్క ట్వీట్ లేదా ఇనస్టాగ్రామ్ పోస్ట్ చేయకపోవడం ఆశ్చర్యకరంగానే ఉన్నా కూడా, అసలు డైవర్స్ అంటూ వార్తలొచ్చాక ఇలా ప్రోగ్రామ్ ఎనౌన్స్మెంట్ ఏంటంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అంటే జనాల్లో హైప్ క్రియేట్ చేయడానికి సానియానే ఇటువంటి డైవర్స్ రూమర్లను పుట్టించి, దాని చుట్టూ జనమందరూ డిస్కస్ చేసుకుంటున్న తరుణంలో ఈ కొత్త టాక్-షో గురించి పబ్లిసిటీ మొదలుపెట్టిందా అంటూ అవాకులు చివాకులు పేలుతున్నారు నెటిజన్లు. అయితే సానియా ఎంత చేసినా కూడా, ఒక పాకిస్తానీ షో కోసం ఇటువంటి హడావుడి చేస్తుందా అంటూ మరో వర్గం విమర్శిస్తోంది. ఏదేమైనా సానియా సైలెన్స్ మాత్రం డేంజరస్గానే ఉంది.
ఒకవేళ సానియా విడాకులు తీసుకున్నా తీసుకోకపోయినా కూడా.. కెరియర్ పరంగా ప్రస్తుతం ఈమె పెద్దగా చేస్తున్నదేం లేదు. రిటైర్ అయ్యాక క్రికెట్ లవర్స్ చాలామంది సచిన్ టెండుల్కర్ను ఆల్మోస్ట్ ఎలా మర్చిపోయారో.. ఇప్పుడు సానియా పరిస్థితి కూడా అంతే. అయితే అటువంటి టాక్ షో లాంటివి ఇండియాలో చేసుకుంటే మాత్రం అమ్మడికి మాంచి పాపులార్టీ వచ్చే ఛాన్సుంది. చూద్దాం ఏమవుతుందో మరి.
This post was last modified on November 15, 2022 10:18 am
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…
వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…